Tuesday, 29 September 2015

సీతమ్మ వారి పూర్వీకులు ఎవరు ?

నిమి సీతాదేవి వంశ మునకు మూల పురుషుడు. ఈయన కొడుకు  "మిధి",
మిధి కుమారుడు  జనకుడు. 
ఈ  వంశము నందే కీర్తి రాతుడు, మహారోముడు ప్రభవించారు . 
మహా రామునికి స్వర్ణ రోముడు.
స్వర్ణ రోము నికి  హ్రస్వ రోముడు

హ్రస్వ రోముని సన్తామే జనకుడు.  
జనకుని అసలు పేరు " సీరధ్వ జుడు" , 
జనకుని తమ్ముడు  " కుశె ధ్వజుడు "
హ్రశ్వరోముడు  జనకునికి పట్టాభిషేకము చేసి అడవులకు వెళ్ళిపొయినాడు. 
జనకునికి  సీతమ్మ వారితో పాటు  "ఊర్మిళ "  కూడా ఉన్నది . 
జనకుని తమ్ముడు "కుశె ధ్వజుడు" కి మాండవి, శ్రుత కీర్తి  అను కుమార్తెలు ఉన్నారు .

లక్ష్మణ దేవర నవ్వు

రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ, అంగద, సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం. పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు. లక్ష్మణ దేవర నవ్వినది అందరూ చూశారు.ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని, భరతునిచే తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక.

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసినవ్వేడేమో అనుకున్నాడట.

తండ్రిని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.

రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట.

బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.

అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని" ఏందుకు నవ్వేవు సోదరా?" అని అడిగాడు.

దానికి లక్ష్మణదేవర "అన్నా!' సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయంలో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.'

దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 'పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని' వెళ్ళిపోయింది.

అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు" అన్నాడు.

దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు


తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.
 

Sunday, 27 September 2015

గుడి వెనుక భాగాన్ని మొక్కుతారెందుకు


గుడిలో మూలవిరాట్టుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా, వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. అందుకే భక్తులు తమ డబ్బు, శ్రమ వెచ్చించి భగవంతుని దర్శనానికి వస్తుంటారు. ఆ మంత్ర శక్తి వలనే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపుగోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్సక్తిని పొందడానికి వీలుగా వుంటుంది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో |
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ||
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే |
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ||
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః |
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ||
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ |
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ||
కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ |
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ||
అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ||
అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ |
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ||
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ |
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ||
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||
అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ||
అఙ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ||

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || 1 ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు || 2 ||
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే |
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ || 3 ||
తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే |
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే || 4 ||
అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి |
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 5 ||
పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి |
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 6 ||
ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ |
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 7 ||
ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని |
భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 8 ||
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదో‌உపి |
భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 9 ||
భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝుంకారగీత నినదైః సహసేవనాయ |
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 10 ||
యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః |
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 11 ||
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః |
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 12 ||
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో |
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 13 ||
శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః |
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 14 ||
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ |
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 15 ||
సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః |
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 16 ||
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః |
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 17 ||
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః |
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 18 ||
తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః |
కల్పాగమా కలనయా‌உ‌உకులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 19 ||
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః |
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 20 ||
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే |
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 21 ||
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే |
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 22 ||
కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే |
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 23 ||
మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర |
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 24 ||
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణమ్ |
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ || 25 ||
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః |
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || 26 ||
బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః |
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 27 ||
లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో |
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 28 ||
ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః |
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రఙ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే || 29 ||

తిరుమల క్షేత్రంలోనే ప్రతినిత్యం








తిరుమల క్షేత్రంలోనే ప్రతినిత్యం



తిరుమల క్షేత్రంలోనే ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే వుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఊరేగింపు నిర్వహింప బడుతూనే ఉంటుంది. ఈ వేంకటాద్రి పుణ్యక్షేత్రంలోనే ఏడాది పొడవునా ప్రతిరోజూ పండుగే. ప్రతి రోజూ పచ్చతోరణాలే, ప్రతి పూటా పిండి వంటలే, పరమాన్నాలే. అలంకారప్రియుడూ, నైవేద్య ప్రియుడూ, అంతకంటే అత్యంత భక్తి ప్రియుడూ అయిన శ్రీవేంకటేశ్వరునిది ఎంతటి భోగం.. ఎంతెంతటి వైభోగం.. సర్వదేవ తలకు ఆలవాలమై నిరంతరాయంగా భక్త జన సందోహంతో కిటకిట లాడే దివ్య క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతూ వుంది. వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలినాళ్ళలోనే శ్రీనివాసుడు బ్రహ్మదె వుణ్ణి పిలిచి జగత్కళ్యాణం కొరకు తనకు ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివేదనాదులు చేయవలసిందని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞప్రకార మే బ్రహ్మదేవుడు వేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం (అశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తి అయ్యోటట్లుగా, ముందు తొమ్మిది రోజుల నుంచి ఈ ఉత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించారు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది చెంది నాటి నుండి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అంతే గాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీనివాసదేవునికి జరుపబడుతున్న ఉత్సవాలు కనుకే బ్రహ్మోత్సవాలని కూడా పేరు కలిగిందని, బ్రహ్మాండంగా జరిగే ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలు అని కూడా పిలువ బడుతున్నాయని మరోక ప్రచారం. ఏది ఏమైనా దేవదేవుడిని కన్నులాల వీక్షించడానికి లక్షలాది భక్తులు తిరుమలవీ ధుల్లో వేచిఉంటారు. ఈ ఉత్సవాలను క్రీ.శ 614 లో పల్లవ రాణి సమవాయి (పేరిందేవి) నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. బ్రహ్మోత్సవాలకు ముందు ఆమె బహూకరించిన వెండి భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించే వారన్న కథ ప్రచారంలో ఉంది. తదుపరి క్రీ.శ 1254 లో తెలుగు పల్లవరాజు, విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ 1328 తిరువేంకట నాధయాదవరాయలు, క్రీ.శ 1446 లో హరిహర రాయులు, క్రీ.శ 1530 లో అచ్యుతరాయులు ఇలా క్రీ.శ 1583 నాటి వరకు బ్రహ్మో త్సవాలు ఇంచు మించు ప్రతి నెలా ఒ క బ్రహ్మోత్సవం నిర్వహిం చిన్నట్లు శాసనాల ద్వారా తెలిసింది. అయితే రాజులు, రాజ్యాలు అంతరించిపోవడంతో నెలకు ఒక మారు జరిపే బ్రహ్మోత్సవాలు అర్దాంతరంగానే ఆగి పోయాయి. కాని అలనాటి శ్రీనివాసప్రభు కోరిక మేరకు జగత్కళ్యాణం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా వైభవంగా కొనసాగుతూ కొండలరాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటుతున్నాయి. అంచేత బ్రహ్మోత్సవ సమయంలో ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఉత్సవాలకు ముందు ని బ్రహ్మరథం్ణ ఉం టుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేంచేసి ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తారు. కాని ఒక్క రథోత్సవం రోజు మాత్రమే బ్రహ్మరధం ఉండదు. స్వామి వారి రధోత్సవం నాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి తేరు యొక్క పగ్గాలను పట్టుకుని లాగుతూ రధోత్సవంలో పాల్గొంటాడు. అందు వల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా పిలవ బడుతూ సాటి లేని విధంగా జరుపబడుతున్నాయి. ఈ ఉత్సవాలు ధ్వజా రోహణం నుంచి ప్రారంభమై ధ్వజావరోహణంతో సమాప్తమవుతాయి.

ధ్వజారోహణం
వైఖానసాగమ శాస్త్రోక్తంగా గరుడ కేతన ప్రతిష్ఠ, కంకణధారణ, ఆలయ ఆవర ణంలోనూ బయట చుట్టూ అష్టదిక్కులలోనూ బలిని వేస్తూ శ్రీస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా, ఆలయ పరివారదేవతలతో ఊరేగుతూ వుండగా అష్ట దిక్పాలకులు ఆహ్వానింపబడతారు. ఇలా దేవతలను ఆహ్వానించిన అనంతరం శ్రీస్వామి వారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరకు చేరుకుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదక్షణలో వున్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు. పిదప శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం నాడు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక ఆ తర్వాత దేవేరుల సమేతంగా శ్రీ స్వామి వారిని ఆ రాత్రి నుంచే ఊరేగింపు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కొక్క వాహనం మీద ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి.

గరుడవాహనం
బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అత్యంత ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువునకు నిత్యవాహనం. అందువలన గరుడోత్సవానికి ఎక్కువ ప్రాముఖ్యత, ఔచిత్యం ఉన్నాయి. 5వ రోజు రాత్రి ఈ గరుడ సేవ తిరుమల రాయునికి జరుగు తుంది. కాగా శ్రీవిల్లి పుత్తూరు దేవస్తానం నుండి వచ్చే తుల సమాలలు, చెన్నపట్నం నుండి గొడుగులు సాంప్రదాయంగా వార్షిక బ్రహ్మోత్స వాలలో గరుడ సేవనాడు స్వామికి సమర్పించబడుతున్నాయి. ఇదే విధంగా ప్రజల పక్షాన రాష్ర ముఖ్యమంత్రి శ్రీవారికి సమర్పించిన పట్టు వస్త్రాలను ఆ రోజు శ్రీవారికి ధరింప చేస్తారు. దూర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలి వస్తారు.

స్వర్ణరథం
ఉదయం హనున వాహనంపై ఊరేగిన స్వామి సాయంకాల వేళ స్వర్ణ రధోత్సవంపై భుక్తులకు దర్శన మిస్తారు. అత్యంత విశిష్టమైన స్వర్ణరధం శ్రీనివాసునికి అత్యంత ప్రీతి పాత్రమైనది. స్వర్ణ మయమైన రధంలో శ్రీ దేవి, భూదేవేరులతో మలయప్పస్వామి దర్శన మిస్తారు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరధం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రధంలో కూడా ఉంటుంది. భక్తుల నృత్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వివిధ భజన బృందాలు ఉత్సాహంగా పాల్గొంటాయి. ఈ స్వర్ణ రధోత్సవ సేవలో కళ్యాణ కట్ట సేవా పరులు ఒక సువర్ణ ఛత్రాన్ని తొలుత అలంకరించడం సాంప్రదాయం.

అశ్వవాహనం
బ్రహ్మోత్సవాలలో 8వరోజు రాత్రి ఏడు కొండలవాడు తిరువీధులలో అశ్వారూఢుడై విహరిస్తారు. జంతువులలో మిక్కిలి వేగం గల జంతువు అశ్వం. భగవంతుని అవతారాలు 10 ప్రసిద్ద మైనవి. చివరి అవతారం కల్కి. కలియుగాంతంలో కల్కి రూపం ధరించి కత్తి చేత పూని అశ్వవాహనం పై స్వామి దుష్ట సంహారం చేస్తాడని పురాణాలు చెపుతున్నాయి. శ్రీనివాసుడు పారువేట ఉత్సవం కూడా అశ్వవాహాల పైనే నిర్వహిస్తారు. పద్మావతి శ్రీనివాసుల తొలి చూపు వేళ, ప్రణయ వేల, పరిణయ వేళ సాక్షిగా నిలచినది ఈ అశ్వమే. అశ్వాన్ని అధిరోహించిన స్వామి భక్తులకు దర్శన మిస్తారు.

హనుమద్వాహనం
ఆరవ రోజు ఉదయం బ్రహ్మోత్సవాలలో వరద హస్తం దాల్చిన వెంకటాద్రిరాముడు హనుమద్వాహనం పై ఊరేగుతారు. హనుంతుడు భగవద్భక్తులలో అగ్రగన్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్నాతుడుగా, నవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్దిగాంచిన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి తిరువీధులలో దర్శన మివ్వడం భక్తకోటికి ఆనందదాయకం. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, ఆజాడ్యం, వకృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయని పురాణాలు చెపుతాయి.

గజవాహనం
బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు రాత్రి గజ వాహ నం పై శ్రీనివాస ప్రభువు కనువిందు చేస్తారు. పూర్వం యుద్ధాలలో రధ , గజాశ్వాల ను వాహనాలుగా ఉపయో గించే వారు. రాజులను పట్టాభిషేకాధి సమయాలలో గజాధిష్ఠిలను చేసి ఊరేగిస్తా రు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానిం చాల్సి వస్తే గజారో హణం కావించే ప్రక్రియ నేటికి కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజ వాహన రూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగడం భక్తులకు మరుపు రాని దృశ్యం.

సూర్యప్రభవాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం శ్రీహరి సూర్య ప్రభ వాహనం అధిష్ఠించి తేజో విరాజితుడై కనిపిస్తారు. సూర్యుడు తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రధాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే మొక్కలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలనవన్నీ సూర్య తేజం వల్లనే లభిస్తాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది గాంచిన తిరుమల మాడ వీధులలో ఊరేగడం భక్త కోటికి ఆనంద దాయకం. సూర్యప్రభ పైన శ్రీనివాసుని దర్శనం తిరుమల యాత్రికులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఆరోగ్యం, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ వాహన సేవ వల్ల భక్తులకు సిద్ధిస్తాయి.

చంద్రప్రభవాహనం
స్వామికి సూర్య చంద్రులు రెండు నేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు బ్రహ్మో త్సవాలలో ఏడవ నాటి రాత్రి చంద్రప్రభ వాహనం పై ఊరేగుతారు. రాత్రి నిశాకరుడైన చంద్రుని ప్రభతోకూడిన వాహనం పై విహరించడం సమంజసమే. చంద్రుడు భగవంతుని మారు రూపమే. ఓషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శన మిస్తున్నారు. అందు వలన ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక , ఆదిభౌతిక, ఆది దైవిక మనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.

పెద్దశేషవాహనం
అంకురార్పణతో సాంప్రదాయబద్దంగా ఆరంభించబడిన బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ విష్వక్సేనల ఊరేగింపు. విష్ణువు యొక్క సర్వ సైన్యాధి పతి విష్వక్సేనుడు ఆయన ఊరేగింపుతో ప్రారంభించబడిన ఈ తిరువీధి ఉత్సవాలలో ఆదిశేష వాహనంలో దేవదేవుడు మొదటి రోజు రాత్రి కన్నుల పండుగగా దర్శనమిస్తారు. ఆదిశేషుడు శ్రీ హరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలరాముడుగా, శ్రీ మన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు, భూ భారాన్ని వహించేది కూడా శేషుడే. ఈయన శ్రీ భూదేవి సహేతుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలి రోజు ఏడుపడగల బంగారు శేషుని పైస్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. శేష వాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం ఆ నుంచి దైవత్వం, పరమ పదం సిద్దిస్తాయి. ఆ సందేశాన్ని మనకు అందించడానికే శేషాద్రి నాదుడు శేష వాహనం పై తిరుమాడ వీధులలో విహరిస్తారు.

చిన్న శేషవాహనం
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు మళయప్పస్వామి ఐదు తలల చిన్న శేష వానహం పై దర్శనమిస్తారు. నాగజాతిలో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని పేర్కొన్నారు. కాబట్టి పెద్ద శేషవాహనం ఆదిశేషుడిగాను, చిన్న శేషవాహనం వాసుకిగాను భావించ వచ్చు. ఎల్లప్పుడూ ఆదిశేషుని మీద శయనించే స్వామి మళ్లి ప్రీతితో రెండవ పర్యాయం శేషవాహనం పై దర్శనమిస్తారు. ప్రతి మానవ శరీరంలో మూలాధారం నుండి సహస్రారికర్ణిక వరకు ఏడు చక్రాలు ఉంటాయి. వాటిని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అణాహత, విసుద్ద, ఆజ్ఞ, సహస్రారము అని పేర్కొంటారు. మూలాధారం నుండి సహస్సారం వరకు బ్రహ్మం దండి మధ్య నుండి (వెన్నుముక మధ్య నుండి) కుండలిని శక్తి అనే సుఘమ్నాడి సర్పాకారంలో ఉంటుంది. సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది. శేషవాహం పై శ్రీవారిని దర్శించి ధ్యానించే భక్తులకు మనోవృత్తులు శ్రీనివాసుని అధినమై అభిముఖ మౌతాయి. అటు నుంచి వారిలోని కుండలిని సర్పరూపం శిరస్సు సహస్రారంలోనూ, పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైన సేవకులు అవుతాడు. ఆ దివ్య దర్శనం చిన్న శేషవాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ది లభిస్తుంది అని పండితులు చెప్పుతారు.

రథోత్సవం
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉభయ దేవేరులతో మలయ ప్పస్వామిని మహోన్నత రథం పై అధిష్టింపచెసి ఆలయ వీధులలో విహరింప చేస్తారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పిస్తారు. గోవింద నామ సంకీర్తనలు, భజనలు, నినాదాలు మిన్నంటుతాయి. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్దాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాధిగ్రంధాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలు పూన్చిన రథం పై విహరిస్తారు. రధోత్సవంలో భక్తులు రథాన్ని లాగే ఈ వేడుక చూసి తీరవలసిందే.

హంసవాహనం
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపాణి అయి సరస్వతి మూర్తిగా దర్శనమిస్తాడు. హంసవాహనాన్ని అధిరోహించి పయనించే శ్రీవేంకటేశ్వరస్వామి సూర్య భగవానునిలోను శ్రీమన్నారాయణునికి ప్రతీక. హంసకు ఒక విశిష్ట గుణం ఉంది. అది క్షీర - నీర విభాగం చేయగలదు. అంటే పాలు నీళ్ళు కలిపి ముందు పెడితే పాలు గ్రహించి నీరు వదలి వేయగల శక్తి హంసకు ఉంది. అహంభావం కలిగిన భక్తులలో అహన్ని తొలగించి సమభావం కలగించడానికే శ్రీనివాసుడు హంస వాహన రూఢుడై తిరువీధులలో విహరిస్తారు.

సింహవాహనం
మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనం పై దర్శన మిస్తారు. అనంత తేజో మూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసులలో సింహలా గోచరిస్తారు. సింహం పరాక్రమం కల జంతువు అది మద గజాలనే సంహరించ గలదు. అట్టి సింహాన్ని తనకు వాహనంగా చేసుకున్న వేంకటపతి పరాక్రమం ఎట్టిదో ఊహించుకోవచ్చు. యోగ శాస్త్రంలో సింహం సింహావన శక్తికి శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తులు సింహబలం అంతటి భక్తి బలం కలిగినపుడు భగవంతుడు తనను అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్దాన్ని గ్రహించాలి. తిరుమల ఆలయం లోపల ఉన్న ఆనంద నిలయం పై సింహాలు స్వామికి సింహం పట్ల ఉన్న ప్రీతిని స్పష్టం చేస్తున్నాయి.

ముత్యాల పందిరి వాహనం
బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో ఏడు కొండల స్వామి ప్రత్యక్షమౌతారు. ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ని ప్రసాదిస్తాయి, తెల్లని కాంతులీనుతుంటాయి, జోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రకాశిస్తుంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలిమి వస్తువులలో ముత్యం ఒకటి. శ్రీక్రిష్ణుడు మెడలొనూ ముత్యాలను ఆభరణాలు ధరిస్తున్నట్లు పురాణ గాధలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడిన వాహనంలో ఏడు కొండల స్వామి మిరిమిట్లు గొలుపుతూ ముచ్చటగా ఊరేగుతారు. చల్లని ముత్యాల క్రింద నిలచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.

సర్వభూపాల వాహనం
బ్రహ్మోత్సవాలలో 4 వ రోజు రాత్రి మలయప్పస్వామి సర్వభూపాలవాహనం పై విహరిస్తారు. ఆది దేవుడైన శ్రీహరి రాజాధిరాజు కావడంలో ఆశ్చర్యం ఏముంది. భూపాలురు అనగా రాజులు సర్వభూపాలురు అంటే అందరూ రాజులని అర్దం. ప్రజలను రంజింప చేసే వారే రాజులు. విష్ణ్వంశ లేని వాడు రాజు కాలేడు. అందుచేత రాజులు అందరూ అంతో ఇంతో భగవదాంశ కలవారే. వారు అంశలైతే స్వామి అంశి. ఇక్కడ రాజులకు రాజాధిరాజుకు అంశ అంశి భావం కుదిరింది. అందుకే సర్వ భూపాలురూ స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాల పై మోస్తూ తిరువీధుల్లో విహరిస్తున్నారు.

కల్పవృక్ష వాహనం
ప్రకృతి శోభను సమకూర్చేది చెట్టు అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటిది కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే అందిస్తాయి. అలా కాక కల్ప వృక్షం వాంఛిత ఫలాలన్నింటిని ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శన మిస్తాడు శ్రీ శ్రీనివాసుడు. కల్ప వృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఈ వాహన దర్శనం వల్ల స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

వెూహినిదేవి అవతారం
బ్రహ్మోత్సవాలలో 5 వ రోజు నాటి ఉదయాన ఆపద మ్రొక్కుల వాడు మోహిని రూపం వహించి శృంగార దేవతగా దర్శన మిస్తారు. ప్రక్కనే స్వామి దంతపు పల్లకి పై వెన్నముద్ద క్రిష్ణుడై మరో రూపంలో కన్నుల ముందుకు ఆలయం నుండి విచ్చేస్తారు. కమనీయమైన శ్రీకాంతుని రూపం జగత్సమ్మోహకంగా ఉంటుంది. శ్రీమహావిష్ణువు ఏ రూపం ఎత్తినా , పురుషులకు కూడా సమ్మోహకుడౌతాడు. ఇక మోహినీ రూపంలో చెప్పనవసరం లేదు. జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉన్నది. ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయులే. ఆయన ఈ బ్రహ్మోత్సవాలలో మోహిని రూప ధారియై ప్రపంచ మంతా తన మాయా విలాసమనే, తన భక్తులు కాని వారు ఆ మాయా ధీనులు కాక తప్పదని , తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాట గలరని మోహిని రూపంలో స్పష్టం చేస్త్తున్నారు ఆపదమొక్కులవాడు. అందు వల్ల మాయామయమైన ఈ జగత్తు నుండి బయట పడడానికి మోహిని రూపంలో సమ్మోహంగా ఆవిర్భవించి తిరుమల మాఢ వీధులలో ఊరేగుతున్నారు.

చక్రస్నానం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిది చక్రస్నానం, యజ్ఞాంతంలో ఆచరింపబడే అవభృథస్నానమే. యజ్ఞం చివర మరలా అవభృథస్నానం చేయించడం సాంప్రదాయం. తొమ్మిద రోజులు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింప బడి, లక్షలాదిమంది భక్తులు పాల్గొన్న యజ్ఞం ఇది. అవభృథస్నానంలో చక్రతాళ్వారులకు స్నానం పుష్కరిణిలో నిర్వహించే ముందు స్నపన తిరుమంజనం గావిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతో ఉన్న శ్రీవారి సరసన చక్రతాళ్వారులు పాలు, పెరుగు, నెయ్యి ఇత్యాదులచే అర్చకులు చేసిన అభిషేక కైంకర్యాన్ని అందుకుని, ధూపదీపాధికంతో ప్రసన్నులవుతారు. చక్రస్నాన సమయంలో అర్చకులు, అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేస్తారు. యజ్ఞ ఫలానికి అధికారులౌతారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపాలలో స్వామి చివరి రూపమైన అర్చా విగ్రహానికి జరిగే ఉత్సవాల సందర్శనం అన ంత ఫల ప్రదాయకం.

చతుర్వేదాలు

హిందూధర్మమునకు వేదములే మూలము. వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటె ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపబడినవి.

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండ యనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాది కర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది.

ఒక్క పరబ్రహ్మమును తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపమును నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు.

మంత్రదష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలుకారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పబడినవి.

వేదవ్యాసుడు ఈ వేదములను నాలుగుగా విభజించెను.
 
ఋగ్వేదము
ఋగ్వేద దేవత తెల్లని రంగు గలది. దీనికి రెండు చేతులుండును. దీని ముఖము గాడిద ముఖము. అక్షరమాలను ధరించి సౌమ్య ముఖముతో, ప్రీతిని ప్రకటించుచు, వ్యాఖ్యానము చేయు యత్నములో నుండును. దీనిలో 21 శాఖలు ఉన్నవి. ఇది మంత్రములతో కూడుకొన్నది. ఇందులోని మంత్రములు ఇంద్రాది దేవతలను (స్తుతించుట జరిగినది) స్తుతించినవి.
 
యజుర్వేదము
యజుర్వేద దేవత మేక ముఖము కలదై పసుపుపచ్చని రంగుతో, జపమాలను ధరించి, ఎడమ చేతితో వజ్రాయుధమును ధరించి, ఐశ్వర్యమును, శుభమును ప్రసాదించుచుండును. దీనిలో 101 శాఖలు ఉన్నవి. గద్యము లన్నింటిని సేకరించినవి ఇందులోని శ్లోకములు (మంత్రములు)
 
సామవేదము
సామవేద దేవత నల్లకలువరేకువలే నిగనిగలాడుతూ, నీలశరీరముతో గుర్రము ముఖముతో, కుడిచేతితో అక్షరమాలను, ఎడమచేతితో కుండను (పూర్ణ కుంభమును) ధరించియుండును. దీనిలో 1009 శాఖలు ఉన్నవి. గేయ రూపములోనున్న మంత్రములు సంగీతమునకు సంబంధించినవి.
 
అధర్వవేదము
అధర్వవేదదేవత తెల్లని రంగుతో, కోతిముఖముతో, ఎడమచేతిలో జపమాలతో, కుడిచేతిలో (పూర్ణ కుంభము) కుండతో విలసిల్లుచుండును. దీనిలో 9 శాఖలు ఉన్నవి. మిగిలినవన్ని ఇందులో చెప్పబడినవి.
 
ఉపవేదాలు
ప్రతి యొక్క వేదానికి ఉపవేదాలు ఉన్నాయి.
ఋగ్వేదమునకు ఉపవేదం ఆయుర్వేదము.
యజుర్వేదమునకు ఉపవేదం ధనుర్వేదము.
సామవేదమునకు ఉపవేదం గాంధర్వ వేదము.
అధర్వణవేదమునకు ఉపవేదం స్థాపత్య శాస్త్ర వేదము.

మహాభారతం - ముఖ్యాంశాలు








మహాభారతం



మహాభారతం ఒక ఉద్గ్రంధం. ఇది ధర్మశాస్త్రం. అంతేకాక ఇది చారిత్రక గ్రంధం కూడా. కాబట్టే ఆనాటి సామాజిక, రాజకీయ లక్షణాలు ఈ గ్రంధంలో లిఖించబడ్డాయి. సర్వ లక్షణ సమన్వితమైన మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించినవారే. అందులోని పాత్రల స్వభావాలను ఆకళింపుచేసుకున్నవారే. ఆ ధర్మశాస్త్రాన్నీ అనుసరించేవారే. లౌకికములు, అలౌకికములు అగు విషయములెన్నో ఇందులో చెప్పబడ్డాయి. మహాభారతంలో మూల పురుషుడు, ఆ యుగ సంధికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే ఐ నడిపించిన శ్రీ కృష్ణ భగవానుడు అందరికీ ఆరాధనీయుడే. భగవద్గీత ద్వారా సృష్టి సిద్ధాంతాన్ని మనో వైజ్ఞానికంగా తెలియజేసి, భారతీయ సంప్రదాయానికి ప్రామాణిక వేదంగా దాన్ని మనకు అందించిన మాధవుని పాత్ర మహిమాన్వితం. ద్వాపర యుగానికీ, కలియుగానికీ సంధికాలంలో జరిగిన మహాభారత యుద్ధం ఎన్నో అనుభవాల సమాహారం. "ఇందు ఏది కలదో అదియే ఇతరత్రా కలదు. ఇందు లేనిది ఎందునూ లేదు" అన్న ప్రశస్తి భారతానికి కలిగింది. మహాభారతంలో 18 పర్వాలు, లక్ష శ్లోకాలు ఉన్నాయి.భారతంలో అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం భగవద్గీత. ఒక మహా గ్రంధంలో అంతర్భాగమైయుండి కూడా గీత స్వతంత్ర గ్రంధంగా విరాజిల్లడం అద్భుతం. ఉపనిషత్తుల సారమే గీత. భీష్మ పర్వమ్ములోని 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా రూపొందినవి. ఇందులో 700 శ్లోకాలున్నాయి.

మహాభారత గ్రంధం ద్వారా మనకు పరిచయమైన పాత్రలు అనేకం. వాటిలో కొన్నిటిని మాత్రమే మనం నిత్యం చర్చిస్తుండడంవల్ల మిగిలిన పాత్రల గురించి సమగ్రమైన విజ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేసుకోలేకపోతున్నాం. ముఖ్య పాత్రలైనప్పటికీ, మూల కథకు ఆధారభూతమైనవైనప్పటికీ వాటిని తగినంత ప్రాధాన్యతను మనం సాధారణంగా ఇవ్వం. భారతం ఆమూలాగ్రం చదివి వాటిని గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాకపోవడం, వాటికోసం పదే పదే భారతాన్ని మొదట్నుంచీ మళ్ళీ మొదలుపెట్టడంకంటే కూడా ఆ పాత్రల్నీ, వాటితో ఆయా ఘట్టాలకున్న అనుబంధాలనూ క్విజ్ రూపంలో అందిస్తే "తెలుగుదనం" పాఠకులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తూ వాటిని ఈ క్రింద ఇవ్వడం జరిగింది. మీకీ విధానం ఘట్టాలనూ, పాత్రలనూ సులువుగా పరిచయం చేస్తుందని భావిస్తూ...

భారతం అనే పేరు ఎందుకు వచ్చింది?
విషయ భారము, వేద వివరణ భారముగలది గావున మహాభారతం అన్నారు.

మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?
క్రీ.పూ. 16వ శతాబ్దం.

మహాభారతం పురాణమా? ఇతిహాసమా? లేక కావ్యమా?
ఇతిహాసము.

ఇతిహాసము అంటే?
ఇతి + హ = ఇతిహాసం. అంటే ఈ విధంగా జరిగింది అని అర్ధము. అంటే చరిత్ర..

వేదాలకు, భగవద్గీతకూ తేడా ఏమిటి?
వేదం మంత్ర భాగం. ఉపనిషత్తు అర్ధాన్ని సులభంగా శ్లోక రూపంగా చూపేది భగవద్గీత.

మహాభారతాన్ని రచించిన వ్యాసుని అసలు పేరు?
కృష్ణ ద్వైపాయనుడు.

వ్యాసుని తల్లి తండ్రి పేరు?
సత్యవతి, పరాశరుడు.

కురుక్షేత్రము అనగా?
కురురాజు దున్నిన ప్రాంతము.

భీష్ముడి తండ్రి?
హస్తినాపురాన్ని పరిపాలించే శంతన మహారాజు.

భీష్ముడి తల్లి?
గంగా దేవి.

భీష్ముడి అసలు పేరు?
దేవవ్రతుడు.

పాండురాజు, మాద్రి ఎక్కడ మరణించారు?
శతశృంగగిరిలో మరణించారు.

శల్యుడు ఎవరు?
మాద్రికి అన్న.

పాండవులు ఎక్కడ జన్మించారు?
శతశృంగగిరిలో.

శతశ్రంగగిరి ఎక్కడుంది?
టిబెట్‌లో

గాంధారి తండ్రి పేరు?
సుబలుడు.

కృష్ణుడు అనగా?
కృష్ అంటే సత్. ణ అంటే ఆనందం. కృష్ణ అంటే సదానందము, సచ్చిదానందము అని అర్ధం.

శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను ఏ చెట్టుపై దాచాడు?
పొన్నచెట్టుపై

శ్రీకృష్ణుని శంఖము పేరేమిటి?
పాంచజన్యం.

కంసుడి తండ్రి?
ఉగ్రసేనుడు.

కంసుని మామ ఎవరు?
జరాసంధుడు.

శిశుపాలుడి తల్లి?
సాత్వతి.

"నీవు కోరిన దేవత నుండి కోరిన బిడ్డను కనగలవు" అని కుంతీదేవికి వరమిచ్చిన ఋషి ఎవరు?
దూర్వాసుడు.

పాండవులు నివశిస్తున్న లక్క ఇంటిని తగులబెట్టేందుకు దుర్యోధనుడిచే నియమింపబడ్డ మంత్రి?
పురోచనుడు.

ద్రోణుడి తండ్రి పేరు?
భరద్వాజుడు.

ద్రుపదుడు ఎవరు?
పాంచాల దేశపు రాజు.

ద్రుపదుని బిడ్డలు ఎవరు?
దృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

దృష్టద్యుమ్నుడి గురువు ఎవరు?
ద్రోణుడు.

సుభద్ర ఎవరి కూతురు?
దేవకీ వసుదేవుల కూతురు, శ్రీ కృష్ణుని చెల్లెలు.

అర్జునుడు సుభద్రను పెళ్ళాడిన ప్రదేశం?
ద్వారక.

అర్జునుడు, సుభద్రలకు జన్మించినవాడు?
అభిమన్యుడు.

హస్తినాపురంలో మాయాజూదం జరుగుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు ఎక్కడున్నాడు?
ఆ సమయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని మిత్రుడు సాల్వుడు ద్వారకపై దండెత్తగా అతనితో యుద్ధం చేస్తూ ఉన్నాడు.

శ్రీ కృష్ణుడి కుమారులు?
ప్రద్యుమ్నుడు మరియు సాంబుడు.

శిశుపాలుడి కుమార్తె పేరు?
రేణుమతి.

రేణుమతిని పెండ్లాడినవాడు?
నకులుడు.

అభిమన్యుని భార్య పేరు ఏమిటి?
ఉత్తర.

సహదేవుడి భార్య పేరు?
విజయ.

శకుని కుమారుడి పేరు?
ఉలూకుడు.

అజ్ఞాతవాసంలో విరాటుని కొలువులో పాండవులు ఏయే పేర్లతో ఆశ్రయం పొందారు?
ధర్మరాజు విరాటరాజుకు పుణ్య కథలు చెప్పే కంకుభట్టు పేరుతోనూ, భీముడు వలలుడు అను పేరుతో వంటవానిగానూ, అర్జునుడు నపుంసకునిగా బృహన్నల పేరుతోనూ, నకులుడు దామగ్రంధి పేరుతో అశ్వ శిక్షకుడుగానూ, సహదేవుడు తంత్రీపాలుడు పేరుతో గోసంరక్షకునిగానూ, ద్రౌపది విరాట రాణి అయిన సుధేష్ణ పరిచారికగా సైరంధ్రి పేరుతోనూ చేరతారు.

శకుని మరియు ఉలూకుడు ఎవరి చేతిలో మరణించారు?
సహదేవుడు.

కర్ణుడి కొడుకులను చంపినవాడు.
నకులుడు.

సాత్యకి ఎవరు?
అర్జునుడి శిష్యుడు.

కురుక్షేత్ర యుద్ధం సమయంలో బలరాముడు ఎక్కడున్నాడు?
యుద్ధంలో పాల్గొనడం ఇష్టంలేని బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు.

శిఖండి ఎవరు?
కాశీరాజు కూతురు అంబయే శిఖండి.

పాండవులు-వారు పూరించిన శంఖాలు :
అర్జునుడు - దేవదత్తం
ధర్మరాజు - అనంత విజయం
భీముడు - పౌండ్రం
నకులుడు - సుఘోష
సహదేవుడు - మణిపుష్పక
శ్రీ కృష్ణుడు - పాంచజన్యం

ఉత్తరుడు ఎవరి చేతిలో మరణించాడు?
శల్యుడు.

దుర్యోధనుని కొడుకు లక్ష్మణుని వధించినవాడు?
అభిమన్యుడు.

ద్రోణుడు ఎవరి చేతిలో మరణించాడు?
దృష్టద్యుమ్నుడు.

సైంధవుడు ఎవరు?
ఇతను సింధు చక్రవర్తి వృద్ధాక్షాత్రుడి పుత్రుడు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించడంతో అతనికి రక్షగ తోడు వెళ్ళబోయిన ధర్మరాజు వంటి పాండవ యోధులను లోనికి రాకుండా నిరోధించిన వాడు.

వికర్ణుడు ఎవరు?
కర్ణుడి కుమారుడు.

వికర్ణుడిని సంహరించినవాడు?
భీముడు.

శల్యుని సంహరించినవాడు?
ధర్మరాజు.

దుర్యోధనుడు యుద్ధరంగము నుండి పారిపోయి దాగిన మడుగు?
ద్వైపాయన మడుగు.

దృష్టద్యుమ్నుడినీ, శిఖండినీ, ఉపపాండవులను నిద్రిస్తుండగా వధించినవాడు?
అశ్వత్థామ.

Thursday, 17 September 2015

అష్టవిధ అర్చనలు





అష్టవిధ అర్చనలు


దైవాన్ని పూజించేటప్పుడు చేయాల్సిన అర్చనలు లేదా పరిచర్యలు ఎనిమిది రకాలని పెద్దలు చెప్పారు. వీటిని అష్టవిధ అర్చనలు అంటారు.
అవి:

  1. రంగవల్లి (ముగ్గులు తీర్చడం) 
  2. చందనం పూయడం 
  3. అక్షతలు చల్లడం 
  4. పుష్పాలతో అలంకరించడం, అర్చించడం 
  5. ధూపం వేయడం, 
  6. దీపం వెలిగించడం 
  7. నైవేద్యం పెట్టడం 
  8. తాంబూలం సమర్పించడం. 


Monday, 14 September 2015

వేంకటేశ్వరుని బీబీ నాంచార‌మ్మ

ఒక దేవుడిని పూజించేవారంద‌రూ క‌లిసి త‌మ‌ని తాము ఒకే మ‌తంగా భావించుకోవ‌చ్చు. కానీ సాక్షాత్తూ ఆ భ‌గ‌వంతుని కులం ఏది అని అడిగితే ఏమ‌ని చెప్పగ‌లం! ఆద్యంత ర‌హితుడికి కులమ‌తాల‌ను ఆపాదించ‌లేం క‌దా! దానిని నిరూపించే ప్రమాణ‌మే బీబీ నాంచార‌మ్మ! `నాచియార్‌` అనే త‌మిళ ప‌దం నుంచి నాంచార‌మ్మ అన్న పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. అంటే భ‌క్తురాలు అని అర్థమ‌ట‌. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచార‌మ్మ గాథ ఈనాటిది కాదు. క‌నీసం ఏడు వంద‌ల సంవ‌త్సరాల నుంచి ఈమె క‌థ జ‌న‌ప‌దంలో నిలిచి ఉంది. కొన్ని క‌థ‌ల ప్రకారం బీబీ నాంచార‌మ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అస‌లు పేరు సుర‌తాని. స్వత‌హాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మ‌తాన్ని స్వీక‌రించాడు. త‌న రాజ్యాన్ని విస్తరించే బాధ్యత‌ను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ ద‌క్షిణ భార‌త‌దేశం మీద‌కి విరుచుకుప‌డ్డాడు. త‌మ దండ‌యాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అత‌ను శ్రీరంగం చేరుకునేస‌రికి రంగ‌నాథుని ఆల‌యం, భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌తో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది. పంచ‌లోహాల‌తో రూపొందించిన ఆయ‌న ఉత్సవ‌మూర్తిని చూసిన కాఫిర్ క‌ళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాల‌ను క‌రింగిస్తే ఎంత ధ‌నం స‌మ‌కూరుతుందో క‌దా అనుకున్నాడు. అలా త‌న దండ‌యాత్రలో దోచుకున్న వంద‌లాది విగ్రహాల‌లోకి రంగ‌నాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని దిల్లీకి బ‌య‌లుదేరాడు.

దిల్లీకి చేరుకున్న త‌రువాత తాను దోచుకున్న సొత్తుని త‌న కుటుంబం ముంద‌ర గొప్పగా ప్రద‌ర్శించాడు మాలిక్‌. వాట‌న్నింటి మ‌ధ్యా శోభాయ‌మానంగా వెలిగిపోతున్న రంగ‌నాథుని విగ్రహాన్ని చూసిన అత‌ని కూతురు, త‌న‌కు ఆ విగ్రహాన్ని ఇవ్వమ‌ని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం త‌న‌చేతికి అందిందే త‌డ‌వుగా, దాన్ని త‌న తోడుగా భావించ‌సాగింది. విగ్రహానికి అభిషేకం చేయ‌డం, ప‌ట్టు వ‌స్త్రాల‌తో అలంక‌రించడం, ఊయ‌ల ఊప‌డం... అలా త‌న‌కు తెల‌య‌కుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంక‌ర్యాల‌న్నింటినీ ఆ విగ్రహానికి అందించ‌సాగింది. ఆ విగ్రహంతో ఒకో రోజూ గ‌డుస్తున్న కొద్దీ దాని మీదే సుర‌తాని మ‌న‌సు ల‌గ్నం కాసాగింది. మ‌రో ప‌క్క రంగ‌నాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెల‌వెల‌బోయింది. దండ‌యాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంత‌గా బాధ‌ప‌డ్డాయో, రంగ‌నాథుని విగ్రహం కోల్పోయిన భ‌క్తులూ అంతే బాధ‌లో మునిగిపోయారు. చివ‌ర‌కి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్‌నే వేడుకునేందుకు దిల్లీకి ప్రయాణ‌మ‌య్యారు. సాక్షాత్తూ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వ‌హించార‌ని చెబుతారు.

రంగ‌నాథుని ఉత్సవ‌మూర్తిని వెతుక్కుంటూ త‌న ఆస్థానాన్ని చేరుకున్న అర్చకుల‌ను చూసి మాలిక్ కాఫిర్ మ‌న‌సు క‌రిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమ‌తిని అందించాడు. అయితే ఆపాటికే రంగ‌నాథుని మీద మ‌న‌సుప‌డిన సుర‌తాని గురించి విన్న అర్చకులు, ఆమె ఆద‌మ‌రిచి నిదురించే స‌మ‌యంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సుర‌తాని ఉద‌యాన్నే లేచి చూస్తే ఏముంది! త‌న క‌ల‌ల ప్రతిరూపం క‌నుమ‌రుగైంది. ఎవ‌రు ఎంత ఒదార్చినా సుర‌తాని మ‌న‌సు శాంతించ‌లేదు. ఆ విష్ణుమూర్తినే త‌న ప‌తిగా ఎంచుకున్నాన‌ని క‌రాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి ప‌య‌న‌మైంది. శ్రీరంగం చేరుకున్న సుర‌తాని ఆ రంగ‌నాథునిలో ఐక్యమైంద‌ని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడ‌వ‌చ్చు.

మ‌రికొన్ని గాథ‌ల ప్రకారం ఆ విగ్రహం రంగ‌నాథునిది కాదు. మెల్కోటే (క‌ర్నాట‌క‌)లో ఉన్న తిరునారాయ‌ణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆల‌యంలో కూడా బీబీ నాంచార‌మ్మ విగ్రహం క‌నిపిస్తుంది. ఇంకొంద‌రు భూదేవి అవ‌తార‌మే బీబీ నాంచార‌మ్మ అని న‌మ్ముతారు. క‌లియుగ‌దైవ‌మైన వేంక‌టేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవ‌త‌రించింద‌ని భ‌క్తుల విశ్వాసం. అందుక‌నే తిరుప‌తిలోనూ బీబీనాంచార‌మ్మ విగ్రహం కూడా క‌నిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముస‌ల్మాను స్త్రీ అన్న విష‌యంలో మాత్రం ఎలాంటి వివాద‌మూ లేదు. ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే త‌మిళంలో తుర‌ష్క భ‌క్తురాలు అని అర్థం. బీబీ నాంచార‌మ్మను చాలామంది ముస‌ల్మానులు సైతం వేంక‌టేశ్వరునికి స‌తిగా భావిస్తారు. క‌ర్నాట‌కను హైద‌ర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అత‌ను ఓసారి తిరుమ‌ల మీద‌కు దండ‌యాత్రకు వ‌చ్చాడ‌ట‌. అయితే ఆ ఆల‌యం ఒక ముస్లిం ఆడ‌ప‌డుచును సైతం అక్కున చేర్చుకుంద‌న్న విష‌యాన్ని తెలుసుకుని వెనుతిరిగాడ‌ట‌. ఇదీ బీబీ నాంచార‌మ్మ క‌థ ‌!

Sunday, 6 September 2015

మహాభారతంలో యక్ష ప్రశ్నలు

శ్రీ ప్రేమ చంద్ గారికి నమస్కారములు. నూతన సంవత్సర శుభా కాంక్షలు. మీరు అడిగిన వాటికి సమాధానాలు తెలియజేస్తున్నాను. మీ"యక్ష ప్రశ్నలు"తో, నాకు మళ్ళీ మహా భారతాన్ని చదివే అదృష్టాన్ని కలగ జేసినందుకు మీకు ధన్య వాదాలు. నాకు తెలిసి నంత వరకు ఇవే యక్ష ప్రశ్నలు. ఇంకేవిధ మైనవి వున్నట్లు నాకు తెలియదు. ఒక రిద్దరిని అడిగాను. వారూ అలానే చెప్పారు. ఇంకా ఏవైనా విశేషాలు వుంటే తెలుసు కోని తెలియ జేస్తాను.

యక్ష ప్రశ్నలు మహాభారతంలో ఆరణ్యపర్వంలో సప్తమ ఆశ్వాసంలో వస్తాయి. ఇవి 52 ప్రశ్నలు. దీని అనువాదం ఎర్రా ప్రగడ చేశారు. నేను శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి వచన భారతాన్ని ఆధారంగా ఈ వివరాలు అందజేస్తున్నాను.
సందర్భం –అరణ్య వాసం చేస్తున్న పాండవులు ద్వైత వనంలో, సైంధవుని బారి నుంచి ద్రౌపది ని రక్షించుకొని, అక్కడి నుంచి కామ్యకా రణ్యం చేరారు. వారి వద్దకు మార్కండేయ మహర్షి వచ్చి వారికి ఆయన రామాయణ కధా వృత్తాంతాన్ని, సావిత్రీ సత్య వంతుల కధను, కర్ణుని జన్మ వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు. ఆ తర్వాత వారు మళ్ళీ ద్వైత వనానికి చేరు కొన్నారు.
 ద్వైత వనంలో వుండగా ఒక రోజూ ఒక బ్రాహ్మణుడు చాలా ఆదుర్దా పడుతూ వచ్చి, తాను అగ్నిని మధించే"ఆరణి"ని ఒక చెట్టు కొమ్మలో దాచాననీ, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కు కుందనీ, ఆ తర్వాత దుప్పి పారి పొతే దానితో పాటే తన ఆరణి కూడా దాని కొమ్ముల్లో చిక్కు కోవటం వల్ల దానితో పాటే పోయిందనీ, అది ఒక అరణ్యం లోకి ప్రవేశించి తనకు కని పించ కుండా పోయిందనీ, ఆరణి లేక పోతే తాను నిత్యమూ చేసే అగ్ని హోత్రాది కార్యాలను చేయ లేననీ, కనుక తనకు తన ఆరణి ని వెతికి తెచ్చి ఇప్పించాలనీ ప్రార్ధించాడు.
 ధర్మ రాజు తమ్ములతో కలిసి వాడి బాణాలను సంధిస్తూ, బ్రాహ్మణుడు చెప్పిన వైపు దుప్పిని వెదక టానికి బయల్దేరాడు. ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటీ దానికి తగిలిన జాడ కని పించలేదు. అది అదృశ్యమైందని భావించారు. తమ ప్రయత్నం విఫలమైందని బాధ పడుతూ, అలసట చెందటం వల్ల ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించారు. నకులుడు ధర్మ రాజు తో "మీరు ఇంత ధర్మ తత్పరత కల వారు కదా !మన కష్టాలకు కారణం ఏమిటీ “"అని ప్రశ్నించాడు. దానికి ధర్మజుడు నవ్వి"మన పూర్వ జన్మ కర్మలే, మన సుఖ, దుఖాలకు కారణం అని పెద్దలు చెప్పారు"అన్నాడు. భీముడు కల్పించుకొని"ఆ రోజూ పాంచాలిని నిండు కొలువు లోకి ప్రాతి గామి ఈడ్చుకొని వచ్చినప్పుడేకౌరవు లందర్నీ నేను చంపేసి వుండాల్సింది. అలా చేయక పోవటం వల్లే మనకీ కస్టాలు"అన్నాడు. అర్జునుడు భీముని కోపానికి వత్తాసు పలుకుతూ, అహంకారం ఆవహించి "సూత కుమారుడైన కర్ణుడు ఆరోజు పలికిన కారు కూతల్ని విని, పిరికి పంద లాగా నేను ఊరుకో బట్టే ఈ బాధలు, కస్టాలు"అన్నాడు. సహదేవుడు"దుష్ట ద్యూతాన్ని మన తో ఆడించిన మాయావి శకుని ని నేను ఆ రోజే చంపి ఉండక పోవటమే మన కష్టాలకు కారణం"అన్నాడు. అన్నీ విన్న అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మ రాజునకులుని తో"అన్నదమ్ములమైన మనం అందరం బాగా దాహం తో బాధ పడుతున్నాము. దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకొని రా"అని ఆదేశించాడు.
నకులుడు అన్న గారి మాటకు బద్ధుడై,  వట వృక్షంఎక్కి నీళ్ళు ఎక్కడైనా దొరుకు తాయేమో నని పరిశీలించాడు. కొంత దూరంలో ఒక జలాశయం వుందని తెలుసు కోని అన్న గారికి చెప్పాడు. ధర్మ రాజు నకులున్ని అక్కడికి వెళ్లి దాహం తీర్చుకొని, తమకందరికి వెంటనే మంచి నీరు తేవలసిన దిగా ఆజ్ఞా పించాడు.
నకులుడు జలాశయం చేరాడు. అందులోకి దిగి, నీళ్ళు తాగాలని ప్రయత్నం చేశాడు. ఇంతలో ఒక గొంతు విని పించింది. ఆ తటాకం తనది అనీ, తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగానిస్తాను అంది ఆ గొంతు. నకులుడు ఆ మాటలను విన కుండా లోపలి దిగి కొంచెం నీరు తాగాడు. వెంటనే స్పృహ కోల్పోయి నేలపై కూల పడ్డాడు. ఎంత సేపటికీ నకులుడు రాక పోయేసరికి ధర్మజుడు సహ దేవుణ్ణి పంపాడు. అతను వెళ్లి, నకులిది స్థితి గమనించి, నీళ్ళ లోకి దిగాడు. అప్పుడు మళ్ళీ ఒక అశరీర భూతం గొంతు"ఈ తటాకం నాది. నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబులిస్తేనే నీళ్ళు తాగ నిస్తాను"అని విని పించింది. కానీ, అహంకారం, ఆవేశం వున్న సహదేవుడా మాటలను లక్ష్య పెట్ట క లోపలి దిగి, దాహం తాగి మూర్చ పోయాడు. ఆ తర్వాత అర్జున, భీములు కూడా వచ్చి అలానే మూర్చ పోయారు. చివరికి ధర్మ రాజే బయల్దేరి వచ్చాడు.
ఆ కొలను దగ్గర మూర్చపడి వున్న సోదరులను చూశాడు. ఇతరు లేవరు వచ్చిన జాడ లేదని గ్రహించాడు. ఇది దుర్యోధన మాయ ఏమో అనుకొన్నాడు. సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గ లేదు, చేతులు కాళ్ళలో శోభ తగ్గలేదు అని గమనించాడు. దుర్విది తమల్ని ఇంకా వెంటాడు తోందనివిచారించాడు. తాను వీళ్ళను వదిలి వెళ్లి తే తల్లి కుంతీ దేవికి యేమని సమాధానం చెప్పు కోవాలా ని సందేహించాడు. దాహం విప రీతంగా వుంది. కొలను లోకి దిగాడు. అశరీర భూతం ఇదివరకటి లానే హెచ్చరించి, తన ప్రశ్నలుకు సరైన సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తి అంది. అది తన కొలను అని, తాను ఒక కొంగ అని చెప్పాడు. ధర్మ రాజు వినయంతో"మీరెవరో మహా పరాక్రమ వంతు లయి వుండాలి. లేక పోతే కుల పర్వ తాలనే ధీకొనే నా సోదరులు ఇలా మూర్చ పోరు. మీరెవరో మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి"అన్నాడు. దానికి ఆ అదృశ్య గొంతు"ధర్మ రాజా !నేను ఒక యక్షుడను. నా వల్లే నీ సోదరులకు ఈ గతి పట్టింది." అని చెప్పి వెంటనే అక్కడ ప్రత్యక్ష మయాడు. అతను ఆజాను బాహువు. అతని గర్జనకు అడవి లోని ప్ర్ప్రాణులు ఒణికి పోయాయి. .పరమ భయంకరంగా వున్నాడు. కాని ప్రశాంత గంభీర స్వరం తో"యుదిస్టిరా !నా అనుమతి లేకుండా నీ తమ్ములు నీరు తాగి ఇలా అయి పోయారు. నువ్వు వివేక వంతుడివి కనుక దుస్సాహసం చేయ లేదు. నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు. నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి, అప్పుడు నీళ్ళు తాగు"అన్నాడు యక్షుడు. సరే నని ప్రశ్నలు వేయ వలసిందిగా ధర్మ రాజు యక్షుని కోరాడు. ఇప్పుడు ప్రశ్నలు, వాటికి ధర్మ రాజు సమాధానాలు తెలుసు కొందాం
ప్రశ్న పరం పర
01 -సూర్యుడిని నడిపేది ఏది ?అతని ఎవరు అనుసరిస్తున్నారు ?అతడు ఎందుకు అస్తమిస్తాడు ?అతనికి ఆధారం ఏమిటి ?
సమాధానం -సూరుడిని బ్రహ్మ నడి పిస్తాడు. దేవతలు సూర్యుని అనుసరిస్తారు. ధర్మం వల్లనే భాస్కరుడు అస్త మిస్తున్నాడు. అతనికి ఆధారం సత్యమే.
02 –పురుషుడు ఎందుకని శ్రోత్రియుడుఅవుతాడు ? ఎందు వల్ల మహిమ ఎక్కు వవుతుంది ?దేని వల్ల సహాయం లభిస్తోంది. ఎందు వల్ల బుద్ధి మంతుడు అనే పేరు వస్తోంది?
సమాధానం –వేదాధ్యయనం వల్లనే శ్రోత్రియుడు అవుతున్నాడు. మంచి తపస్సు వల్లే మహిమ పెరుగు తుంది. కేవలం ధైర్యం వల్లే మానవుడు సహాయ సంపన్నుడు అవుతున్నాడు. విద్వజ్జనులను సేవించటం వల్లే బుద్ధి మంతు డవుతాడు
03 –బ్రాహ్మణుడికి ఎందు వల్ల దేవత్వం కలుగు తుంది. అతనికి సాధువు, అసాద్ధువు, మానుషత్వము వేటి వల్ల కలుగు తాయి ?
సమాధానం –వేదాధ్యయనం వల్లే బ్రాహ్మణుడు అవుతాడు. ఎక్కువగా వ్రతాచారణం వల్ల సాధుత్వము, వ్రతం చేయక పొతే అసాదుత్వము, శుభ్రత లేక పోవటం వల్ల కలిగే మృత్యు భయం వల్ల మానుషత్వము కలుగు తాయి.
04 –జీవన్మృతుడు అంటే ఎలాంటి వాడు ?
జవాబు –దేవతలను, అతిధులను, సేవకులను కాదని తాను ఒక్కడే భుజించే వాడు జీవన్మృతుడు.
05 –భూమి కంటే బరువుగా వుండి, మహత్తరమైనది ఏది ?ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలికంటే వేగం కలది ఏది? గడ్డి కంటే చివికి జీర్ణ మయేది ఏది ?
జవాబు –తల్లి -భూమి కంటే బరువై మహత్తర మయింది. తండ్రి ఆకాశం కంటే పొడవైన వాడు. గాలి కంటే మనసు వేగ వంత మైనది. గడ్డి కంటే చింత తో ఉన్న మనసు చివికి జీర్ణ మయేది.
06 -నిద్రించినా కన్ను మూయనిది ఏది ?జన్మించినా చైతన్యం లేనిదేది ?రూపం వున్నా, హృదయం లేనిదేమిటి ?వేగం వల్లే కోన సాగేది ఏది ?
జవాబు –చేప నిద్రించినా కన్ను మూయదు. జన్మించినా అండం (గుడ్డు )చైతన్యం లేనిదే. రాతికి రూపం వున్నా హృదయం లేదు.
07 -ప్రయాణించే వారికి, రోగం తో ఉన్న వాడికి, గృహస్తు కు, మరణించిన వాడికి చుట్టాలు ఎవరు ?
జవాబు –ప్రయాణీకుడికి అధ్వరులు మిత్రులు. రోగం ఉన్న వాడికి వైద్యుడు, గృహస్తునికి మంచి భార్య, మరణించిన వాడికి చేసిన ధర్మమూ బంధువులు.
08 –ధర్మానికి కీర్తికి ఏది ఆధారము ?స్వర్గానికి మార్గం ఏది ?సుఖాలకు ఏది ఆధారం ?
జవాబు -ధర్మానికి, దాక్షిణ్యం ఆధారం. కీర్తికి మహిమ ఆశ్రయం. దానం తో కూడిన సత్యం స్వర్గానికి మార్గం. సుఖానికి సౌశీల్యం ఆధారం.
09 –నరునికి ఆత్మ ఎవరు ?అతనికి దైవిక మైన బందువేవరు ?మానవుని మనుగడ దేని వల్ల కొన సాగుతోంది ?మానవుడు ఇతరముల కంటే ఎందు వల్ల అధికుడు ?
జవాబు –కొడుకే మనిషి ఆత్మ. భార్య దైవిక మైన చుట్టం. పర్జన్యుడి (మేఘుడు ) వల్ల మనుష్యుని జీవితం సాగి పోతుంది. వితరణ వల్ల, మనిషి ఇతరుల కంటే అధికుడు
10 –లోకంలో గొప్ప ధర్మం ఏమిటి ?ఎప్పుడూ పరిణతి తో వుండేది ఏది ?ఆనందం పెరగాలంటే దేన్నీ నిగ్రహించుకోవాలి ?ఎవ్వరి తో సంధి చెడి పోదు ?
జవాబు –అహింస అన్ని ధర్మాల కంటే ఉత్తమం. యోగ కర్మ ఎప్పుడు పరిణతి చెంది, మంచి ఫలితం ఇస్తుంది. మనసు లోని అహంకారాన్ని నిర్మూలించుకొంటే, పరమానందం తప్పక కలుగు తుంది. మంచి వారి తో ఏర్పరచుకొన్న స్నేహం ఎప్పుడు చెడి పోదు.
11 -లోకానికిదిక్కు ఏది ?అన్న పానాదులు వేటి వల్ల పుడుతాయి ?ఏది విషం ?శ్రాద్ధ విధికి తగిన సమయం ఏది ?
జవాబు –సత్పురుషులే లోకానికి అంతటికి దిక్కు. ఆకాశము,  భూమి లే అన్న, పానాదులకు ముఖ్య కారణం. బ్రాహ్మణుల డబ్బు విషం. బ్రాహ్మలు వచ్చిన సమయమే శ్రాద్ధ విధికి అనువైన సమయం.
12 -పురుషుడు అంటే ఎవరు ?ఎటు వంటి వాడు ?అందరి కంటే ధన వంతుడు ఎవరు ?
జవాబు –ఎవరి సత్కీర్తి భూమి, స్వర్గ లోకాల్లో నిరాఘాటంగా వ్యాపిస్తుందో అలాంటి వాడే పురుషుడు అని ఆర్యుల అభి ప్రాయం. ప్రియం, అప్రియం, సుఖ దుఖాలు, భూత భవిష్యత్తులు, సమానంగా చూసే మహాత్ముడే అందరి కంటే ధన వంతుడు...
ఈ సమాధానాలు విన్న యక్షుడు "నా ప్రశ్నలన్నిటికీ సరి అయిన సమాధానాలు ఇచ్చావు. నాకు ఆశ్చర్యం కల్గిన్చావు. నీ సోదరులలో ఒక్కరిని బ్రతికిస్తాను. ఎవర్ని జీవిమ్పజేయాలో నువ్వే చెప్పు‘ అన్నాడు యక్షుడు. కొంచెంసేపు మాత్రమే ఆలోచించిన ధర్మరాజు "ఓ సమున్నత బలశాలి! నా సోదరుడు నకులిడిని బ్రతికించు మహానుభావా" అన్నాడు. 
యక్షుడు "భీమార్జునులు అత్యంత ధైర్య సాహస వంతులు వారిని బ్రతికించమని కోర కుండా నకులిని ఎందుకు ఎంచుకోన్నావు ?" అని అడి గాడు. 
దానికి ధర్మ రాజు "యక్షీశ్వారా! మా తండ్రి పాండురాజు గారికి కుంతీ, మాద్రి అనే ఇద్దరు భార్యలు. కుంతీ తనయుల్లో నేను బ్రతికే వున్నాను. మాద్రి తనయుల్లో ఒక్కరైనా జీవించాలి కదా?" అన్నాడు. 
సంతోషించిన యక్షుడు "నీ ధర్మజ్ఞతకు మహాదానందంగా వుంది. నీ సోదరులన్దర్నీ పునరుజ్జీవితుల్ని చేస్తాను."
అని చెప్పి వారందరికీ స్పృహ కల్గించాడు. పరమానంద భారితుడైన ధర్మ తనయుడు" నీవు యక్షుడవు కావు నువ్వు ఏదో దేవతవు. సందేహం లేదు. నీ యదార్ధ స్వరూపం నాకు చూపించు."అని కోరాడు. 
దానికి యక్షుడు "నేను ధర్మ దేవతను. సత్యం, శౌచం, దానం, తపం, శమం, దాంతి, కీర్తి, సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే. నా కుమారుడి వైన నిన్ను చూడాలనే ఉద్దేశంతోనే ఈ కొలను చేరాను. నన్ను ఆశ్రయించిన, వారెవరు దుర్గతి పొందరు . నీ సాదు వర్తనకు సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను. కోరుకో" అన్నాడు. 

ధర్మరాజు అమితానందాన్ని పొంది భక్తితో ధర్మదేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు."ధర్మదేవా! ఆశ్రమ సమీపంలో వున్న ఒక బ్రాహ్మణుడి ఆరణిని జింక అపహరించి పారిపోయింది. దాన్ని ఆయనకు కర్మ లోపం రాకుండా మళ్ళీ ప్రసాదించాలి" అని ప్రార్ధించాడు. 

ధర్మ దేవత చాలా సంతోషించి, ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసు కోవటానికే అలా కల్పిత జింకను సృష్టించానని చెప్పి ఆరణిని అనుగ్రహించాడు. 

ధర్మ దేవత కుమారుడైన ధర్మరాజు పై అపార కృపాకటాక్షాలతో "ధర్మ నందనా! మీ పన్నెండేళ్ళ ఆరణ్యవాసం పూర్తి అయింది. పడమూడవ ఏడు అజ్ఞాతవాసం మీరు చేయాలి. అజ్ఞాతవాస సమయంలో మీరు అందరు ఏ రూపంలో వుండాలి అని అనుకుంటారో, అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరు కొంచెం కూడా గుర్తు పట్ట లేరు. ఇది మీకు వరంగా ఇస్తున్నాను. ఇంకేమైనా కోరిక వుంటే నాకు తెలియ జేయి. నెర వేరుస్తా." అన్నాడు.
విజ్నుడైన ధర్మరాజు "మీ దర్శనంతో ధన్యుణ్ణి అయాను. ఇంకే కోరికా లేదు. నా మనసు క్రోధ, లోభ, మొహాది దుర్గుణాలకు ఎప్పుడు దూరంగా వుండి, సదా ధర్మాచరణతో విలసిల్లేట్లు అనుగ్ర హించు."అని వేడుకొన్నాడు. ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి, ధర్మ దేవత అదృశ్యం అయాడు. భీమార్జుననకులసహదేవులు యధాస్థితికి వచ్చారు. అందరితో కలిసి ధర్మ రాజు మళ్ళీ ఆశ్రమానికి చేరుకొన్నాడు. బ్రాహ్మణుడికి "ఆరణి"ని అందజేసి ఆయన శుభాశీస్సులను పొంది ఆనందంగా సోదరులతో గడిపాడు.