Friday, 21 April 2017

ద్రోణాచార్యుడు






ద్రోణాచార్యుడు

జీవితం మనదైనప్పుడు ఆలోచన మనది కావాలి. ఆచరణా మనది కావాలి. సంపూర్ణమైన స్వేచ్ఛకూడా కావాలి. కానీ చాలాసార్లు అలా జరుగదు. మనదైన జీవితం మనకు తెలియకుండానే పరాధీనతలోకి వెళ్ళిపోతుంది. పరతంత్రంలో బతకాల్సిన పరిస్థితికి తావిస్తుంది. అప్పుడు తప్పుమనదా! మన జీవితానిదా! అంటే, అవసరానిదనీ, తలరాతే తల ఒగ్గేలా చేస్తుందనీ మనదైన జీవితం పరాధీనం అయ్యే సమయానిదనీ చెప్పక తప్పదు. జీవితం అస్తిత్వాన్నే కాదు స్వాభిమానాన్నీ ఇస్తుంది. కానీ మన చేతుల్లో లేని జీవితానికి అభిమానం రుచించదు. ఒకవేళ స్వాభిమానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితుల ప్రాభవం అభిమాన మూలాల్నే తుడిచిపెట్టుకుని పోతుంది. బతికినన్ని రోజులూ మన జీవితంలో మనం లేకపోతే మనకూ, మన జీవితానికీ అర్థం లేనట్లే కదా! అయినా కొన్ని జీవితాలు అంతే.. అటువంటి పరతంత్ర పరాధీనతలో నలిగిపోయిన ద్రోణుని జీవితం కోణంలో మన జీవితం స్వరూపాన్ని చూసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలోనైనా మన జీవితం పరాధీనం తప్పదు. ద్రోణాచార్యుని పారతంత్ర చరితం భావగర్భితం.

ద్రోణుడు భరద్వాజుని పుత్రుడు. ఈతని భార్య కృషి. కొడుకు అశ్వత్థామ. తండ్రి దగ్గరే సకలవిద్యలూ నేర్చుకున్నాడు. అగ్నివేశుడనే ముని దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నాడు.

ద్రుపదుడూ, ద్రోణుడూ చిన్ననాటి మిత్రులు. కానీ వీరి జీవన స్థాయిలో ఆకాశానికీ, భూమికీ ఉన్న అంతరం. ద్రోణుని అపారమైన విద్యానైపుణ్యాలు అతని పేదరికంతో మరుగున పడిపోయాయి. తనకూ పాలు కావాలని మారాం చేశాడు. పిల్లవాడికి పాలను కూడా సమకూర్చలేని తన దీనస్థితికి తానే చింతిస్తూ డబ్బుకై వెదుకులాడగా పరశురాముడు చాలా దానాలు చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళతాడు. అయితే ద్రోణుడు అక్కడికి వెళ్ళే సమయానికి పరశురాముడు సమస్తాన్నీ దానం చేసేస్తాడు. ద్రోణున్ని వట్టి చేతులతో పంపడం ఇష్టం లేక అస్త్రయోగ రహస్యాన్ని నేర్పుతాడు.

ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ బాల్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయగా ద్రుపదుడు రాజకుటుంబీకులకూ, పేదవారికీ మధ్య స్నేహ సంబంధం అసంభవమని అవహేళన చేసి మాట్లాడుతాడు. ఆర్థిక సహాయం చేయమని అర్థించినా ద్రోణుని అవమానించి వెళ్ళగొడతాడు. ఆ అవమానాగ్నితో బాధపడుతూ ద్రోణుడు ఆ ఊర్లో ఉండలేక తన భార్యనూ, కొడుకునూ వెంటబెట్టుకొని తనకు చెల్లెలినిచ్చి పెళ్ళి చేసిన బావ కృపాచార్యుని దగ్గరకు హస్తినాపురానికి వస్తాడు.భీష్ముని ఆజ్ఞమేరకు కృపాచార్యుని దగ్గరే శిష్యరికం చేస్తున్న కురుపాండవులు ఒకనాడు ఆడుకుంటూ బంతిని బావిలో పడేస్తారు. దాంట్లోంచి బంతిని ఎలా తీయాలో తెలియక సతమతమవుతున్న వారిని చూసి ఆ బంతిని నేను తీయగలనని చెప్పి గడ్డిపరకలనే అస్ర్తాల్లాగ ప్రయోగించి సునాయాసంగా బయటకు తీసి వారిచేతిలో బంతిని పెడతాడు ద్రోణుడు. ఈతని గొప్పదనాన్ని భీష్మునికి పరిచయం చేస్తారు కురుపాండవులు.

భీష్మునికి తన గురించిన పూర్తి వివరాలూ సత్యభాసితంగా చెప్పిన ద్రోణుడి ఉదాత్తతకు చలించి భీష్ముడు కురుపాండవులకు అస్త్ర విద్యాభ్యాసం చేయాలనీ వేడుకొని ధనధాన్య వస్త్ర, వస్తువులతో సత్కరించి ఆదరిస్తాడు. ఆనాటి హస్తినలో కురుపాండవులకు గురువుగా స్థిరపడిన ద్రోణుడు వారిని మంచి నిపుణులుగా తీర్చిదిద్దుతాడు. అర్జునునికి ప్రత్యేకంగా విలువిద్యను నేర్పి తనను మించిన వాడుగా చేస్తాడు. నిజానికి అర్జునునిపై గల పక్షపాతంతో ఏకలవ్యుని దగ్గర బోటనవేలిని గురుదక్షిణగా తీసుకొని తన గురుత్వానికి తగిన న్యాయం చేయలేకపోయాడు ద్రోణుడు. అన్నం పెట్టినందుకు తీర్చుకునే ఋణంగా భావించాడు.

కురుపాండవుల విద్యాభ్యాసం ముగియగానే తనకు గురుదక్షిణగా ద్రుపదున్ని ప్రాణాలతో పట్టి తెచ్చి నాకు అప్పగించమని కోరాడు. అందరూ ప్రయత్నించారు. కానీ చివరికి అర్జునుడు విలువిద్యా నిపుణుడైన ద్రుపదున్ని బంధించి తెచ్చాడు. ద్రుపదుని రాజ్యాన్ని తాను తీసుకొని అందులోని సగభాగాన్నే భిక్షగా ద్రుపదునికిచ్చి ఇప్పుడు మన స్నేహంలో సమానత్వం ఉందని చెప్పి అతణ్ని ప్రాణాలతో వదిలేస్తాడు ద్రోణుడు. అర్జునునికి తన సమస్తాన్నీ నేర్పి తనతో ప్రతియుద్ధం చేయరాదని మాట తీసుకుంటాడు ద్రోణుడు.

ద్రోణాచార్యుడు తన శిష్యులైన కురుపాండవుల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి వ్యథ చెందుతుండేవాడు.

లక్క ఇంట్లో పాండవులు మరణించారని తెలిసి చాలా దుఃఖించిన ద్రోణుడు వారు బతికే ఉన్నారనీ ద్రౌపదిని పెళ్ళి చేసుకున్నారనీ తెలుసుకొని సంతోషించాడు. పాండవులను నాశనం చేసేందుకు కౌరవులు చేస్తున్న ప్రయత్నాలకు వత్తాసు పలుకకపోగా ద్రోణుడు వాటిని వ్యతిరేకిస్తే దుర్యోధనుడు ఈతన్ని పాండవ పక్షపాతిగా చూసేవాడు. కానీ భీష్మ ధృతరాష్ర్టులు ద్రోణున్ని గౌరవించే పద్ధతికి జీవితమంతా కట్టుబడే ఉన్నాడు ద్రోణుడు. కురుక్షేత్ర యుద్ధంలో గురువుగా తన ఆశీస్సులను పాండవులకిచ్చి, ఒక రాజసేవకునిలా కురుపక్షంలో పోరాడాడు ద్రోణుడు. కర్ణ దుర్యోధనులు ఎంత తులనాడినా తనకు జీవితాన్నిచ్చిన భీష్ముని ఆదరణకు తలొగ్గాడు ద్రోణుడు.

అంపశయ్యపైకి భీష్ముడు చేరుకోగానే ద్రోణుడు సర్వసేనాధిపత్యం వహించాల్సి వచ్చింది. ధుర్యోధనుని ఆలోచన మేరకు ధర్మరాజుని సజీవంగా బంధిస్తానని వాగ్థానం చేస్తాడు ద్రోణుడు. విశ్వ ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. పాండవులకు ద్రోణుని వీరోచిత యుద్ధ విహారం కూడా ఆటంకం కలిగించింది. ఇంతలో అశ్వత్థామ చనిపోయినట్టూ అది ద్రోణుని కొడుకు కాదు ఏనుగనే విషయం ద్రోణునికి వినిపించకుండా ఎత్తువేసి యుద్ధం నుంచి పక్కకు వచ్చేలా చేశారు పాండవులు. ధర్మరాజు మాటలు నమ్మి కుప్పకూలిపోయాడు. దుష్టద్యుమ్నుని చేతిలో చివరికి మరణించాడు. పాండవులూ కౌరవులపైన ద్వేషంతో ద్రోణున్ని నిందించారు. కౌరవులు ద్రోణుడు పాండవ పక్షపాతని భావించి తులనాడారు. ఏది ఏమైనప్పటికీ ద్రోణుడు తన పరిస్థితుల కారణంగా గురుపదాన్ని చేపట్టాల్సి వచ్చింది. ధర్మాధర్మాల వ్యత్యాసం తెలిసినా రాజధర్మానికి తలొగ్గి ఏకపక్షంలో తన జీవితం నడిపించాల్సి వచ్చింది. తన భావాలకూ, మానసిక సంఘర్షణలకూ అన్యాయం చేసుకోవాల్సి వచ్చింది. పరతంత్ర పరీక్షలో స్వేచ్ఛను ఫణంగా పెట్టాల్సి వచ్చింది. పరాధీనతలో నలిగిపోయిన దిగ్గజమే ద్రోణాచార్యుడు.


ఇట్టేడు అర్కనందనా దేవి




దశరథుడు






దశరథుడు

యథా రాజా తథా ప్రజా అన్న నానుడిని నిజం చేసి చూపించడమే కాదు, తాను తలచిందే రాజ్యమంతా ఏకీభవించేలా పాలించిన ఘనుడై చరిత్రలో నిలిచిపోయాడు. మనిషంటే, ధర్మమంటే, రాజ్యమంటే ప్రజల మనోభావాలంటే ఆచారాలంటే సంప్రదాయాలంటే, విలువలంటే, భూలోక స్వర్గమంటే ఏమిటో చరిత్రకు పరిచయం చేసిన దశరథుడు నిజమైన మహారాజు, మనసున్న చక్రవర్తి.

ఇక్షాకువంశం మహామహులను ప్రపంచానికి ఇచ్చింది. అజుని కొడుకే దశరథుడు. వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే కాదు. మంచితనానికి పరాకాష్టగా బతికాడు. పరాక్రమమంటే ఇతనిదే. దశరథుని పరిపాలనలో ప్రజలకు బాధలంటే ఏంటో తెలియదు. ఈ మహారాజు చతురంగ సేనకు పెట్టింది పేరు. శత్రువులకు దశరథుడంటే మృత్యువే. అదే శరణని ఆశ్రయం పొందిన వారికి సమస్తం సమకూర్చే ఆపన్నహస్తం. దశరథుని స్నేహాన్ని కోరిన వారెందరో దశరథుని తమ కుటుంబంలో ఒకరిగా భావించి ఆదరాభిమానాలనూ, విశిష్టమైన గౌరవాన్నీ చూపిస్తూ విలువైన కానుకలను సమర్పించుకునేవారట పొరుగు రాజులూ, చక్రవర్తులు.దశరథునికి కౌసల్యా, సుమిత్ర, కైకేయిలనే ముగ్గురు భార్యలు. అశ్వమేథయాగం చేసి అయోధ్యా నగరానికీ, రాజ్యానికీ శోభ తీసుకొచ్చిన వాడై పుత్రకామేష్టితో రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే పుత్రులూ పొంది పరిపూర్ణ కుటుంబానికి రూపమిచ్చాడు దశరథుడు. ఈతనికి శాంత అనే పుత్రిక కూడా ఉంది. తన పుత్రుడైన రోమపాదునికి దత్తతగా తన కూతురును ధారపోశాడు. శాంతను ఋష్య శృంగునికిచ్చి పెళ్ళి చేశాడు రోమపాదుడు. వారిద్దరే పుత్రకామేష్టి యాగం చేయించి దశరథునికి సంతానం కలిగేలా చేశారు. వారి పట్ల సదా కృతజ్ఞుడై మెదిలాడు దశరథుడు.దశరథ మహారాజుకు తన ప్రధాన పురోహితులైన వశిష్ట, వామదేవులంటే అమితమైన గౌరవం. ఎనిమిది మంది ముఖ్య మంత్రుల్లో సుమంత్రుడంటే ప్రత్యేకమైన అభిమానం, చొరవ. ఏ సమయంలోనైనా అంతఃపురంలోకి, తన జీవితంలోకి వచ్చేంత అధికారమిచ్చాడు సుమంత్రునికి. కోసల రాజ్యానికి ఎనిమిది దిక్కులై నిత్యపర్యవేక్షణ చేసి ఎనిమిది మంది మంత్రులూ యంత్రాంగంలో ఆరితేరిన దిట్టలు. దశరథుని మాటంటే వీరికి వేదవాక్కు. అపారమైన ధర్మనీతిని తన రాజ్యంలో స్థాపించాలన్న దశరథుని సంకల్పానికి ఊతమందించిన తన మంత్రివర్గం అంటే తనకి వల్లమాలిన నమ్మకం.దశరథుని జీవితం, సమయం పాలనకే అంకితం చేశాడు. ప్రజలపై పన్నుభారం వేయలేదు. తన రాజ్యాంలోని వారికి భయమనేదే లేదు. ఆకలి బాధలు లేవు.

ప్రతీ ఇల్లూ సర్వసమృద్ధిగా కళకళలాడుతూ ఉండేది అయోధ్యలో. అక్కడ పెట్టేవారే తప్ప అడిగేవారే ఉండేవారు కాదు. ఆతిథ్యమంటే అయోధ్యలోనిదే అనేంత గొప్పగా ఉండేది. ప్రజలంతా దశరథుని కనుసన్నలలో తృప్తిగా బతికేవారు. ఆయన ఆలోచనను అర్థం చేసుకొని మెలిగేవారు. సత్యం, ధర్మం, న్యాయం ప్రజల నైజంగా మారాయి. వారి ఇళ్ళలో, జీవితాల్లో లేదు అన్న మాటే లేదు. అందరూ ధనవంతులే గుణంలోనూ, ధనంలోనూ.. మహిళలు గౌరవం పొందాలనేది దశరథుని ధర్మం. అదే రాజ్యధర్మం. ధర్మం కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా వదిలేసేంత మహాత్ములు అయోధ్యా పురవాసులు. నాస్తికత్వం అన్నమాటే లేదు. అసలు అయోధ్యంటే అపరవైకుంఠం. కుబేరునికే అరువిచ్చేంత ధనసంపదకు నెలవు అయోధ్య. ప్రపంచంలోని వైభవమంతా అయోధ్యలోనే ఉందంటే అతిశయోక్తి లేదు. అంతటి అయోధ్యకు రూపమిచ్చిన మహారాజు దశరథుడు.అయోధ్య ప్రజలకీ దశరథుని ఆజ్ఞంటే సదా సంసిద్ధులమేనన్న భావస్వామ్యం ఏర్పరచుకున్న గొప్పతనం చూసి మైమరిచిపోయి హరి రాముడై జన్మించాడేమో. ఎంతటి వైభవమో అంతటి వినయం దశరథునిది. సున్నితమైన మనసు, అపారమైన మేథస్సు, ఆరితేరిన పరాక్రమం, ప్రపంచంతో ఏర్పరచుకున్న భావసారూప్యత దశరథుని జీవితంలోని ఒక కోణం మాత్రమే. మరో కోణంలో అనుకోకుండా జరిగిపోయిన తప్పు, ఇచ్చిన మాట వికటించిన వైనం దశరథుని జీవితాన్నే అనూహ్యంగా మలుపుతిప్పాయి. అన్నింటినీ అందరికీ సమకూర్చినవాడైనా తనపట్ల తాను అన్యాయం చేసుకున్నాడు. కష్టాన్ని తట్టుకొని నిలబడేంత గుండెధైర్యం లేక కుప్పకూలిపోయిన సున్నితుడు దశరథుడు.దశరథుడు ఒకనాడు వేటకు వెళ్ళి దూరం నుంచి సరిగా కనిపించక వేటనుకొని ఒక పిల్లవాణ్ని బాణంతో కొట్టగా అతను గట్టిగా అరుస్తాడు. దగ్గరికెళ్ళి చూస్తే తన తల్లిదండ్రులకు దాహం తీర్చడానికని నీటి కోసం వచ్చిన పిల్లవాడు చేసేదేమి లేక వారికి నీరిచ్చి విషయం చెబుతాడు. కానీ వారు బాధలో దశరథుని పుత్రశోకంతో మరణిస్తానని శపిస్తారు. అదే జరిగింది. ఇక శంబరాసురునితో యుద్ధం చేసేప్పుడు సాయపడిన కైకేయికి ఇచ్చిన రెండు వరాలూ తనకత్యంత ఇష్టమైన రాముని విషయంలో శాపంగా మారడం తనకు శాపమని భావించి మరణించిన దశరథుని గాథ హృదయ విదాకరం.

-ప్రమద్వర



Tuesday, 18 April 2017

జయమ్ - భారతమ్ - మహాభారతమ్

మహాభారతం కురువంశ చరిత్ర. కురువంశానికి మూలం చంద్రవంశం. చంద్రవంశానికి ఆద్యుడు ‘చంద్రుడు’. ఈ వంశ పరంపరలో, చంద్రుడి తర్వాత వచ్చిన రాజుల్లో దుష్యంతుడి కొడుకు ‘భరతుడు’ వంశకర్త. భరతుడి పేరుమీద ‘చంద్రవంశం’, ‘భరతవంశం’ అయింది. మనదేశం ‘భారతదేశం’ అయింది.

భరతుడికి అయిదు తరాల తర్వాత వచ్చిన రుక్షుడు అనే రాజుకు ‘సంవరణుడు’ అనే కొడుకు పుట్టాడు. ఈ సంవరణునికి, తపతికి పుట్టిన సంతానం ‘కురువు’. ఇతడు వంశకర్త. భరతవంశం ‘కురువంశం’గా వ్యవహారానికి వచ్చింది.

ధృతరాష్ట్రుడి కుమారులు ధార్తరాష్ట్రులు. పాండురాజు కొడుకులు పాండవులు. ధార్తరాష్ట్రులు, పాండవులు - అందరూ కౌరవులే! ‘ధార్తరాష్ర్టులు’ పలకడంలో క్లిష్టత ఉంది. ఆ కారణంగా వారిని కౌరవులు అనడం మొదలైంది. అదే ‘కౌరవులు’ పదాన్ని పాండురాజు కొడుకులకు కూడా ఉపయోగిస్తే ఎవరు ఎవరని సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి, పాండురాజు కొడుకులు ‘పాండవులు’ అయ్యారు.

దాయాదుల మధ్య వైరం ఇంత వినాశనానికి దారితీసిందే - ఈ చరిత్రకు కావ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వ్యాసుడికి. మొదట వ్యాసుడు రాసిన కావ్యం ‘జయమ్’. మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడు సంవత్సరాల కాలంలో పూర్తిచేశాడు. యుద్ధంలో మరణించిన వీరులకు అంతిమ సంస్కారాలు చేసి, ధర్మరాజు హస్తినలో అడుగుపెట్టడంతో ‘జయమ్’ పూర్తవుతుంది. ఈ  కావ్య నిడివి 8800 శ్లోకాలు మాత్రమే! ఈ శ్లోకాలు అన్నీ మహాభారతంలోని లక్ష శ్లోకాలలో కలసిపోయి ఉన్నాయి.

సౌతి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఆ గ్రంథం ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు కలది. ఆ శ్లోకాలు నాకు తెలుసు. శుకుడికి తెలుసు. సంజయుడికి తెలుసో తెలియదో (అష్టౌ శ్లోక సహస్రాణి హ్యష్టౌ శ్లోక శతానిచ, అహంవేత్తి శుకోవేత్తి సంజయో వేత్తివానవా - అనుక్రమణికాధ్యాయం)’’ అన్నాడు.

ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 1535లో మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కురువంశం దాదాపు నశించి పాండవుల వారసుడిగా అభిమన్యుడి కొడుకు పరిక్షిత్తు మిగిలాడు. అతడికి 36 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కృష్ణుడు మరణించాడు. పాండవులు కోరికలు చంపుకొని స్వర్గారోహణ కోసం దేవభూములున్న హిమాలయ పర్వతాలకు వెళ్లడానికి ముందు పరిక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడికి, ఒక వైశ్య కన్యకు పుట్టిన యుయుత్సుణ్ని సంరక్షకుడిగా ఉండమన్నారు. పరిక్షిత్తు 60 సంవత్సరాల పాటు రాజ్యంచేసి కొడుకు జనమేజయుడికి పట్టం కట్టాడు. ఆ జనమేజయుడు వయసు మీరుతున్న సమయంలో సర్పయాగం చేశాడు.

జనమేజయుడు సర్పయాగం సంకల్పించినప్పుడు వైశంపాయనుడు కౌరవ పాండవుల చరిత్రను చెప్పాడు. వైశంపాయనుడు చెప్పింది వ్యాసమహర్షి చెప్పిన జయం కావ్యాన్నే. అయితే మధ్యమధ్యలో జనమేజయుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఎన్నో సందేహాలు వెలిబుచ్చాడు. వాటన్నిటికీ వైశంపాయనుడు సమాధానాలు చెప్పాడు. వాటన్నిటినీ కలుపుకొని జయేతిహాసం నిడివి పెరిగింది. 24,000 శ్లోకాలతో వైశంపాయనుడు చెప్పిన జయం ‘భారతం’ అయింది.

వైశంపాయనుడు భారతకథను చెప్పినప్పుడు ఎందరో సూతులు విని ఉంటారు. ఆ విన్నవారిలో ఉగ్రశ్రవసుడు ఒకడు. ఆ సూతుడు భారతాన్ని మననం చేసుకొని తన శిష్యులకు నేర్పి ఉంటాడు.

ఉగ్రశ్రవసుడి ద్వారా భారతం నేర్చుకొన్న సౌతి నైమిశారణ్యంలో శౌనకాది మునులు ‘దీర్ఘసత్త్రం’ చేసినప్పుడు వారికి వినిపించాడు. వింటున్న మునులు మరింకెన్నో ప్రశ్నలు వేయడం, సౌతి ఉపాఖ్యానాలు చేర్చి మునులను తృప్తిపరచడంతో భారతం నిడివి మరింత పెరిగింది. సౌతి ఒక్కడే కాదు, ఆ తర్వాత వచ్చిన పౌరాణికులు సందర్భానికి తగినట్లు ఎన్నెన్నో కథలను, నీతులను చేర్చి ఉంటారు. రామాయణం, నలదమయంతుల కథలు కూడా భారతంలో చేరిపోయాయి. ఈ కోణంలో చూస్తే 8800 శ్లోకాలు లక్ష శ్లోకాలు కావడం వింత కలిగించే విషయం కాదు. వ్యాసుడు జయం రాసిననాటికి - సౌతి మునులకు చెప్పిన నాటికి నడుమ 150-170  సంవత్సరాల కాలం దొరలి ఉంటుంది. క్రీస్తుశకం 4వ శతాబ్దానికి చెందిన గుప్తశాసనం ద్వారా అప్పటికి భారతం, మహాభారతం రెండూ ప్రచారంలో ఉండేవని, మహాభారతం పరిమితి లక్ష శ్లోకాలని స్పష్టంగా తెలుస్తోంది.

ఎవరు ఎంత చేర్చినా ఎంత మార్చినా కొన్ని వేల సంవత్సరాల పాటు భారతం నిలబడింది అంటే అది ఆ కథ గొప్పదనం. భారతం మూలకథలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు. క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం శాకటాయనుడి కాలంలో అదే కృష్ణుడు ఒక యుద్ధవీరుడు. క్రీ.పూ.5వ శతాబ్దం వచ్చేటప్పటికి అదే కృష్ణుడు వైదిక మత ప్రవక్త అయ్యాడు. గౌతమబుద్ధుడి కాలం తర్వాత రామ, కృష్ణులు అవతార పురుషులు అయ్యారు. భగవద్గీత భారతంలో అంతర్భాగం అయింది. ఇదంతా బౌద్ధమతం వల్ల, మ్లేచ్ఛుల వల్ల ప్రతిష్ఠ కోల్పోవడం మొదలైన వైదికమత పునరుద్ధరణ కోసం!

ప్రాచీన కాలంలో మతం అంటే యజ్ఞాది కర్మలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం. ఆ కాలంలో దేవతలు ప్రకృతిలో భాగమైన అగ్ని, వరుణుడు, సూర్యుడు, మరుత్తులు లాంటివాళ్లు. దేవతలకు రాజు దేవేంద్రుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించేది అశ్వినీ దేవతలు. అప్పట్లో మొత్తం దేవతల సంఖ్య ముప్ఫై మూడు మాత్రమే! దేవతలంతా జనకల్యాణం కోసం ఎత్తయిన ప్రదేశాల్లో నివసిస్తారని ప్రజలు నమ్మేవారు. హిమాలయాల్లో దేవలోకం ఉందని, స్వర్గలోకానికి పొలిమేరలాంటి గంధమాదన పర్వతం దాటితే దేవతలు కనిపిస్తారని అనుకొనేవారు. మహాభారతంలో అర్జునుడు శివుడి అనుగ్రహం సంపాదించడానికి, దేవేంద్రుడితో చెలిమి చెయ్యడానికి వెళ్లింది హిమాలయ పర్వతాలలోకే! చివరికి స్వర్గారోహణ పర్వంలో పాండవులు నడిచింది కూడా అటువైపుకే!

అద్భుతాలు జరుగుతాయి అంటే నమ్మేకాలం మహాభారతకాలం. దేవతలు, మానవాతీత శక్తుల పట్ల అవధులు లేని విశ్వాసం ఉండేది. వాన, గాలి, గడ్డి, కడవ, అగ్ని, నది, సూర్యుడికి పిల్లలు పుట్టారు అంటే నిజమే కాబోలు అనుకొన్నారు.

అటువంటి కాలంలో వ్యాసమహర్షి సృష్టించిన జయేతిహాసంలోకి నమ్మశక్యంకాని చిట్టడవుల్లాంటి చిన్న చిన్న కథలు వచ్చి చేరాయి. దేవుళ్లు, వేదాంతం, రకరకాల శాస్త్రాలు, లోకనీతులు, రాజనీతులకు సంబంధించి అసంఖ్యాకంగా అంతులేని వ్యాఖ్యానాలు చోటుచేసుకొన్నాయి. ఎన్నో ఊహకందని ఉపాఖ్యానాలు, నీతికథలు, ముగింపులేని యుద్ధాలు, మరణం లేని మహావీరులు, అవినీతిమంతులు, సహనం లేని మునులు, నేలవిడిచి సాముచేసే సాహసవీరులు - మహాభారత కథలోకి బలవంతంగా చొచ్చుకొచ్చారు.


జయమ్ భారతంగా మారి, మహాభారతంగా స్థిరపడింది.


నాయుని కృష్ణమూర్తి

కౌరవుల పక్షాన గల యోధులు

దుర్యోధనుడు సర్వ సైన్యాధిపతి పితామహుడు అయిన భీష్మునికి అంజలి ఘటించి, తమ పక్షాన గల యోధుల స్థాయిలను ఎలా నిర్ణయించారో తెల్పమని అర్థించాడు.

భీష్ముడు ఆ ప్రశ్నకు అత్యంత వాత్సల్యంతో, " సుయోధనా వాస్తవ స్థితి గతులు నీకు వివరించడం నా బాధ్యత. నువ్వు అనాయాసంగా ప్రత్యర్థిని ఎదుర్కొని నిర్జింగల సమర్థుడవు. అస్త్ర శస్త్ర కోవిదుడవు. గదా యుద్ధ వీరుడవు. నువ్వు అతిరథుడవు. నీ సహోదరులు శూర శ్రేష్టులు. ఇక నా(భీష్ముడు) సంగతి నేను చెప్పుకోవడం భావ్యం కాదు. కృతవర్మ అసామాన్యుడు. అందుకే అతడు అతిరథుల కోవకు చెందుతాడు. వాసుదేవునిపై విద్వేషంతో నీ పక్షాన చేరిన భూరిశ్రవుడు, శల్యుడు అతిరథులగా పేర్కొనడానికి అర్హులు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రు కూటమికి వెన్నీయని సైంధవుడు మహారథుడు. నీకు జ్ఞాపకం ఉందా, పాంచాలీ దేవిని అపహరించినప్పుడు పాండవులు అతనిని పట్టి పరాభవించారు. ఆ కక్షతో సైంధవుడు ఘోర తపస్సు చేసి, కొన్ని మహా శక్తులు ఆర్జించాడు ఆ సింధు దేశాధిపతి మనకు రణరంగంలో గట్టి చేయూతనివ్వగలడు. ఇక భోజదేశాధీశుడు సుదక్షిణుడు సమరథుడు. ఇతని బలగంలో ప్రశస్థమైన రథాలు చాలా వున్నాయి. మాహిష్మతీ నగరాధిపతి నీలుడు అర్థరథుడు. సహదేవునిపై ఈతనికి ఎడతెగని పగ. అందుకని ప్రాణాలకు తెగించి పోరాడగలడు. అవంతీ దేశాధీశ్వరులు విందాను విందులు అర్థరథులలో చేరతారు. వారికి ఒకరి పై ఒకరికి వాత్సల్యం. కనుక వారు తోడు నీడలై విజృంభిస్తారు. త్రిగ‌ర్తాధీశులు, ఆ సహోదరులైదుగురు మహారథులు, గోగ్రహణ వేళ వీరు పాండవుల చేత భంగపాటు పడ్డారు. ఆ ఘోరావమానం వారిని దహిస్తోంది. ఆ అగ్ని మనకుపకరించగలదు. లక్ష్మణ కుమారుడు సమరదుడే కాని మీ వంటి వారిని సైతం నిలువరించగల సమర్థుడు. బృహద్బలుడు కోసల సైన్యాలతో కార్చిచ్చువలె పగవారిపై ఉరకగలడు. దండదారుడు సమరథుడు, కాల యమునిలా భాసించగలడు. మన వారిలో మహా శస్త్రాత్తవేత్త కృపాచార్యుడు అతిరథులలో అతిరథుడు. ఈ యోధాగ్రణికి సరితూగువారు లేరు. ఇక పాండవేయులకు గర్భ శత్రువుగా పేరొందిన నీ ఆప్తుడు శకుని కేవలం సమరథుడు. బలవంతులైన అనుచరులే అతనికి సిరి. దివ్యాస్త్రవేత్త, గురుపుత్రుడు అశ్వత్థామ అతిరథుడు. సంగ్రామంలో సాక్షాత్తు అతను కాలాంతకుడే. ద్రోణాచార్యుని గురించి ప్రత్యేకించి పేర్కొనవలసింది లేదు. అతిరథులలో ఎన్నతగిన ధీరమూర్తి. యుద్ధరంగ మార్తాండుడు. నీ పట్ల ద్రోణునికి మక్కువ ఎక్కువ. అర్జునుని పట్ల కూడా వాత్సల్యం వుంది. ఇందుకు గత సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు. అందుకే పార్థుని సంహరించడానికి ద్రోణుడు సంకోచించవచ్చు కాని మిగిలిన వారి విషయంలో ఆయన చేతికి అడ్డుండదు. ఇక బాహ్లికుడు అతిరథుడు. అతని కొడుకు సోమదత్తుడు తండ్రికి సరిపోలే మహావీరుడు. ఈ తండ్రీతనయులకు సమరమంటే పెళ్లి వేడుకే.’’ ఇలా వారి వారి స్తోమతులను చెబుతుంటే దుర్యోధనుడు చెవులొగ్గి ఆసక్తిగావింటున్నాడు.

Sunday, 9 April 2017

విధివిలాసం!

నారద మునీంద్రుడు ఒకసారి అడవిలో ఒక చెట్టుకింద కూర్చుని సేదతీరుతున్నాడు. ఆ చెట్టుమీదినుంచి పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకపిట్ట నారద మహర్షి సమీపంలోకి వచ్చి ఎగరసాగింది. పసుపు పచ్చని రంగు, నల్లని రెక్కలు, నల్లటి తోక కలిగి, బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పిట్ట... నల్లటి కళ్లు, సూదిగా ఉండే చిగురాకులా ఉన్న ఎర్రటి ముక్కుతో, ఉత్సాహానికి, ఉల్లాసానికి మారుపేరులా ఉన్న ఆ పిట్ట అక్కడక్కడే ఎగురుతూ, గంతులు వేస్తూ, చక్కగా కూయసాగింది.

మనోహరమైన దాని కూతలే పాటలా ఉండి, ఆయన మనస్సును సేదతీర్చాయి. నారదుడు ఆ పిట్టను చూసి ముచ్చటపడ్డాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చాడు. నారదుణ్ణి చూసి నమస్కరించాడు. అనుకోకుండా యముడి దృష్టి ఆ పిట్ట మీద పడింది. దాని వైపు ఆశ్చర్యపోతున్నట్టుగా చూసి, మళ్లీ నారదుని వైపు చూసి తల పంకించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సాక్షాత్తూ మృత్యుదేవుడు అయిన యమధర్మరాజు దృష్టి ఆ పిట్ట పై పడటంతో నారదుడి మనస్సు కీడు శంకించింది. యముడు ఆ పిట్టను తీసుకుపోతాడా ఏంటి? అనుకున్నాడు. కొద్దిక్షణాల క్రితం ఎంతో మధురంగా పాటలు పాడి, తన మనస్సుకు ఆనందం కలిగించిన ఆ పిట్టను ఎలా అయినా సరే, కాపాడాలనుకున్నాడు. వెంటనే ఆ పిట్టను పట్టుకుని సప్తసముద్రాలూ దాటి, అక్కడ ఉన్న ఒక మర్రిచెట్టు తొర్రలో దాచి, తిరిగి అరణ్యానికి చేరుకున్నాడు. ఏదో పని ఉన్నవాడిలా యముడు మళ్లీ వచ్చాడు. నారదుడు యముణ్ని చూసి చిద్విలాసంగా నవ్వాడు.

అది చూసి యముడు నారదుడి మనస్సు గ్రహించినట్టుగా...‘‘అయితే విధి మీ చేత కూడా బాగానే విన్యాసాలు చేయిస్తోందన్నమాట.’’ అంటూ ఇలా వివరించాడు. 


‘‘నేను మొదట ఆ పిట్ట వంక చూసినప్పుడు మరికాసేపట్లో అది సప్తసముద్రాలూ దాటిన తర్వాత ఒక మర్రిచెట్టు తొర్రలోని పాముకి ఆహారం కాబోతోందని తెలుసుకున్నాను. అయితే, ఇదెలా సాధ్యం. గట్టిగా పదడుగులు కూడా ఎగరలేని ఈ అల్పప్రాణి ఇంత తక్కువ వ్యవధిలో అంత దూరం ఎలా చేరగలదా అని ఆలోచించి, అబ్బుర పడ్డాను. ఇంతలో మీరు కనపడ్డారు. ఆ పని మీ చేతుల మీదుగా జరగగలదని గ్రహించి, నిశ్చింతగా వెళ్లిపోయాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా!’’ అంటూ నవ్వాడు.

‘‘విధివిధానం అమలు జరగడంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంటుందని తెలిసున్నప్పటికీ, నేనూ మాయకు లోనయ్యాను కదా!’’ అని వాపోతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు నారద మహర్షి.

Friday, 7 April 2017

శకుని




శకుని - కౌరవులపై ప్రతీకారం!
కౌరవులకు నిజమైన శత్రువులు పాండవులు కాదు!

మహాభారతంలో శకుని పాత్ర గురించి తెలియవారు ఉన్నారంటే అది వింతే అవుతుంది. గాంధారికి స్వయానా సోదరుడైన శకుని తన దుష్ట పన్నాగాలతో పాండవులను మాయా జూదంలో ఓడించి రాజ్యం నుంచి వెల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కురుక్షేత్ర సంగ్రామానికి తొలి బీజం వేశాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కురు పాండవుల మధ్య విభేదాలు సృష్టించి కౌరవులపై తన ప్రతీకారం తీర్చుకుని చేసిన శపథం నేరవేర్చుకోడానికి పథకం వేసి విజయం సాధించాడు. తన చిన్నతనంలో జరిగిన సంఘటనతో కురు వంశాన్ని నాశనం చేస్తానని శకుని ఓ భయంకరమైన ప్రమాణం చేశాడు.

గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు సుభలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన శకుని పుట్టుకతోనే కుంటివాడు కాదు. ఇది తండ్రి సుబల చేసిన గాయం. పుట్టుకతోనే అంధుడైన ధ్రుతరాష్ట్రుడికి గాంధార రాజు సుబలుని కుమార్తె గాంధారిని భార్యగా చేయాలని భీష్ముడు భావించాడు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే ద్రుతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం బీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెట్టాడు.

తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ధ్రుతరాష్ట్రుడి లోపాన్ని భీష్ముడు దాచిపెట్టడంతో సుబలుడు ఆగ్రహించాడు. ఈ విపత్తు నుంచి తప్పించాలంటే గాంధారికి మేకతో వివాహం జరిపించాలని జ్యోతిషులు సూచించారు. వివాహం తర్వాత ఆ మేకను బలిస్తే ఆమె వితంతవుగా మారుతుంది. అప్పుడు ధ్రుతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటే ఆయన గాంధారికి రెండో భర్త అవుతాడు సలహా ఇచ్చారు. జ్యోతిషుల చెప్పిన విధంగా గాంధారికి ముందు మేకతో పెళ్లి జరిపించి దాన్ని బలిచ్చారు.

తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ధ్రుతరాష్ట్రుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయాలని ఆదేశించాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు. కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి సబలుడు శకుని తొడ ఎముకను విరిచి అవిటివాడిగా మార్చాడు.

తాను చనిపోయే ముందు శకుని తల్లి కూడా తన శరీరంలోని ఓ ప్రత్యేక భాగం నుంచి ఎముకను విరిచి ఇచ్చి దీంతో కౌరవులపై ప్రతీకారం కోసం ప్రయత్నించాలని కోరింది. శకుని దీన్ని పాచికగా తయారుచేశాడు. దీంతో జూదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది. దుర్యోధనుడితో పాండవులు జూదం సమయంలో దీన్ని వినియోగించాడు.



ఒక పథకం ప్రకారం పాచికలు వేసి ఎత్తుగడలతో కుయుక్తులతో మోసం చేసే వాళ్లని, మాయ చేసే వాళ్లని 'శకుని'తో పోలుస్తూ ఉండటం మనం వింటూ ఉంటాం. శకుని పాచిక వేస్తే పారకుండా ఉంటుందా? ఎంతంటే అంత పడాల్సిందే. పడి తీరాల్సిందే. అంటే శకుని పాచికకు తిరుగులేదన్నమాట!

ఈ శకుని పాత్రని పాత సినిమాల్లో చూసే ఉంటారు. ఆ పాత్ర వేసిన ధూళిపాలని చూస్తే చాలా ఆసక్తిగానే కాదు, ఆందోళనగా కూడా ఉంటుంది. అవును, 'భారతం'లో కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన పరిస్థితులను పెంచిపోషించిన వాడే ఈ శకుని!

ధుర్యోధనునితో 'మామా' అని పిలిపించుకున్న శకుని స్వయానా కౌరవులకు మేనమామే. ఇతనికి వృషకుడు, అచలుడు అన్నదమ్ములు. శకునికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు ఉలూకుడు.

కౌరవుల దురాగతాలకు అంతకుమించిన దురాలోచనలు శకుని దగ్గర ఉండి ప్రోత్సహించే వాడు. అసలు ధర్మరాజుని జూదమాడమని దింపిందీ శకునే. ఆ మాయా జూదంలో పాచికలు వేసి పాండవులను ఓడించి కౌరవుల్ని గెలిపించేలా ఆడిందీ శకునే. పాండవులూ కౌరవుల మధ్య ఉన్న శతృత్వాన్ని తన కుటిల రాజ నీతితో పెంచిందీ శకునే.

ఇంత కుటిలమైన పన్నాగాలు శకుని ఎందుకు పన్నాడు? ఏం ప్రయోజనం ఆశించి చేశాడు? దానికి కారణం ఉంది. శకునితో సహా సోదరులందరినీ కారాగారంలో వేసి పిడికెడు మెతుకులు వేసే వారట కౌరవులు. ఆ పిడికెడు మెతుకులను శకునికి ఇచ్చి అతని అన్నదమ్ములు ఆకలితోనే ఉండిపోయే వారట. అలా బతికి బట్టకట్టిన శకుని అంతకంతా తీర్చుకోవడానికని... ధుర్యోధనునికి ఎదురు తిరగలేక, ఆ శక్తి లేక, కౌరవ పక్షం చేరి ధుర్యోధనుడు సహా కౌరవ వంశాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో కౌరవుల్ని పాండవులపైకి ఎగదోశాడని చెబుతారు.

శకుని మాయలు యుద్ధ సమయంలో సాగకుండా అర్జునుడు అడ్డుకట్ట వేశాడు. అయితే నకుల సహదేవుల చేతుల్లోనే చనిపోయాడు. ఎత్తులూ జిత్తులూ వేసి తగవులు పెట్టే మాయగాళ్లని ఇప్పటికీ 'శకుని' అనే పిలుస్తారు. అదన్నమాట శకుని అసలు కథ!

Wednesday, 5 April 2017

శకుంతల






శకుంతల

ప్రకృతిని ప్రేమించేవారు ప్రపంచాన్నీ ప్రేమించగలరు. ప్రపంచమంటే జీవజాతితో నిండిన మహా సంసారసాగరం అని మరచిపోకూడదు. కానీ ఈ ప్రేమ స్వార్థం ఎరుగదు. కల్మషం లేనిది. అపారమైన జ్ఞానగుంఫితంగా పరిమళించేది. అన్నింటికీ అతీతమైంది. ఆదరణకు ఆలవాలమైంది. అర్థానికి అసలైన నిర్వచనమైంది. అనర్థాన్ని కలలోనైనా కోరుకోనిది.. ఇలా మంచినీ, మానవత్వాన్నీ ధీటైన నిజరూపంగా శక్తికి ప్రతిరూపమైన స్త్రీ స్వరూపంగా జీవితం తాకిడికి తలొంచే పరిస్థితులకు బెదరని, చెదరని ఆదర్శ మహిళగా, ప్రకృతికి మాతృత్వంతో సేవ చేసినదై తల్లీ తండ్రీ తానుగా మారిన అమ్మగా భారతదేశానికి పేరునిచ్చిన భరతునికి జన్మనిచ్చిన మహాతల్లిగా చరిత్రలో స్థానం సుస్థిరం చేసుకుంది శకుంతల. కానీ ప్రశాంతంగా, ఆర్భాటాలకు అతీతంగా అనుమాన నమ్మకాల నడుమ పెనుగులాడే ప్రేమకై నిరీక్షించి, గెలుపును కాలానికి దానం చేసి తాను నిమిత్తమాత్రురాలిగా నిలిచిపోయింది. ఈమె సహనంలోని శోభ భారతావనికి దాతృత్వమై ఒప్పారింది.

శకుంతల మేనక, విశ్వామిత్రుల కూతురు. చిన్నతనంలోనే అడవిలో విడిచిపెట్టారు వారు. చెట్టు చేమలూ పక్షులూ ఆమెను పెంచసాగాయి. అది చూసిన కణ్వముని హృదయం ద్రవించి ఆమెను కన్నకూతురిలా పెంచుకుంటాడు. శాకుంతలములే ఆమె ఆలనాపాలనా చూసాయి గనుక శకుంతలగా పేరు గాంచింది. ఆశ్రమ జీవితానికి అంకితమైపోయింది. ప్రకృతితో మమేకమై పోయింది. ఆమె కనుసైగలతో పులకించిపోయేవి ఆమె పెంచుకున్న చెట్లూ, లతలూ, జంతువులు. అవే లోకంగా బతుకుతుంది శకుంతల. ఇంతలో వేటకై వచ్చిన దుష్యంతుడు కణ్వాశ్రమానికి రావడం, ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడం, దుర్వాసనుడు అతను నిన్ను మర్చిపోతాడన్న శాపం ఇవ్వడం, అనుకున్నట్టుగానే దుష్యంతుడు ఆమెను తిరస్కరించడం కాలం సాక్షిగా జరిగిపోయాయి.

కణ్వమహర్షి సన్యాసిగా ఉండి కూడా శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక, నా పరిస్థితే ఇలాగుంటే సామాన్యుల గతేంటని విలపిస్తాడు. అది లోకం రీతో, కణ్వుని పితృస్థానం విశేషమో కాదు. శకుంతల గుణం, ఆమె నిండైన రూపం, ఆమెలోని మంచితనం అందుకు నిదర్శనం. చిన్నతనంలోనే కన్నవారు వదిలేసారు. ఆమె వారిని నిందించలేదు. ప్రకృతి ఒడిలో ఆనందాన్ని వెతుక్కుంది. కణ్వుని నీడలో పెంచబడి దుష్యంతుడికి భార్యగా వెళ్ళిపోయింది. అక్కడా తిరస్కారమే ఎదురైంది. అయినా శకుంతల కుంగిపోలేదు. తిరిగి తండ్రి కణ్వుని చేరి ఆయన్ను బాధించలేదు. ఒంటరిగా బతకసాగింది. భరతునికి జన్మనిచ్చింది. తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించింది.

దుష్యంతుడు తన తప్పును తెలుసుకొని వచ్చి తననూ, తన కుమారున్నీ చేరదీస్తానన్నప్పుడు కాదనలేదు. వాదనకూ దిగలేదు. భార్యగా, రాణిగా, తల్లిగా తనవంతు పాత్రను పోషించింది.

కాళిదాసు మాటల్లో చెప్పాలంటే శకుంతల రూపం వాసన చూడని పువ్వు. గోరుసోకని చిగురు. ఉలితో చెక్కని రత్నం. ఆస్వాదించని మధువు. శకుంతలంటేనే పూర్వజన్మ పుణ్యాల అఖండఫలం. అలాంటి శకుంతల జీవితం మాత్రం అనిశ్చితమై, అతలాకుతలమై అనాదరణకు ప్రతీకయై నిలిచిపోయింది. కానీ ఆమె ఎవ్వరినీ కారకులుగా పేరుపెట్టలేదు. తనది కాని పరిస్థితికి ఎవ్వరినీ నిందించలేదు. నిర్భయంగా, నిశ్చలంగా బతికింది. ప్రకృతికి ప్రేమను పంచింది. ఆమెలోని సహనాన్ని ప్రపంచానికి అంకితమిచ్చింది.శకుంతల అంటే అన్ని గుణాలకూ చిరునామా. కానీ ఆమెలోని ప్రేమ అన్నింటికన్నా గొప్పది. అందుకేనేమో ప్రేమ అనే బంధం మనిషిలో ఆశని సజీవంగా ఉంచుతుందనీ ఆశ అనే బంధం ఎంత గొప్ప దుఃఖాన్నైనా సహించేటట్లు చేస్తుందనీ తన జీవితమే నిదర్శనంగా చూపింది. ఆమెలోని మనోహరమైన మంచితనం ఆమెకు లోకజ్ఞతను కానుకగా ఇచ్చింది. కన్నవారు వదిలేశారనే బాధ ఆమెను తాకలేదంటే ఆమెలోని విజ్ఞత సుస్పష్టమవుతుంది. కణ్వుడు కన్నతండ్రిగా పెంచుకుంటానంటే ఆమె హృదయం పితృస్థానాన్ని ఆహ్వానించింది. ఆమెలోని ప్రేమ దుష్యంతుని వరించింది కనుకనే తిరస్కారాన్నీ ఆమోదించేందుకు ఆమె గుండె నిబ్బరం తోడుగా నిలిచింది. ఒంటరిగా తల్లిదండ్రుల బాధ్యతను నెత్తిన వేసుకొని భరతుణ్ని పెంచిందంటే ఆమెలోని నిర్ణయాత్మకవైఖరి ప్రస్ఫుటమవుతుంది. కాలం అందించే జీవితపు ఆటుపోట్లు శకుంతలను కుంగదీయక పోగా మరింత నిగ్గుతేల్చాయి. ఒక స్త్రీ నిశ్చయంగా సంకల్పిస్తే జీవితాన్ని పరిపూర్ణత్వం దిశగా తీసుకెళ్లేందుకు ఎంతటి బాధనైనా సహనంతో స్వీకరిస్తూనే ఉంటుందని నిరూపించింది శకుంతల.

ఆదర్శాన్ని విజయాల సాధనలోనో, ఆనందాల వెదుకులాటలోనో అందిపుచ్చుకోవడం పరిపాటి. కానీ గొప్పవారి జీవితంలో ఎదురయ్యే కష్టాల వైఖరిలో ఆదర్శాన్ని గుర్తిస్తే మన కష్టాలు అత్యంత చిన్నవిగా కనిపించడమే కాదు, వాటిని దాటుకొచ్చే మార్గాలూ సులభమవుతాయి. కొందరి జీవితాలను అదృష్ట దురదృష్టాలతో బేరీజు వేస్తారు. మరికొందరు సుఖదుఃఖాలకు వదిలేస్తారు. కానీ మన ప్రమేయం లేకుండానే జీవితంలో పరిస్థితులకు మనమెలా బాధ్యులమై పోతున్నామో వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో ఎంతగా నలిగిపోతున్నామో ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం అయ్యేలా చెప్పేందుకు జీవితకాలం సరిపోదు. అందుకే శకుంతలలా జీవిత నిర్వచనాలు ఇచ్చుకునే పనిని ప్రపంచానికి వదిలేసి తనలోని తత్తానికీ, మానవత్వానికీ మరక అంటనీయక బతికితే చాలదా! జ్ఞానం, ప్రేమ, సత్యం అన్నీ తరించినట్లే.

-ప్రమద్వర







రావణుడు - దశకంఠుడు





దశకంఠుడు

శ్రీరాముని గొప్పతనం గురించి అందరికీ తెలుసు.. ప్రతినాయకుడైన రావణుడి గురించి గొప్పగా వర్ణించగలమా? రావణుని రూపం అత్యద్భుతం.. ధైర్యం నిరుపమానం.. తేజస్సు అసదృశం.. రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు.. అధర్మానికి ఒడిగట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు.. అయితే రావణుని శివభక్తి అనుపమానం.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు.. ఆ మహాదేవుడు ఎంతకూ కరుగపోయేసరికి శిరసు ఖండించుకొని స్వామికి సమర్పించుకున్నాడు. ఖండించుకున్న స్థానంలో మరొక శిరస్సు ఉద్భవించేది! ఇలా పదిసార్లు జరిగింది.. అందుకే రావణుడు దశకంఠుడయ్యాడు.. ఈ పది తలలు మనలోని గుణాలకు ప్రతీకలంటారు. మరి ఆ గుణాలేంటో, వాటికి రావణుడి జీవితం ఎలా అన్వయమైందో చదువండి..

మోహం
చెడు ఆలోచనలైన.. కామ, క్రోధ, మద మాత్సర్యం వంటిదే అసూయలోంచి పుట్టేదే మోహం. ఈ గుణాలన్నీ రావణుడిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే మోహ స్వరూపంగా రావణుడిని పోలుస్తారు. ఈ గుణం పాళ్లు ఎక్కువగా ఉండడంతోనే అతని వినాశనం జరిగింది.

కామం
ఒకరి భావాలను నియంత్రించకూడదు. ఒకరి మీద అధికారం చెలాయించకూడదు. తెలివిని మాత్రమే అంచనా వేసి వారి ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పడం హైందవ సంప్రదాయం ప్రకారం తప్పుగా పరిగణిస్తారు. కానీ, రావణుడు తనను తాను నాశనం చేసుకోవడానికి మరొక వ్యక్తి భార్యను అపహరించాడు. అక్కడ ఒకరి భావాలను నియత్రించాడు.

క్రోధం
తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు. రావణుడి విషయంలో కూడా ఈ సామెత వర్తిస్తుంది. రావణుడు తమ్ముడు విభీషణుడిపై కోపంతో రాజ్య బహిష్కరణ విధిస్తాడు. దాంతో అతనే శత్రువుగా మారి లంక వినాశనం, రావణుడి మరణానికి కారణమయ్యాడు.

అహంభావం
కొన్ని కోణాల్లో చూస్తే రావణుడు అహంభావి అని అర్థమవుతుంది. దానికి ఒక ఉదాహరణ.. రావణుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ ఆ దేవుడు కరుణించకపోయేసరికి ఆ కైలాస పర్వతాన్నే పెకిలించి వేస్తాడు. తను అనుకున్నడంటే ఆ సమయంలో అన్ని జరిగిపోవాలనుకునేవాడే రావణుడు. అంతటి అహంభావం అతనిది.

బుద్ధి రాహిత్యం
గొప్ప చక్రవర్తి మహాబలి ఒక మాట చెబుతాడు రావణుడి గురించి. పది భావోద్వేగాల్లో తొమ్మిది మాత్రమే ఆయనకు వర్తిస్తాయి. ఒక్క తెలివి మాత్రం ఆయనకు వర్తించదు. బుద్ధిబలంతో అన్ని పనులు చేసుకోగలం. ఒకవేళ ఆ ఒక్కటి ఉండి ఉంటే ఆయన చరితార్థుడు అయ్యేవాడన్నాడు ఆ చక్రవర్తి.

జ్ఞానం వృథా
రావణుడు గొప్ప వైదిక పండితుడు. అతని జన్మ ద్వారా, వేద జ్ఞానం ద్వారా అతడు బ్రహ్మజ్ఞానిగా పరిగణించబడ్డాడు. ఆయన సంస్కృత పండితుడు. రావణుడు ఎన్నో రచనలు చేశాడు. మంచి ఆయుర్వేద వైద్యుడు. కాకపోతే ఆ జ్ఞానాన్ని మంచి కోసం కాకుండా అన్యాయమైన ఆలోచనలకు ఉపయోగించాడు. తెలివిని మంచి కోసం ఉపయోగిస్తే రావణుడు మంచి పరిపాలకుడయ్యేవాడు.

అసూయ
ఒక వ్యక్తి నుంచి దీవెన పొందడం అంత సులువు కాదు. ఇతరుల మంచి కోరినప్పుడు మాత్రమే ఆ దీవెనలు అందుతాయి. కానీ రావణుడు ఎక్కడా ఎవరి మంచీ కోరలేదు. అసూయ, ద్వేషాలతో రగిలిపోయేవాడు. అందుకే ఆయన వినాశనం తప్పలేదు.

రాక్షసమాయ
రావణుడు ఆలోచనా పరుడే! ఆ ఆలోచనలతోనే మూడు లోకాలకు అధిపతి అయ్యాడు. తన నిగూఢమైన ఆలోచనలతో రావణుడు ఈ లోకాలను స్వాధీనం చేసుకోగలిగాడు. మానవులను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోగలిగాడు. అలాగే రాక్షసగణాన్ని తన ఆలోచనలతో కట్టిపడేసి రాక్షసాధిపతిగా చలామణి కాగలిగాడు.

లోభం
మనిషికి ఆశ ఉండొచ్చు. అత్యాశ ఉండకూడదంటారు. కానీ రావణుడికి ఈ గుణం కూడా ఎక్కువే. వాస్తవానికి లంకా నగరం చాలా చిన్నది. రావణుడు ఇతర రాజ్యాల నుంచి కొల్లగొట్టి తన నగరాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకున్నాడు. వారి ఏడుపే ఆయనకు తగిలి ఉండొచ్చు.

పాపాల ఫలితం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతారు. గర్వం మన బుద్ధిని చిన్నగా చేస్తుంది. అది అత్యంత ప్రమాదకరం. తెలియకుండా అది ఒక ఉచ్చులా మారి మనల్నే నాశనం చేస్తుంది. దేవుడి వరంతో మరణం లేదని విర్రవీగిన రావణుడు ఎంత భక్తుడైనా అతని పాపం అతన్ని వెంటాడకుండా ఉండలేదు కదా!

మరో అర్థం..
రావణుడి పది తలలకు మరో అర్థం కూడా ఉందంటున్నది శాస్త్రం. దాని ప్రకారం ఆరు శాస్ర్తాలు, నాలుగు వేదాలకు గుర్తుగా ఆ పది తలలు ఉన్నాయని పండితులు చెబుతారు. ఇంతకీ అవేమిటంటే..
- సాంఖ్యాక శాస్త్రం
- యోగశాస్త్రం
- న్యాయశాస్త్రం
- వైశాశిక శాస్త్రం
- పూర్వమీమాంస
- ఉత్తర మీమాంస
- రుగ్వేదం
- యజుర్వేదం
- సామవేదం
- అథర్వణ వేదం

- సౌమ్య పలుస

Monday, 3 April 2017

యుయుత్సుడు








కౌరవులకు వ్యతిరేకంగా పోరాడిన కౌరవుడు



మహాభారతం అన్న మాట విన్నవెంటనే కొన్ని పాత్రలు స్ఫురిస్తాయి. కొన్ని అభిప్రాయాలు గుర్తుకువస్తాయి. కానీ మనం కనీవినీ ఎరుగని పాత్రలు ఆ ఇతిహాసంలోని ప్రతి అధ్యాయంలోనూ ఉన్నాయి. మన అభిప్రాయాలను భగ్నం చేసే పరిస్థితులూ కనిపిస్తాయి. అలాంటి ఒక పాత్ర పేరే ‘‘యుయుత్సుడు’’. కౌరవులంతా చెడ్డవారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేసే పాత్ర యుయుత్సునిది. అది ఇలా సాగుతుంది.

గాంధారి, దృతరాష్ట్రుని ద్వారా వందమంది పుత్రులను పొందాలన్న వరాన్ని పొందే విషయం తెలిసిందే! అయితే గాంధారి తన ద్వారా సంతానాన్ని పొందుతుందో లేదో అన్న సందేహంలో ఉన్న దృతరాష్ట్రుడు... సుఖద అనే ఓ చెలికత్తె ద్వారా బిడ్డను కంటాడు. ఆ బిడ్డ పేరే యుయుత్సుడు! అటు గాంధారి కుమారుడు దుర్యోధనుడు, ఇటు సుఖద కుమారుడు యుయుత్సుడు ఒకే సమయంలో జన్మిస్తారు. అంటే! హస్తినాపుర రాజ్యం మీద దుర్యోధనునికి ఎంత అధికారం ఉందో యుయుత్సునికి కూడా అంతే అధికారం ఉంది. కానీ దుర్యోధనుడు అంత ఉదారంగా ఆలోచిస్తాడని భావించలేం కదా! యుయుత్సుడిని తోటి కౌరవులు దాసీపుత్రునిగానే భావించేవారు. అయినా అది యుయుత్సుని వ్యక్తిత్వం మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సకల విద్యలూ నేర్చకుని, సకల ధర్మాలూ ఔపోసన పట్టి అతిరథ మహారథునిగా కీర్తిని గాంచాడు. అసలు యుయుత్సుడు అంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం!

కౌరవుల ఆగడాలను మొదటి నుంచీ గమనిస్తూ ఉన్నవాడే కాబట్టి, యుయుత్సునికి వారి మీద అసహ్యం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! అందుకని ఎప్పుడైతే ధర్మయుద్ధం మొదలైందో నిస్సంకోచంగా పాండవుల పక్షాన నిలిచేందుకు సిద్ధపడతాడు యుయుత్సుడు. అంతేకాదు! పాండవులను హతమార్చేందుకు కౌరవలు పన్నే పన్నాగాలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ ఉంటాడు. ఒక రకంగా రామాయణంలో విభీషణుడు ఎలాంటివాడో, భారతంలో యుయుత్సుడు అలాంటివాడన్న మాట! కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలచి యుయుత్సుడు చేసిన యుద్ధం చిరస్మరణీయమైనది.

ధర్మపక్షాన నిలిచినందుకు యుయుత్సునికి తగిన ఫలితమే దక్కుతుంది. ఆ మహాసంగ్రామంలో కౌరవులంతో అసువులు బాయగా ఒక్క యుయుత్సువు మాత్రమే ప్రాణాలతో మిగులుతాడు. ఆ మాటకి వస్తే కేవలం కౌరవులలో మాత్రమే కాదు... యోధానుయోధులు సైతం నేలకొరిగిన ఆ యుద్ధానంతరం ప్రాణాలతో మిగిలిన 12 మంది ప్రముఖులలో యుయుత్సుడు ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కొన్నేళ్లపాటు హస్తినను ఏలిన పాండవులు స్వర్గారోహణానికి బయల్దేరతారు. వెళ్తూ వెళ్తూ హస్తినాపురానికి రాజుగా అర్జునుడి మనవడైన పరీక్షిత్తుని నియమిస్తారు. ఆ పరీక్షిత్తునికి పాలనలో తగిన సాయం చేసే బాధ్యతను యుయుత్సునికి అప్పగించి మరీ వెళ్తారు పాండవులు. అలా భారతంలో యుయుత్సుని కథ సుఖాంతమవుతుంది.








మహాభారతంలోనూ ఓ విభీషణుడు!



మహాభారతంలో ప్రధానకథతోపాటు అనేకానేక ఉపకథలుంటాయి. వందల పాత్రలుంటాయి. దేనికదే విశిష్టమైనది. అయితే అందులో ఏమాత్రం ప్రాచుర్యంలోకి రాని పాత్రలు అనేకం. రామాయణంలో విభీషణుడి వంటి పాత్ర మహాభారతంలోనూ ఉంది. ఇద్దరికీ ఎన్నో పోలికలు. అయినవాళ్లను విడిచిపెట్టి తను నమ్మిన ధర్మం వైపే నిలబడాలనే వైఖరి అందులో ప్రధానమైంది.

రామాయణంలో విభీషణుడు రావణ, కుంభకర్ణుల సోదరుడే. భారతంలో యుయుత్సుడు కూడా ధృతరాష్ట్రుడి కొడుకే. తన పుట్టుక నుంచి జీవితమంతా ఓ ఆసక్తికరమైన కథ. గాంధారి గర్భం ధరించి రెండేళ్లు గడిచినా ప్రసవం జరగదు. దీంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యక సుఖదను పెళ్లాడతాడు. ఆమెకు యుయుత్సుడు, గాంధారికి దుర్యోధనుడు ఒకేసారి పుడతారు. ఆ తరువాతే దుశ్శాసనుడు, దుస్సల సహా మిగతా కౌరవులంతా పుడతారు. నిజానికి దుర్యోధనుడికి ఎన్ని హక్కులున్నాయో యుయుత్సుడికీ అన్నే హక్కులుండాలి. కానీ పట్టమహిషి గాంధారి కాబట్టి గాంధారి సంతానానికే అమిత ప్రాధాన్యం లభించింది.

తనకు ఏది ధర్మమని తోస్తే దాన్నే ఆచరించేవాడు యుయుత్సుడు. ఓ విభిన్నమైన పాత్ర ఇది. విషపునీటి ప్రయోగం గురించి తెలిసి దాన్నుంచి భీముడిని కాపాడటంతో కౌరవులు యుయుత్సుడిని దూరంగా ఉంచడం ప్రారంభిస్తారు. ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో దాన్ని ఖండితంగా వ్యతిరేకించింది కేవలం యుయుత్సుడే. కురుక్షేత్ర సమరంలో ఎవరు ఎవరివైపునయినా ఉండవచ్చునని అనడంతో యుయుత్సుడు పాండవుల వైపు చేరతాడు. యుయుత్సుడిలాగే దుర్యోధనాదుల ధోరణిని వ్యతిరేకించే మరో సోదరుడు వికర్ణుడు మాత్రం అన్నలతోనే ఉండిపోయాడు. యుయుత్సుడు రావణుడి పట్ల విభీషణుడిలా ఓ విశేష నిర్ణయం తీసుకోగా, వికర్ణుడు మాత్రం కుంభకర్ణుడిలా సోదరుడితోనే ఉండిపోతాడు.

అలాగని యుయుత్సుడు అల్లాటప్పా ఏమీ కాదు. ఒకేసారి పదివేల మందితో పోరాడగలిగే అతిరథుల్లో ఒకడు. కురుక్షేత్ర అనంతరం మరణించకుండా మిగిలిపోయిన పదకొండు మందిలో ఒకడు యుయుత్సుడు. తమ రాజ్యపాలన ముగిశాక పాండవులు హిమాలయాలకు మహా ప్రస్థానం ఆరంభిస్తారు. అప్పుడు మరీ చిన్నవాడైన పరీక్షిత్తుకు యుయుత్సుడినే సంరక్షకుడిగా నియమిస్తారు. భీష్మ, ద్రోణాదులకూ రాగద్వేషాలు అంటగట్టిన కౌరవులు యుయుత్సుడి విషయంలో మాత్రం ఒక్క మాట అనడానికీ సాహసించలేదు. అదీ యుయుత్సుడి పాత్ర విశిష్టత.



Maha Shivaratri - A auspicious occasion

Maha Shivaratri:-
"Shiva-ratri means 'auspicious (Shiva) darkness (ratri). At least on this day, one should chant Shiva's name all through the night." 

Meaning Of Maha-Shiva-ratri:-
"If you make the slightest effort to progress along the path of liberation, the Lord will help you a hundred-fold. Shivaratri conveys that hope to you. The moon, which is the presiding deity of the mind of man, wanes until the fourteenth day after full moon. It is just a tiny curve of glimmering glow. The mind should be starved into the condition, so that man becomes free. Spend all the days with Shiva, and the conquest of the mind is easy. Spend the fourteenth day of the waning moon with Shiva, reaching the climax of the spiritual effort on the final day, and success is yours. That is why all Chaturdashis of the dark haif of every month are called Shivaratris, that is why the Chaturdashi of the Magha month is called Mahashivaratri. That is a day of special dedication to Shiva." 

Maha Shivaratri falls on the 13th day of Krishana Paksha of Maagha Maasa (February-March). It is a night of fasting and prayer in honour of Lord Shiva in His aspect of destroying sins and bad things. The night is called Shivamaya, i.e. a night to spend with thoughts of Lord Shiva. As the Lord of the universe He is full of compassion and only punishes out of Love and for the good of mankind. It is on this great night that Lord Shiva redeems the world. He swallows poisons and sins to save His devotees. During this holy night the devotees of Lord Shiva fast, meditate, pray and sing the glory of the Saviour. Whatever is offered to Lord Shiva with devotion is pleasing to Him. On this night He showers blessings abudantly.

The Symbol of Lord Shiva, is the Shiva Lingam, it is a form to represent the formless and it is worshiped with great splendour during Maha Shivaratri. This Lingam is the symbol of the one who is All - Pure, All -Perfect, All - Bliss; Lord Shiva. When contemplated with adoration it becomes a mirror of the soul. It becomes a cosmic window that opens to allow the devotees to touch the All - Pure One.

Hindu temples across the country are decorated with lights and colorful decorations and people can be seen offering night long prayers to Shiva Lingam. Woodapple leaves, cold water and milk are offered to the Shiva Lingam on this day as they are believed to be Lord Shiva’s favorite.

Origin of Sivaratri festival:-
Puranas contain many stories and legends describing the origin of this festival. 
According to one, during the samudra manthan, a pot of poison emerged from the ocean. This terrified the Gods and demons as the poison was capable of destroying the entire world, and they ran to Shiva for help. To protect the world from its evil effects, Shiva drank the deathly poison but held it in his throat instead of swallowing it. This made his throat turn blue, and he was given the name Neelakantha, the blue-throated one. Shivaratri is the celebration of this event by which Shiva saved the world.

According to another legend in the Shiva Purana, once the other two of the triads of Hindu Gods, Brahma and Vishnu, were fighting over who was the superior of the two. Horrified at the intensity of the battle, the other gods asked Shiva to intervene. To make them realize the futility of their fight, Shiva assumed the form of a huge column of fire in between Brahma and Vishnu. Awestruck by its magnitude, they decided to find one end each to establish supremacy over the other. Brahma assumed the form of a swan and went upwards and Vishnu as Varaha went into the earth. But light has no limit and though they searched for thousands of miles, neither could find the end. On his journey upwards, Brahma came across a Ketaki flower wafting down slowly. When asked where she had come from, the Ketaki replied that she had been placed at the top of the fiery column as an offering. Unable to find the uppermost limit, Brahma decided to end his search and take the flower as a witness.

At this, the angry Shiva revealed his true form. He punished Brahma for telling a lie, and cursed him that no one would ever pray to him. The Ketaki flower too was banned from being used as an offering for any worship, as she had testified falsely. Since it was on the 14th day in the dark half of the month of Phalguna that Shiva first manifested himself in the form of a Linga, the day is especially auspicious and is celebrated as Mahashivaratri. Worshipping Shiva on this day is believed to bestow one with happiness and prosperity.

History of shivaratri:-
Once when everything in all the worlds got reduced into Lord shiva, in that darkness of nothing present, the mother Parvati worshipped Lord shiva in the Agamic way with great devotion. The parameshwar pleased by Her prayer blessed Her. She asked for the benefit of all the creatures that in future whoever worships the Lord on the shiva ratri day with devotion, they should be blessed and should be given the ultimate liberation. The pashupati granted that showing way for all of us to get blessed easily.

When Brahma and Vishnu fought between themselves as "who is the greatest", Lord Shiva appeared before them as a pillar of fire. They were not able to find the starting and end of that pillar. This day is Thirukkaarthikai.

Then Brahma and Mahavishnu repented for their mistake and prayed to Lord Shiva for forgiving their sin worshiping the shiva lingam which is the form of the flame. In the night of Shiva rathri Lord Shiva appeared before them and blessed them. Devotees pray the God throughout the night of Shiva rathri by performing Abisheka, chanting and other holy deeds.

Every month in Krishna paksha chathurdhasi (fourteenth moonday) is called masa Shiva rathri. The one that comes in the month of "Masi" (mid February to mid March) is called Maha Shiva rathri. This is considered as the most important vrata by the devotees.

There are many incidents told about the greatness of this day. Once a hunter in a jungle after searching throughout the jungle, was quite tired and could not get any animal. In the nightfall a tiger started chasing him. to escape from that he climbed a tree. That was a Bilva tree. The tiger sat under the tree waiting for him to come down. The hunter who sat on a branch of the tree was quite tense and didn't want to sleep. He was plucking the leaves and putting down as he was not able to be idle. Below the tree there was a Shiva lingam. The whole night went on like this. God was pleased with the Upavasa (hunger) and the Pooja the hunter and the tiger did even without knowledge. He is the peak of the grace. He gave the hunter and the tiger "Moksha".

In a Shiva temple on a Maha Shiva rathri day the lamp kept in the altar was very dim. That time a mouse which came take its prey touched the flame. Due to the heat it moved its head immediately. In the process it kindled the lamp and the altar was illuminated well. Lord Shiva, pleased by this deed made the mouse Mahabali, the renowned asura king.

There are many incidents like this told in our Puraanas. If we do the vrata with pure devotion and love there can be no doubt about getting the Grace of the Almighty.


Rituals of Maha Shivratri:-
At Maha Shivratri, People keep fast of whole day and night and Kashi Vishwanath temple gets congregated by the young and old devotees from the very early morning. They come to the temple to perform the puja of traditional Shivalingam and hope to get what they have prayed to the god. They take bath in the holy water of the Ganga (Symbol of the purity) early in the morning before sunrise and wear a clean clothe after the sacred bath.

Every worshiper brings a pot full of holy Gange water to the temple to offer the Shivalingam. Women pray to God for her well-being of their husbands and sons, an unmarried woman pray to get their desired husband like Shiva (the ideal husband) in future; boys pray to get beautiful wife and successful life in future. The temple full of sound of bells and people shouts of “Shankerji ki Jai” or “Mahadevji ki Jai”. Devotees take 5 round of the Shivalingam and pour water on the Shivalingam. Some also pour cow milk on the Shivalingam.

According to the Shiva Purana, the Mahashivaratri puja involves six steps which are:

Taking bath in the Gange for purification of soul and body. Bathing of the Shiv Linga with the holy water of Gange, then bathing with milk and honey. God Shiva loves bel patra (three leaves stalked in one) so every rituals added it to the puja.
After bathing of the Shiv Linga, vermilion paste applied on it which represents the virtue.
Offer fruits, flowers which are given to get long life and satisfaction of desires.
Burning enrage yields wealth.
The lighting with diya represents achieving more knowledge.
Offering betel leaves provide satisfaction full of great pleasures.
Worshipers also apply three horizontal lines of holy ash on their forehead just like the Lord Shiva which represents spiritual knowledge, cleanliness and penance. They wear garland made up of the Rudraksha (seed of Rudraksha tree) while worshiping the Lord Shiva. It is believed that Rudraksha tree was originated from the tears of Lord Shiva. Shivaratri is also considered as the wedding day of the Lord Shiva and Mata Parvati.

Bathing the Phallus:-

The phallus symbol representing Shiva is called the lingam. It is usually made of granite, soapstone, quartz, marble or metal, and has a 'yoni' or vagina as its base representing the union of organs. Devotees circumambulate the lingam and worship it throughout the night. It is bathed every three hours with the 5 sacred offerings of a cow, called the 'panchagavya' - milk, sour milk, urine, butter and dung. Then the 5 foods of immortality - milk, clarified butter, curd, honey and sugar are placed before the lingam. Datura fruit and flower, though poisonous, are believed to be sacred to Shiva and thus offered to him.

Sahasrakalasabishekam:-
This is a very special and rare puja conducted during 10 days of Maha Sivarathri festival. It is well known that Lord Siva is abhishekapriya (lover of ablutions). Lord Parasurama and Kroshta Muni, during their worship of the Lord here, are believed to have bathed the deity with Sahasrakalasam or a thousand pots of holy water according to Vedic rites. Now during Mahasivarathri festival days the Head Priest (Thanthri) and his team perform this puja. It is a ten-day function, each day an offering of 101 Kalasam or pots of holy water (100 being made of silver, while one is made of gold), surcharged with mantras recited by learned Brahmins seated on the Mukhamantapam. These are emptied on the deity, the golden pot Brahmakalasam being the last one. A magnificent light is the indication or identity of Lord Shiva and the Shiva Lingam is considered to be the symbol of it. Hence, the formal worship on Maha Shivaratri consists of bathing the Shiva Lingam. Lord Shiva is said to be burning with the fire of austerity and so only those items are offered to Him that have a cooling effect. A cool water bath is believed to propitiate Him best. There is a belief among devotees that participation in Sahasrakalasam and offering holy worship materials, will lead to blessings with prosperity and peaceful life. Hundreds of devotees thronging the shrine with chants of "Namah Shivaya", "Hara hara Mahadeva", and "Sambho Mahadeva"...

Sivarathri Nrutham:-
Sivarathri Nrutham at Thrikkuratti temple, according to religious scholars, resembles the cosmic dance of Shiva, called ‘Anandatandava,' meaning, 'the Dance of Bliss' symbolising the cosmic cycles of creation and destruction, as well as the daily rhythm of birth and death. The dance is a pictorial allegory of the five principle manifestations of eternal energy – creation, destruction, preservation, salvation, and illusion.
The Priest keeps sheeveli vigraha (idol) fixed on decorated frame on his head. He makes seven rounds on Pradakshina Vazhi (holy walkway made of granite around Sanctum Santorum). When the fifth round is reached at the west nada (Parvathi nada), the door opens for just 10 minutes. This is an annual ceremony. Thousands of Pilgrims rush to have a glance of this auspicious moment. At this time all the pradakshina vazhi will be lit with camphor and brass temple lamps by thousands of devotes who stay awake through the night while chanting "Nama Sivaya", "Hara Hara Mahadeva" and "Sambho Mahadeva". Older devotees sing "Hara sankara siva sankara duritham kala sivane". In this enlightened serene mood, the Priest performs Nrutham and runs the pradakshina vazhi towards the east nada. During the next two rounds he accepts "Valiya kanikka". The Sivarathri Nrutham is followed by the well known magnificent display of fireworks.

Panchaakshari:-
Shiva, as the god of destroying evil, is the third among the divine trinity of Hindu mythology. The holy mantra consisting of five-syllables: "Na" "Ma" "Shi" "Vaa" "Ya" (Om NamaH Shivaaya) in praise of Lord Shiva is chanted incessantly on special occasions like Shivaratri. His thousands of names, each of which describe His greatness, may also be chanted. Shiva means "auspicious". As Shankara, He is the giver of happiness to all. Nataraja (the king of dancers) is a favourite form adored by dancers and musicians.

Rudrabhisheka:-
There is a special set of mantras in the Vedas, "Rudra Sukta (Rudri)", which is recited by Bramhan/pundits (priests) while they offer a holy bath to the Shiva-lingam, with the waters of sacred rivers like the Ganges, cow milk, curd (yoghurt), ghee, honey and sugar powder. This ritual, known as "Rudrabhisheka", is an important part of Shiva-puja.

Shiva Rituals:-
On the day of Shivratri, a three-tiered platform is built around a fire. The topmost plank represents 'swargaloka' (heaven), the middle one 'antarikshaloka' (space) and the bottom one 'bhuloka' (earth). Eleven 'kalash' or urns, are kept on the 'swargaloka' plank symbolizing the 11 manifestations of the 'Rudra' or destructive Shiva. These are decorated with the leaves of 'bilva' or 'bael' (Aegle marmelos) and mango atop a coconut representing the head of Shiva. The uncut shank of the coconut symbolizes his tangled hair and the three spots on the fruit Shiva's three eyes.

Festival Significant for Women :-
Shivratri is considered especially auspicious for women. Married women pray for the well being of their husbands and sons, while unmarried women pray for an ideal husband like Shiva, who is the spouse of Kali, Parvati and Durga. But generally it is believed that anyone who utters the name of Shiva during Shivratri with pure devotion is freed from all sins. He or she reaches the abode of Shiva and is liberated from the cycle of birth and death.

Vrat Vidhi:-
One day before Shivaratri Vratam, most likely on Trayodashi, devotees should eat only one time. On Shivaratri day, after finishing morning rituals devotees should take Sankalp (संकल्प) to observer full day fast on Shivaratri and to take food next day. During Sankalp devotees pledge for self-determination throughout the fasting period and seek blessing of Lord Shiva to finish the fast without any interference. Hindu fasts are strict and people pledge for self-determination and seek God blessing before starting them to finish them successfully. 

On Shivaratri day devotees should take second bath in the evening before doing Shiva Puja or visiting temple. Shiva Puja should be done during night and devotees should break the fast next day after taking bath. Devotees should break the fast between sunrise and before the end of Chaturdashi Tithi to get maximum benefit of the Vrat. According to one contradictory opinion devotees should break the fast only when Chaturdashi Tithi gets over. But it is believed that both Shiva Puja and Parana (पारणा) i.e. breaking the fast should be done within Chaturdashi Tithi. 

Shivaratri puja can be performed one time or four times during the night. The whole night duration can be divided into four to get four Prahar (प्रहर) to perform Shiva Puja four times.

Ratri First Prahar Puja Time = 18:24 to 21:28
Ratri Second Prahar Puja Time = 21:28 to 24:32+
Ratri Third Prahar Puja Time = 24:32+ to 27:35+
Ratri Fourth Prahar Puja Time = 27:35+ to 30:39+


Story Of King Chitrabhanu:-
In the Shanti Parva of the Mahabharata, Bhishma, whilst resting on the bed of arrows and discoursing on Dharma, refers to the observance of Maha Shivaratri by King Chitrabhanu. The story goes as follows - Once upon a time King Chitrabhanu of the Ikshvaku dynasty, who ruled over the whole of Jambudvipa, was observing a fast with his wife, it being the day of Maha Shivaratri. The sage Ashtavakra came on a visit to the court of the king.

The sag asked the king the purpose of his observing the past. King Chitrabhanu explained that he had the gift of remembering the incidents of his previous birth.

The king said to the sage that in his previous he was a hunter in Varanasi and his name was Suswara. His only livelihood was to kill and sell birds and animals. One day while roaming through forests in search of animals he was overtaken by the darkness of night. Unable to return home, he climbed a tree for shelter. It happened to be a Bael tree. He had shot a deer that day but had no time to take it home. So he bundled it up and tied it to a branch on the tree. As hunger and thirst tormented him, he was kept awake throughout the night. He shed profuse tears when he thought of his poor wife and children who were starving and anxiously waiting for his return. To pass away the time that night he engaged himself in plucking the Bael leaves and dropping them down onto the ground.

The next day he returned home and sold the deer and then bought some food for himself and his family. The moment he was about to break his fast a stranger came to him, begging for food. He served the food first to stranger and then had his own.

At the time of his death, he saw two messengers of Lord Shiva. They were sent down to conduct his soul to the abode of Lord Shiva. He learnt then for the first time of the great merit he had earned by the unconscious worship of Lord Shiva during the night of Shivaratri. The messengers told him that there was a Lingam at the bottom of the tree. The leaves I dropped fell on the Lingam. His tears, which had shed out of pure sorrow for his family, fell onto the Lingam and washed it and he had fasted all day and all night. Thus, he unconsciously worshiped the Lord.

As the conclusion of the tale the King said that he lived in the abode of the Lord and enjoyed divine bliss for long ages and now he has reborn as Chitrabhanu.

Places it is celebrated:-
Maha Shivaratri is celebrated in many parts of both North India and South India. In North, Kashmiris celebrated Shivaratri as it is their major festivals. Similarly, it is celebrated in other northern states. In South India, it is celebrated in all the states. Shiva is considered as the 'Guru' of Yogis. Artists and dancers perform all night because it is believed Shiva can grant physical and spiritual boons. Apart from this, there are twelve Jyotirlingas (lingams of light) that are centers for Shiva worship. They are called Swayambhus that denotes places were these Lingams are said to have sprung on their own, miraculously. They are Somnath, Mallikarjuna, Mahakaleshwar, Omkareshwar, Kedarnath, Bhimashankar, Kashi Vishwanath, Trimbakeshwar, Vaijyanath, Nageshvara, Rameshwar and Grishneshwar.

Ugadi


Ugadi:-

It is believed that the creator Lord Brahma started creation on this day – Chaitra suddha padhyami or the Ugadi day. Also the great Indian Mathematician Bhaskaracharya’s calculations proclaimed the Ugadi day from the sunrise on as the beginning of the new year, new month and new day.

Ugadi is the beginning of a new Hindu lunar calendar with a change in the moon’s orbit. It is a day when mantras are chanted and predictions made for the new year. Traditionally, the panchanga sravanam or listening to the yearly calendar was done at the temples or at the Town square but with the onset of modern technology, one can get to hear the priest-scholar on television sets right in one’s living room.

Story behind Ugadi:-



Lord Sri:man Na:ra:yana created four headed Brahma. He taught him all the ve:das and assigned him the task of creating the universe. Brahma prayed to Lord Sri:man Na:ra:yana, that he would like to have Sri:man Na:ra:yana with him always.   Lord Sri:man Na:ra:yana then brought out his form as an idol, exactly as he appears in the Milky Ocean, and gave it to Brahma.  This form is the first idol form of deity in this universe.

Later on Sun God requested Brahma and got from him the idol of Sri:man Na:ra:yana.  Sun God gave it to his son Manu, Manu gave it to his son Ikshva:ku.  Thus the idol form of Sri:man Na:ra:yana was continued to be worshipped in the dynasty of Ikshva:ku for several generations. Lord Ra:ma also worshipped the same deity.  At the request of Vibhi:shana, Lord Ra:ma gave the idol to him.

Vibhi: shana while carrying the idol to his city Lanka, placed the idol on the banks of river Ka:ve:ri, for his afternoon prayers.  After finishing his prayers, when he tried to take the idol again, he could not lift it from there.  That place where the idol remained fixed is called Sri:Rangam and the idol form of deity, which is still being worshipped there is called Sri: Rangana:tha.  The day Lord Rangana:tha's idol form came into existence, which is the birth day of Lord Sri: Rangana:tha is called Yuga:di.  This is the day on which Brahma started creation of this universe. That is the main reason why we celebrate Yuga:di.


Yuga:di also signifies the start of spring season.  The whole nature changes its color. It is a new beginning with plants having new life, shoots and leaves,  green fields and meadows shining with full of colorful blossoms. Yuga:di is celebrated on the first day (pa:dyami) of the first month (Chaithra) of our traditional calendar.

Sammakka & Saarakka

According to History, about 6-7 centuries ago, a group of Koya Indians traveling through the Dandakaaranya found a little girl playing with tigers. The head of the tribe adopted and named her Sammakka. She married the headman of a neighboring village. Saaralamma was her daughter. The Koya Indians were a tributary to the Kakatiyas, who ruled the country of Andhra from Warangal City between 1000 AD and 1380 AD. Once, the Koyas assisted the Kakatiyas in a war. After sometime, there was a severe drought that lasted for years and as a result the mighty Godavari River dried up. Koyas didn’t have even food to eat. However, the Kakatiyas insisted on the payment of taxes. The Kakatiya emperor sent his forces to teach the Koyas a lesson and collect taxes and the Koyas had no option but to resist. After a bitter war, the Kakatiya Prime Minister visited war ravaged Koya kingdom. By then most of the Koya chiefs had fallen in battle. The Prime Minister proposed peace and offered Sammakka a place in the emperor’s harem as the chief queen. Samakka turned down the offer and resolved to continue the fight to avenge the dead. The battle continued and Samakka was wounded. Samakka told her people that as long as they remembered her, she would protect them. Then, she cursed the Kaktiya dynasty to perish and disappeared into the deep forest. The Koyas searched for their queen and found only a red ochre box, her bangles and the pug-marks of a huge tigress. Soon after, Muslim invaders destroyed the Kakatiya dynasty. Since then, the Koyas, Waddaras and other Indian tribes and castes have been holding festivals in memory of Sammakka and Saralamma regularly.

There is no permanent idol of the deity. It is said that a Koya boy who gets a vision before the festival, searches in the forest for a week without food and sleep and finally brings the goddesses in the farm of two vermilion caskets tied to a piece of bamboo, one representing the main deity Sammakka and the other her daughter Saarakka or Saaralamma. The actual festival begins in the month of Magha, on Suddha Pournami (full moon day) evening when Saaralamma would be traditionally brought from Kanneboyinapalle, a village in the forest, and installed on a gaddi (the throne or platform), an earthen platform raised under a tree. Animals are sacrificed and intoxicants such as liquor are widely used.

Hundreds of people who are often possessed by the goddess come there dancing ecstatically throughout their journey. The special offering to the deity is jaggery. Some offer jaggery equal to their weight and distribute. It is a rare opportunity to witness some ancient practices especially pabba, Shiva sathi (sathi means lady) and Lakshmi Devaras. Shiva sathis are women who go into trance and bless the childless women to have children and the process of that blessing is called pabba. The belief is that those who had the blessings of Sammakka-Saralamma through the words of Shiva sathis would have children. Children get their heads tonsured. Young girls accompanied by their parents performed special prayers with the help of Shiva sathis and Lakshmi Devaras to get suitable husbands.

జనమేజయుడు

భారతీయ సంప్రదాయ సాహిత్యంలో శ్రవ్యకావ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఒకరు చెపుతుంటే మరొకరు వినే కావ్యాలను శ్రవ్య కావ్యాలంటారు. సంప్రదాయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వక్త, శ్రోత ఉన్నారు.

పంచమ వేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతానికి వైశంపాయనుడు వక్తగా, జనమేజయుడు శ్రోతగా ఉన్నారు. పాండవమధ్యముడైన అర్జునుడికి మునిమనుమడు జనమేజయుడు. సుభద్రా, అర్జునులకు అభిమన్యుడు జన్మించాడు. అభిమన్యుడికి, ఉత్తరకు కొడుకుగా పరీక్షిత్తు జన్మించాడు. పరీక్షిత్తుకు, మాద్రవతికి జన్మించినవాడే మహాభారత శ్రోత అయిన జనమేజయుడు. చిన్నపిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదేనని, ఆ బాధ్యతను మరచినపుడు చిన్నపిల్లలు చేసిన తప్పు వల్ల కలిగే ఫలితానిన పెద్దలు అనుభవించాల్సి వస్తుందని జనమేజయుడి జీవితంలో జరిగిన సంఘటన వివరిస్తుంది. జనమేజయుడు కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్న సమయంలో ఒకనాడు ‘పరమ’ అనే ఒక కుక్క తన కొడుకు ‘పారమేయుడు’ను వెంట పెట్టుకొని దేవలోకం నుండి అక్కడికి వచ్చింది. పారమేయుడిని చూసిన జనమేజయుడి సోదరులు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడనే ముగ్గురు చిన్నపిల్లల చేష్టలుగా దానిని హింసించారు. అది వెంటనే వెళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తల్లి పరమతో చెప్పింది. పరమ, రాజైన జనమేజయుడి దగ్గరకు వెళ్ళి ఓ రాజా నీ సోదరులు నిష్కారణంగా నా కొడుకుని బాధించారు. రాజు సోదరులైనంత మాత్రాన ఇలా అమాయకులను బాధించటం న్యాయం కాదు కదా. దీనికి ప్రతిగా సాధు ప్రాణులకు బాధను కలిగించిన పాపానికి మీకు తగిన భయ కారణమన కష్టాలు కలుగునుకాక అని పలికి అంతర్ధానమైపోయింది. పరమ మాటలను విన్న జనమేజయ మహారాజుకు ముందు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ తరువాత దాని శాపం నుంచి విముక్తి పొందటానికి తన పురోహితుల సలహాను తీసికొని దీర్ఘ సత్రయాగం అయిపోయిన తర్వాత శుత్రశ్రవణుడు అనే ముని వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్ధించి తపో నిష్టాపరుడైన ఆయన కుమారుడు సోమశ్రవణుడుని తన పురోహితునిగా పంపమని అతనిచేత యజ్ఞయాగాలను చేయించి తన సోదరులు చేసిన అపరాధానికి, శాంతిని కలిగించుకున్నాడు. సోమశ్రవణుడిని చేరటానికి జనమేజయ మహారాజు ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ ముని ఆశ్రమాలను వెదకవలసి వచ్చింది. పిల్లలు తప్పు దోవలో నడిస్తే దీని ఫలితాన్ని పెద్దలు అనుభవించవలసి వస్తుందని జనమేజయుడి కథ వివరిస్తోంది.

Sunday, 2 April 2017

ఎలాంటి ఆంజ‌నేయ స్వామి ప‌టాన్ని పూజించాలి

ఎలాంటి ఆంజ‌నేయ స్వామి ప‌టాన్ని పూజించాలి

హ‌నుమంతుడు, ఆంజ‌నేయ స్వామి. ఎలా పిలిచినా ఆ స్వామి అంటే చాలా మంది భ‌క్తుల‌కు న‌మ్మ‌కం. అన్ని ఆప‌ద‌ల నుంచి త‌మ‌ను హ‌నుమ ర‌క్షిస్తాడ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు. అందులో భాగంగానే చాలా మంది మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ స్వామికి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆ రోజు ఉప‌వాసం కూడా ఉంటారు. మ‌ద్యం, మాంసం ముట్ట‌రు. నిష్ట‌గా ఉంటారు. అయితే ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే భ‌క్తుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలుసు, కానీ… వివిధ రూపాల్లో, వివిధ సంద‌ర్భాల్లో చిత్ర ప‌టాల రూపంలో ఉన్న ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం…

సూర్య భ‌గ‌వానునికి న‌మ‌స్క‌రిస్తున్న హ‌నుమంతుడు…
హ‌నుమంతుడు సూర్యునికి న‌మ‌స్కారం చేస్తున్న‌ట్టుగా ఉండే చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే దాంతో భ‌క్తుల‌కు అంతులేని జ్ఞానం సిద్ధిస్తుంది. తెలివిమంతులు అవుతారు. అన్నింటా విజ‌యాలు సాధిస్తారు. విద్యార్థులైతే చ‌దువుల్లో, వ్యాపారులైతే త‌మ రంగంలో ముందుకు దూసుకెళ్తారు.

రామునికి మొక్కుతూ…
శ్రీ‌రాముని పాదాల‌ను మొక్కుతూ ఉండే హ‌నుమంతుని చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే భ‌క్తులకు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు, ఉద్యోగ స‌మస్య‌లు ఉండ‌వు. అవి ఉన్నా సుల‌భంగా పరిష్కార‌మ‌వుతాయి.

భ‌జ‌న చేస్తూ…
హనుమంతుడు భ‌జ‌న చేస్తున్న‌ట్టుగా ఉండే చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే భ‌క్తుల‌కు అనుకున్న కోర్కెలు తీరుతాయి. పెట్టుకున్న ల‌క్ష్యాలు నెర‌వేరుతాయి. ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు.

లంకను ద‌హ‌నం చేస్తూ…
లంక‌ను ద‌హ‌నం చేస్తున్న‌ట్టుగా ఉండే హ‌నుమంతుడి చిత్ర ప‌టాన్ని పూజిస్తే భ‌క్తుల‌కు ధైర్య సాహ‌సాలు వ‌స్తాయి. భ‌యం పోతుంది. దుష్ట పీడ‌లు ఎదుర్కొంటున్న వారు ఇలాంటి హ‌నుమంతుని ప‌టానికి పూజ చేస్తే ఫ‌లితం ఉంటుంది.

ఉత్త‌రం వైపుగా…
ఉత్త‌రం దిక్కుగా ముఖం పెట్టిన ఆంజ‌నేయ స్వామి చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే దాంతో భ‌క్తుల‌కు అంద‌రి దేవ‌తల ఆశీస్సులు క‌లుగుతాయి. అంద‌రు దేవ‌త‌లు శుభ దృష్టితో చూస్తారు. అంతా మంచే జ‌రుగుతుంది.