Friday, 8 July 2011

Ramayanam Titbits


రామావతారం ఎలా అంతమయ్యింది? 
యమునికీ, రామునికి సంభాషణ జరుగునప్పుడు హనుమకి ద్వారమునకు కాపలాదారుగా ఉండమంటారు. ఎవరయినా లోపలికి వచ్చినచో వారికి శిరచ్ఛేదము చేయమని యముడు రాముని కోరతాడు. రాముడు అలానే అజ్ఞాపిస్తాడు. అయితే, హనుమ దూర్వాసుని శాపం వలన రాముడు, రామరాజ్యం వినాశనమవ్వడం కన్నా తన శిరసు ఖండించుకోవడం మేలని లోపలికి వచ్చేస్తాడు. యముడు అన్న మాట ప్రకారం హనుమకి శిరఛ్చేదన చేయమని రామునితో అనగా దుఃఖితుడైన రామునితో అతని గురువు వశిస్టుడు ఓ మాట అంటాడు. నీకు ఎంతో ప్రీతిపాత్రుడైన ఈ హనుమను ఈ రాజ్యము నుండి, నీ దర్శనము నుండి దూరము చేసిన అది అతనికి శిరచ్ఛేదముతో సమానమగునని వశిస్టుడు చెప్పిన పిదప రాముడు హనుమని తనకు దూరముగా పొమ్మని ఆజ్ఞాపించెననీ హనుమ రామాజ్ఞ శిరోధార్యంగా దాల్చి అక్కడి నుండి నిష్క్రమించెనని, ఆనక రాముడు తన అనుజుల సహితంగా సరయూ నదిలోకి ప్రవేశించి తన అవతారం చాలించెను అని నాకు తెలిసిన భాగము.

వానరులలో రాముడికంటే ముందు జన్మించిన వారెవరు?
రామాయణం బాలకాండ 17 వ సర్గ ఆధారణ్గా జాంబవంతుడు రామావతారం కంటే ముందుగానే జన్మించినట్లు తెలియుచున్నది. రామావతారం అయిన తదుపరి బ్రహ్మగారి ప్రేరణతో వివిధ దేవతల అంశల ప్రభావంగా వాలి, సుగ్రీవ, నల, హనుమంత మొదలగు వారు పుట్టిరి. దీనిని బట్టి వానరులలో రాముల వారికంటే ముందు జన్మించినది కేవలం జాంబవంతుడే.

అంజనేయుడి తండ్రి ఎవరు?
అంజనాదేవి, వానర రాజు అయిన కేసరిల యొక్క పుత్రుడు అంజనేయస్వామి. అంజనాదేవి సంతానం కోసం వేంకటాచలం (ప్రస్తుత తిరుపతి కొండ) మీద తపస్సు చేయగా శివుని ఆజ్ఞతో వాయుదేవుడు శివతేజమును అంజనాదేవి గర్భమున ప్రవేశపెట్టెను. అందుకే అంజనేయస్వామి శివాంశ, వాయుపుత్రుడు, కేసరినందనుడుగా పిలువబడుతాడు.