Sunday, 23 September 2018

Places Associated with the Mahabharata

Places Associated with the Mahabharata

Ujjanak - The Archery Lessons were taught here
Located in the district of Nainital, Ujjanak is the place where the children of Kuru clan mastered the art of archery under the guidance of their teacher Dronacharya. The Bhimashankar temple found in this place is one of the Jyotirlingas and it is said that the icon of Lord Shiva was installed by Bhima himself under the instructions of his teacher Guru Drona.

Banganga - Place where Pitamaha quenches his thirst
As the commander in chief of the Kauravas, Sri Bhishmacharya fell on the bed of arrows on the 10th day of the war, Arjuna shoots an arrow straight into the ground from where Ganga sprang up helping Partha to quench the thirst of his great grand father. BanGanga is a sacred place and it is located at a distance of 3KM from Kurukshetra.

Kurukshetra - The final War - Mahabharata
Located in the city of Ambala of Haryana state, this is the place where the epic war Mahabharata was fought for 18 continuous days leaving everyone stunned. This place speaks about the heroes who sacrificed their lives for the sake of Dharma. It is said that Brahma had once performed a ritual here and hence there is a pond called Brahma Sarovar, devotees flock in to this pond to take a holy dip during Solar eclipse.

Hastinapur - The Glorious Capital City!
Hastinapur, located in the city of Meerut in the state of Uttar Pradesh was the capital city of the Kuru clan. A place that has celebrated the glorious times and also has mourned for the misdeeds, a place that again became the grand capital of the Pandavas once the Mahabharata war got over. Hastinapur has been one of the major pilgrim sites in India.

Varnavat - The concept of wax architecture
Well, we get to see a lot of wax museums these days; but isn't it amazing to know that this concept was used long back, yep! Lakshagraha Varnavat is a place located in Handia of Allahabad in the state of Uttar Pradesh. This is the place where the wax house for Pandavas was built by Duryodhana. This place is visited by a lot of travellers and tourists. You would get to see the statue of Kunti in this place during your visit.

Panchal - The place of the beautiful Draupadi
She was born to divide the two families, she was born to keep the unity of the five Pandava brothers intact, she was born as a youth and emerged from fire. Draupadi, daughter of the king of Drupada of Panchala kingdom. Panchala is situated between the River Chamba and Himalayas in the state of Uttar Pradesh.

Indraprastha - The capital city of Pandavas
This place is located in New Delhi, the capital city today was also a capital city of the Pandavas then. It is said that the Khandavprasta (forest) was destroyed by Pandavas on which the Indraprastha stood in pride. It is said that the land of Indraprastha then is where the majestic Purana Qila stands today.

Vrindavan - The place of the KING-MAKER - Lord Krishna
Located at a distance on 10km from Mathura in the state Uttar Pradesh is the beautiful Vrindavan. This is the place where Krishna spent most of his childhood days playing with the beautiful girls (Gopis). This place is a major pilgrim site now and it has some of the beautiful temples dedicated to Krishna and Radha.

Gokul - Where the little Krishna grew up!
At a distance of 15km from Mathura is the amazing place of Gokul. This is the place which is said to have protected Krishna from the evil clutches of his maternal Uncle Kans. There is a temple in Gokul and you may also visit the Prem Mandir in Vrindavan.

Barsana - Place of the unconditional lover - Radha
Barsana is situated in the city of Mathura. Legends say that Lord Krishna, disguised as a peacock; danced here to win the heart of his eternal lover Radha. There is a shrine dedicated to Radha Krishna with the name Radha rani Shriji temple and a lot of devotees flock to this temple during the Lathmor celebrations.

Angadesh - Province ruled by the unsung hero - Karna
Angadesh, also known as the Malini Nagari in the Gonda district of Uttar Pradesh was ruled by Karna as throned by his friend Duryodhana. This place is one of the Shakti Peethas as Sati's right hand had fallen here and a temple, Khaira Bhawani is dedicated to Goddess Parvati and has been one of the famous pilgrim places of India.

Vyasa Gufa or Vyasa Cave
Vyasa Gufa or Vyasa Cave is an ancient cave located on the banks of Saraswati river at Mana village in the Chamoli district of Utterakhand.  Mana is the last Indian village located at the Indo- Tibet border. It is believed that Vyasa composed Mahabharat here with the help of Lord Ganesha. There is a Vyasa statue here. The serration of the rock looks like pages of a book. Ganesha cave is also nearby. Mana is also the place through which Pandavas walked to Swargarohini.

Vyasa Cave is at Mana Village 5.5km from the Badarinath Temple. Nearest Railway station is Haridwar, 336km away.

Suryakund
Suryakund, on top of the Milam glacier is a hot water spring where Kunti gave birth to her first son Karna, fathered by Surya Dev.
Nearest airport is Jolly Grant Airport in Dehradun 114km away. Nearest train station is Harrawala. Buses are also available from Rishikesh Railway station. From there go to Gangotri. Surya Kund is 500m ahead of Gangotri temple.

Pandukeshwar
The Village of Pandukeshwar is situated in the Chamoli District of Uttaranchal. The village is around 20 km from Joshimath and 25 km from Badrinath. It is believed that King Pandu, father of Pandavas performed penance here to atone the curse befallen him after killing two mating deer which were actually a sage and his wife. It is believed that Pancha Pandavas were born here and Pandu died and attained salvation here. Pandu is believed to have installed the bronze image of Vishnu in the Yogadhyan Badri shrine. Nearest airport is Jolly Grant Airport in Dehradun and Railway station is Rishikesh. The temple is 18km from Badrinath and 23km from Joshimath.  Both these places are 290km from Jolly Grant airport and 274km from Rishikesh.

Drona Sagar Lake
Drona Sagar Lake situated in Kashipur in the state of Uttarakhand is believed to have been created by Pandavas for their Guru Dronacharya as Gurudakshina. Water of Drona Sagar is believed to have as holy as the water of Ganga. Nearest Railway station is Kashipur and the nearest airport is Pantnagar around 65km away.

Pandava Tala at Ekachakra
This is where Pandavas lived during their exile with Kunti Devi. This place surrounded by a few Keli Kadamba trees. It is here the Pandavas killed Bakasura to save the villagers. Ekachakra is located at Rampurhat in the Birbhum District of West Bengal.

Pandavapura
It is believed that Pandavas stayed here for a short time during their exile. Kunthibetta hills is an attraction here named after Kunti, mother of Pandavas. Pandavapura is located at the Mandya District in Karnataka. Pandavapura is approximately 130 km from Bangalore and 25 km from Mysore.

Karna Lake
It is believed that Karna used to take bath in this lake. It was here Karna gave away his protective armour to Indra, the King of the Gods.  Karna lake is located equi-distance from Chandigarh and Delhi, around 125km away.

Kurukshetra
Kurukshetra was named after the ancestor of Pandavas, King Kuru. The significance of the place is that Kurukshetra war was fought here and Bhagavat Gita was preached here by Lord Krishna to Arjuna. Kurukshetra is 83km from Chandigarh airport.  You can alight at Kurukshetra Junction station by train.

Jyotisar
Jyotisar is a town on the Kurukshetra-Pehowa road at Kurukshetra district of Haryana. This is where Krishna preached Bhagavat Gita to Arjuna. The Banyan Tree under which Bhagavat Gita was preached still stands.  A marble chariot, with Krishna and Arjuna marks the place where Bhagavat Gita was preached.

Sthaneshwar Mahadev Temple
Sthaneshwar Mahadev Temple located at Kurukshetra district is where Pandavas along with Krishna prayed to Lord Shiva and received his blessings for victory in the battle of Mahabharata. No pilgrimage of Kurukshetra is believed to be complete without a visit to this ancient, holy temple.

Bhishma Kund at Narkatari
This is where Bhishma Pitamaha lay watching the Kurukshetra war on the bed of arrows created by Arjuna. Now there is a Bhishma Pita maha temple here and a water tank called Banganga or Bhishma Kund. The legend says, Bhishma felt thirsty and asked for water and Arjun immediately shot an arrow into the ground and let loose a stream of gushing water.

Amin Fort
Amin is located 12km from Kurukshetra city. It is also known as Abhimanyu Kshetra. The fort here is completely ruined and only remains exist. There is a mount here, which is the site of Chakravyuha where Abhimanyu was killed by Jayandratha.

Indraprasta
Indraprastha was the capital of Padava’s Kingdom located in the region of present-day New Delhi.

Astipura
The site lies west of Tanesar and south Auja Ghat which marks the place where bodies of those slain in Mahabharata war was cremated. An excavation in the area found painted greyware and pottery used during the Mahabharata era. There are no marked areas to denote the location as the exact location is still debatable.

Bhadrakali temple Kurukshetra
It is believed that Pandavas along with Sri Krishna prayed at this Bhadrakali temple for divine blessings before the Mahabharata war. After the victory, they donated horses to the temple and that tradition is still prevalent here devotees offering terracotta horses to the temple.

Hastinapur
Hastinapur is located at the Meerut district in Uttar Pradesh. Hastinapur was the capital of Kuru Kingdom. Delhi airport is 120km from Hastinapur. Meerut City Station is the nearest railway station 44km away.

Lakshagriha – House of Lac
The site of the ‘Lakshagriha’, the house of lac which was built by was built by Purochana a minister of Duryodhana to kill the Pandavas. The house was later burned to ground by Kauravas hoping that Pandavas will perish in the fire. But the brothers escaped through the tunnel. The site is located in Barnawa area of Baghpat district. The structure was located in what is now Baghpat, at the site called Barnawa. In fact, Barnawa is the twisted name of Varnavrat, one of the five villages that the Pandavas had demanded from the Kauravas to settle in after their exile.”  Baghpat is located in western Uttar Pradesh, on the east bank of the Yamuna River. It is 40 kilometres’ northeast of Delhi and 52 kilometres west of Meerut, on the main Delhi–Sharanpur highway.

Panch Kedar
After the Mahabharata war, the Pandavas wanted to wash off the sins of their fratricide. They sought the blessings of Lord Shiva to pardon them and bless them to attain salvation. But Shiva avoided them by assuming the animal form of a bull and left for the Himalayan Garhwal region. After sighting Siva at the hills of  Guptakashi, Pandavas tried to  hold the bull by its tail. But the bull disappeared and reappeared later at five places; in the form of a hump at Kedarnath, in the shape of bahu (arms) at Tungnath, with his face at Rudranath, his nabhi (navel) and stomach at Madhyamaheswar and his hair (locks) called jata at Kalpeshwar. Pandavas have established Shiva temples in all these five places.

Kedarnath
Nearest airport is Jolly Grant Airport situated 240km away. It is connected to Gaurikund through buses and taxis. From Gaurikund, it is a 14 Km trek to Kedaranath.   Rishikesh is the nearest railway station around 200km from Gaurikund.

Tungnath
This is the highest Shiva temple in the world located in the mountain range of Tunganath in Rudraprayag district, in Uttarakhand.
Jolly Grant in Dehradun is the nearest Airport about 260 km away. Taxi and buses are available from Dehradun to Chopta. From Chopta it is only 3.5km by trecking. Haridwar is the nearest railway station 225km away from Chopta.

Rudranath
Rudranath is the third temple to be visited in the Panch Kedar pilgrimage circuit, after Kedarnath and Tungnath. Madhyamaheshwar  and Kalpeshwar to be visited after Rudranat. The nearest airport is Jolly Grant, Dehradun (258 km). The nearest railway station is Rishikesh (241 km). Most trekking routes to Rudranath are from Gopeshwar or nearby places. A motorable road is present up to the village Sagar — 5 km from Gopeshwar, beyond which a 20 km trek has to be undergone to reach Rudranath.

Madhyamaheshwar
Nearest airport is Jolly Granth Airport in Dehradun around 200km away. The nearest railway station is Rishikesh which is 180km from Guptkashi and buses are available from there to the temple.

Kalpeswar Temple
his is the only Panch Kedar accessible throughout the year. Kalpeshwar is 255km away from Rishikesh via Rishikesh-Badrinath road. The temple is a 2km treck from Ugram.

Pancha Pandava Temples of Kerala
After Crowning Parikshit as the King of Hastinapura, Pandavas left for a pilgrimage and visited Kerala. In Kerala each of the Pandavas installed idols of Lord Vishnu on the banks of Pampa and nearby areas. These temples are

Thrichittatt Maha Vishnu Temple – Yudhishitra
It is located in Chengannur, Alappuzha District, Kerala. This temple is believed have been built by Yudhishtira. During the war, Yudhishtira lied to kill Dronacharya. To overcome the sin, he took penance worshipping Lord Vishnu here. Imayavar(Devas) came to this place prior to Yudhishtira hence the deity here is referred as Imayavarappar. The nearest railway station to the temple is located in Chengannur, and the nearest airport is Trivandrum International Airport.

Thirupuliyur Mahavishnu Temple
This temple is located in Puliyoor, Alappuzha District, Kerala. Puliyur temple is believed to have built by Bhima.

Aranmula Parthasarathy Temple
This temple is located at Aranmula, a village in Pathanamthitta District, Kerala. This temple was built by Arjuna. Parthasarathy is another name for Krishna which means Arjuna’s Charioteer. It believed that  Arjuna built this temple, to expiate for the sin of killing unarmed Karna which was against Yudha dharma.

Thiruvanvandoor Mahavishnu Temple
This temple is located at Thiruvanvandoor, Alappuzha District, Kerala. Here Maha Vishnu is worshipped as  Paambanaiappan. The deity got this name because of the nearby Pampa river. This temple is believed to have built by Nakula.

Thrikodithanam Mahavishnu Temple
This temple is located at Thrikkodithanam, Kottayam District, Kerala. Here Lord Vishnu is worshipped as Athpudha Narayanan. This temple was built by Sahadeva. The nearest railway station to the temple is located in Changanassery, while the nearest airport is Cochin International Airport.

Swargarohini
Swargarohini is a mountain massif in the Bandarpunch Range in the Uttarkashi district of Uttarakhand.  This is the path Pandavas choose to go to heaven but only Yudhishtira and the dog reached heaven. It is also believed that this is the only way one can go to heaven without leaving the human body.

Wednesday, 19 September 2018

శ్రీ మహాభారతం






మహాభారతానికి వస్తే, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహాల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది.  కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు  ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’నని బంధువుల మధ్య ప్రకటించేశాడు. గాంధారి ఆ మాట వింది. తండ్రి అలా మాట ఇచ్చిన క్షణం నుంచే ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేశాడు. గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.

నిజానికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క గాంధారిని మాత్రమే పెళ్లిచేసుకోలేదు. ఆమెతోపాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని పెళ్లాడాడు. మహాభారతం వాళ్ళ పేర్లను కూడా ఇచ్చింది. అంతేకాదు, కులం, రూపం, శీలం కలిగిన మరో వందమందిని తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. ఆ లెక్కన ధృతరాష్ట్రుని భార్యలు నూటపదకొండుగురు అవుతారు. అప్పుడు అతనికి వందమంది కొడుకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారందరినీ  గాంధారి సంతానంగానే చెబుతారు.  గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, మహాభారతంలో కొన్ని వివరాలు ప్రచారంలో లేవు. అలాగే, అనేక సందేహాలకు అందులో తగిన సమాధానం ఉండదు. నూటొక్క మందిని గాంధారి సంతానంగా చెప్పడం అలాంటిదే. గాంధారి చెల్లెళ్ళకు, ఇతర భార్యలకు కలిగిన సంతానాన్ని కూడా పట్టమహిషి అయిన గాంధారికే ఆపాదించి ఉండచ్చు. నూటొక్కరు (కూతురు దుశ్శలతో కలిపి) కౌరవులలో పదిహేడుమందే గాంధారికి పుట్టినవారని ఎస్.ఎల్. భైరప్ప తన ‘పర్వ’ నవలలో అంటారు. అయితే, చిక్కుముడులుగా కనిపించే ఈ సంతానం లెక్క లన్నింటికీ శాస్త్రపరమైన ఇతర వివరణలు లేకపోలేదు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

సుబలుడు ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననడం, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డనడంలా ధ్వనిస్తుంది. మహాభారత కాలం నుంచీ నేటి వరకూ అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామ్యం పదునును ఈ రెండు వాక్యాలూ పట్టి చూపుతాయి. ముక్కుపచ్చలారని తన కూతురును ముసలివాడికిచ్చి పెళ్లి చేసే అఘాయిత్యాన్ని సహించలేక అగ్నిహోత్రావధాన్లు భార్య ప్రతిఘటించడం భోజనాల దగ్గర పెద్ద సీను సృష్టిస్తుంది. మరి సుబలుని నిర్ణయాన్ని అతని భార్యా, పిల్లలు వాస్తవంగా ఎలా తీసుకున్నారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఉదాహరణగా ఈ ఘట్టాన్ని పితృస్వామ్య కోణం నుంచి వ్యాఖ్యానించారు.  ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననగానే బంధువులు మారు మాట్లాడక పోగా, కళ్ళు లేకపోతేనేం గుణవంతుడు కాడా ఏమిటని సరిపెట్టుకోవడం; తండ్రి ఆ మాట అన్న క్షణం నుంచీ గాంధారి ధృతరాష్ట్రునే తన భర్తగా భావించి నేత్రపట్టం కట్టుకోవడం -బంధువర్గంలోనూ కుటుంబసభ్యుల్లోనూ సుబలుని మాటకు గల  తిరుగులేని లక్షణాన్ని, గాంధారి పాతివ్రత్యాన్ని సూచిస్తాయని విశ్వనాథవారు అంటారు.  ఇరావతీ కార్వే తన ‘యుగాంత’లో స్త్రీ కోణం నుంచి ఈ ఘట్టాన్ని చూస్తూ గాంధారి నేత్రపట్టం కట్టుకోవడం తండ్రి నిర్ణయంపట్ల నిరసన సూచకంగా అనుమానిస్తారు. కాలంతోపాటు కలిగే దృష్టిభేదం ప్రతి కాలంలోనూ పురాగాథల్ని సరికొత్తగా వ్యాఖ్యానించుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా ఆ కథలు నిత్యనవీనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటాయి.

అంధత్వాన్నే కాదు, ఏ వైకల్యాన్ని అయినా వేలెత్తి చూపించడం ఇప్పుడు కుసంస్కారం అవుతుందని మనకు తెలుసు. అదలా ఉంచి, ధృతరాష్ట్రునిపై సానుభూతినుంచి కలిగిన ప్రేమతోనే గాంధారి అతనిని భర్తగా అంగీకరించీ ఉండచ్చు.  నిజంగా ఆమె ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు.

చెప్పుకుంటూ వెడితే ఈ ఘట్టంలోని విశేషాలకు అంతే ఉండదు. ధృతరాష్ట్రునికి వధువుకోసం గాంధారం దాకా వెళ్ళారంటే, సమీపంలో సుక్షత్రియకన్య దొరకలేదనుకోవాలి.  గాంధారి రూపలావణ్య శీలాల గురించి భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా వినడం ఇంకో విశేషం. బ్రాహ్మణుల ద్వారానే ఎందుకంటే, వాళ్లే ఆనాడు క్షత్రియ కుటుంబాలకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగానూ, వార్తాహరులుగానూ ఉన్నారు. అంటే, నాలుగు గోడల మధ్య ఆభిజాత్యాన్ని కాపాడుకునే క్షత్రియులకు బహిరంగ అభివ్యక్తి లేదా బయటి ప్రపంచాన్ని చూపించే కిటికీ బ్రాహ్మణులే. అది మళ్ళీ బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత గురించిన చర్చలోకి తీసుకువెడుతుంది. దానినలా ఉంచితే, ఎక్కడికైనా యధేచ్చగా వెళ్లగలిగే అవకాశమూ, బహుశా అధికారమూ ఆనాడు బ్రాహ్మణులకే ఉండి ఉండాలి. అది మళ్ళీ నాటి సామాజికమైన అమరికవైపూ, గణసమాజపు తీరు తెన్నులవైపు మనల్ని మళ్లిస్తుంది. అలాగే, ధృతరాష్ట్రుడే గాంధారదేశం వచ్చి గాంధారిని పెళ్లాడకుండా, గాంధారే అతని దగ్గరకు తరలి వెళ్లడమూ విశేషమే.

అంతకు మించి గమనించవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది కుంతి- పాండురాజుల వివాహం. ధృతరాష్ట్రునికి వధువు కోసం గాంధారదేశం దాకా వెళ్లవలసివచ్చింది కానీ, పాండురాజుకు వధువు దగ్గరలోనే, యాదవుల ఇంట దొరికింది. ఆ వధువు కూడా అప్పటికే కొడుకును కన్నది. అన్నదమ్ములే అయినా రాజ్యాధికారం ఉన్న వ్యక్తికీ, లేని వ్యక్తికీ వధువును ఎంపిక చేయడంలో ఉండే తరతమ భేదాలకు ఇది సూచన కావచ్చు. అయితే, ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రదేశపు రాచకన్య మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు.  మొదటి పెళ్లికీ, ఈ పెళ్లికీ మధ్య ఏం జరిగిందో తెలియదు. కుంతికి సంతానం కలగకపోవడం ఒక కారణంగా కనిపిస్తుంది. లోపం పాండురాజులోనే ఉన్నా దానిని కప్పి పుచ్చడానికి  మాద్రిని ఇచ్చి చేశారని ఎస్.ఎల్. భైరప్ప ఊహిస్తారు. కుంతి చరిత్ర యాదవ-క్షత్రియుల మధ్య నున్న సామాజిక అంతరాన్ని సూచిస్తోందనుకుంటే, అదే కురు-పాండవ శత్రుత్వానికీ అంతిమంగా యుద్ధానికీ దారితీయించిందా అన్నది అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న.

కిందటి వ్యాసం ఆగిపోయిన చోటికి మళ్ళీ వెడదాం.  మధ్య ఆసియాలో ఉన్న నేటి అప్ఘానిస్తానే నాటి గాంధారదేశం. అంటే ధృతరాష్ట్రునికి వధువును మధ్య ఆసియా నుంచి తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, మాద్రి కూడా అక్కడిదే. మద్రదేశం గాంధారదేశాన్ని ఆనుకునే ఉంటుంది. అది మళ్ళీ ఉత్తర మద్ర, తూర్పు మద్ర అనే రెండు జనపదాలుగా ఉండేది.  ఉత్తరమద్రను ఉత్తర కురుభూములని, బాహ్లిక దేశమని కూడా అనేవారు. గ్రీకులు దానినే బాక్ట్రియా అన్నారు. పురాణ, ఇతిహాస కాలం నాటి భౌగోళిక రేఖా పటాన్ని గీస్తే అది అప్ఘానిస్తాన్ నుంచి  ఉత్తరభారతం వరకూ ఒకే నడవగా ఉన్నట్టు చూపిస్తుందని చెప్పుకున్నాం. అంటే,  మధ్య ఆసియా, భారత ఉపఖండ జనపదాల మధ్య బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు, యుద్ధాలలో పరస్పర సహకారం ఉండేవన్నమాట.

క్షత్రియ వధువుల కోసం గాంధార, మద్రదేశాలవరకూ వెడితే వెళ్లచ్చు కానీ, నిజానికి మద్ర (లేదా బాహ్లిక) జనాలకు మంచి పేరు లేదు. ఆ విషయం కూడా మహాభారతమే చెబుతోంది.


కర్ణుడు అంగరాజు. అంగరాజ్యం నేటి బీహార్ తూర్పున కొంతభాగం. చంపానగరం దాని రాజధాని. నేటి భాగల్పూర్ ను అంగరాజ్యంలోదిగా గుర్తించారు. ఇక శల్యుడు మద్రదేశీయుడు, క్షత్రియుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి సోదరుడు. గమనించే ఉంటారు, పైన ఉటంకించిన సంభాషణలోని కులనింద, ప్రాంత నిందల ఘాటు నసాళానికి అంటేలా ఉంది. అందులోనూ కర్ణుని మాటలు మరింత పరుషంగా ఉన్నాయి. అయితే, వాస్తవంగా నింద ప్రారంభించింది శల్యుడు. అతని మాటలు ఇంకా పరుషంగా ఉంటాయి. అంటే, కర్ణుని నింద ప్రతినింద మాత్రమే.

కర్ణుడు యుద్ధానికి బయలుదేరగానే శల్యుడు నిందకు తెరదీశాడు. కర్ణుని కులాన్ని ఎత్తి చూపి మాటి మాటికీ ‘సూతపుత్రుడి’గా అతనిని సంబోధిస్తూ తూలనాడాడు. అర్జునుడి పరాక్రమాన్ని అదేపనిగా ఆకాశానికి ఎత్తి ఈసడింపు మాటలతో కర్ణుని కుళ్లబొడిచాడు. ఎంగిళ్లు తిని కొవ్వెక్కిన కాకితో అతనిని పోల్చుతూ కాకి-హంస కథ చెప్పాడు.  ఉబికి వచ్చే కోపాన్ని కర్ణుడు మొదట్లో బలవంతాన అణచుకున్నాడు కానీ,  శల్యుడు ఎంతకీ తగ్గకపోవడంతో తనూ నోరు చేసుకున్నాడు. శల్యుడు కులం రీత్యా ఉన్నతస్థానంలో ఉండగా, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నతస్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ఎత్తి కించపరిస్తే; శల్యుని క్షత్రియాధమునిగా కర్ణుడు సంబోధిస్తూ అతని ప్రాంతాన్ని ఎత్తి కించపరిచాడు.

కులదర్పం ఇంతగా కరడుగట్టిన శల్యుడు కర్ణునికి రథసారథి కావడానికి అసలెందుకు ఒప్పుకున్నాడు? అదెలా జరిగిందంటే, శల్యుని తనకు సారథిని చేయమని కర్ణుడే దుర్యోధనుని అడిగాడు. అది కూడా శల్యుని పట్ల ప్రశంసా భావనతోనే. కృష్ణుని సారథ్యంలో అర్జునుడు మరింత అజేయుడవుతున్నాడు కనుక, అశ్వజ్ఞానంలో కృష్ణునికి సాటి వచ్చే శల్యుని నాకు సారథిని చేస్తే అర్జునుని అవలీలగా గెలుస్తానన్నాడు. దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని శల్యుని దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనేకవిధాలుగా ఉబ్బేసి కర్ణునికి రథసారథ్యం చేయమని కోరాడు.

ఆ కోరిక శల్యునిపై ఎంత పిడుగుపాటు అయిందో తిక్కన అద్భుతంగా చిత్రిస్తాడు.  అప్పుడు శల్యుని కళ్ళు కోపంతో జేవురించాయి. నుదుట చెమటలు పట్టేశాయి. ఇంత నీచమైన పనికి నన్నెలా నియోగిస్తావు, నీకు వర్ణధర్మాలు తెలియవా, మూర్ధాభిషిక్తులైన రాజులు ఎన్నడైనా శూద్రులకు పరిచర్యలు చేశారా అని దుర్యోధనుని నిలదీశాడు. సూతపుత్రుడైన కర్ణుని దొరగా చేసుకుని నన్ను సారథ్యం ఎలా జరపమంటావు, అదీగాక కర్ణుడు నాకన్నా బలవంతుడా అని ప్రశ్నించాడు. తెలియక నువ్విలా కోరి ఉంటావు, ఒకవేళ తెలిసీ కర్ణుని మీద పక్షపాతంతో నన్నిలా అవమానించదలచుకుంటే ఇప్పుడే మా దేశానికి వెళ్లిపోతానంటూ రాజుల మధ్యలోంచి చివాలున లేచి బయటకు నడిచాడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని ఆపి బుజ్జగించాడు. ఒక్క కర్ణుడే దేనికి, నిన్ను మించిన వీరులు ఎక్కడా లేరు; అశ్వహృదయం తెలియడంలో కృష్ణుని కన్నా కూడా నువ్వు ఎక్కువ కనుకే ఈ కోరిక కోరానన్నాడు. ఆ మాటతో శల్యుడు చల్లబడ్డాడు. ఇంతమంది రాజుల మధ్య నన్ను కృష్ణుడికంటే ఎక్కువన్నావు కనుక ఒప్పుకుంటున్నాను; అయితే ఒక షరతు, నేను కర్ణునితో విచ్చలవిడిగా, తోచినట్లు మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు అన్నాడు.

శల్యుడు చెప్పిన కాకి-హంస కథ వేరే కారణంతో అపురూపంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. ఆ కథ ఇదీ:

సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు పురంలో ఒక సంపన్న వైశ్యుడు ఉండేవాడు. అతనింట్లోకి ఓ రోజు ఓ కాకి ప్రవేశించింది. ఆ వైశ్యుని కొడుకులు ఎంగిళ్ళు తినిపించి దానిని పోషిస్తూ వచ్చారు. దాంతో దానికి  కొవ్వెక్కింది. ఎలాంటి పక్షి అయినా తనకు సాటి రాదన్న అహంకారం పెరిగిపోయింది.  అంతలో ఒకనాడు కొన్ని హంసలు ఆ సమీపంలో కనిపించాయి.  ‘తారతమ్యం తెలియని’ ఆ వైశ్యపుత్రులు వాటిని కాకికి చూపించి, పక్షులలో నీ అంతవారు లేరు కనుక ఆ హంసలతో పోటీ పడి ఎగిరి వాటిని ఓడించు అన్నారు. అప్పుడు కాకి వాటి దగ్గరకు వెళ్ళి, ఓ హంసను గుర్తించి, తనతో సమానంగా ఎగరమని సవాలు చేసింది.  అప్పుడా హంసలన్నీ నవ్వుతూ, మేము మానససరోవరం దగ్గర ఉండేవాళ్లం, మా బలాన్ని వేగాన్ని అన్ని పక్షులూ పొగడుతాయి. మేము ఎక్కడికైనా, ఎంతదూరమైనా వెళ్లగలం, మాకు ఎలాంటి అలసటా రాదు, హంసలను పోటీకి రమ్మని కవ్వించిన కాకిని మేమింతవరకూ చూడలేదు, పైగా మా అందరిలోనూ బలశాలినే ఎంచుకున్నావు, అన్నాయి.

అప్పుడా హంసతో  కాకి, నూటొక్క గతుల్లో నేను ఎగరగలను, ఒక్కొక్క గతిలో వందయోజనాలు వెళ్లగలనంటూ తను చేయగల విన్యాసాలను వర్ణించింది. దానికా హంస, నాకా మార్గాలన్నీ తెలియవు, పక్షులన్నీ ఎగిరే ఒక్క మార్గమే తెలుసు, ఎగురుదాం పద, అంది. రెండూ సముద్రం మీద ఎగరడం ప్రారంభించాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో తన విన్యాసాలను మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.

కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. మనసులో అలజడి మొదలైంది. కాలు మోపడానికి ఎక్కడా ఓ చెట్టూ, పుట్టా లేవే అనుకుని కలవరపడింది.  దైన్యం ఆవహించింది. ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకుంది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి అని పరిహాసమాడింది.  చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి నీతో పోటీపడ్డాను, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి ఆ హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది.

సరే, శల్యుడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం కర్ణుని ఎంగిలి కూడు తినే కాకి తోనూ, అర్జునుని హంసతోనూ పోల్చడమని తెలిసిపోతూనే ఉంది.

స్థూలంగా చెప్పుకుంటే; మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

వ్యాస, భీష్మ, ద్రోణులలో కులధర్మం గురించిన పట్టింపు ఎక్కువగా కనిపిస్తుంది. తరాల మధ్య అంతరం కూడా  అందుకు  కారణం కావచ్చు. నువ్విక వానప్రస్థానికి వెడితే మంచిదని ధృతరాష్ట్రునికి వ్యాసుడు సలహా ఇస్తూ, ‘రాజులు యుద్ధంలోనైనా చావాలి, దృఢ సమాధితోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప, వృద్ధులై రోగంతో మంచం పట్టి చావడం మేలా, ఓ భరతముఖ్యా?’ అంటాడు. ‘భరతముఖ్యా’ అనడంలో ఉద్దేశం, భరతులు ఆయుధోపజీవులు సుమా అని గుర్తుచేయడమే.  భీష్ముడు కూడా అర్జునుడిలానే ఒక దశలో హింస-అహింసల మధ్య సందిగ్ధతను ఎదుర్కొన్నట్టు కనిపిస్తాడు. అయితే, ఇద్దరి సందిగ్ధతా ఒకలాంటివి కావు. భీష్ముడు  హింసపట్ల విసుగు ప్రకటిస్తూనే, రాజుల హింసను కులధర్మంగా నొక్కి చెబుతాడు. ‘పది రోజుల్లో ఉత్తమ క్షత్రియుల నెందరినో వాడి బాణాలతో చంపేశాను. విసుగుపుట్టింది. ఇక ఈ శరీరం విడిచి పెట్టడం మంచి’దని అనుకుంటాడు. ‘పుట్టినప్పటి నుంచీ క్రౌర్యంతో రాజులను చంపడంలోనే నా కాలం గడచిపోయింది, విసుగుపుట్టింది, ఇక నేనీ రాక్షస కృత్యం చేయలే’నని ధర్మరాజుతో అంటాడు. అర్జునుడిలో హింసా వైముఖ్యం వ్యవస్థాగతమైనదైతే, భీష్ముడి వైముఖ్యం వ్యక్తిగతం.  భీష్ముని మాటల్లో హింస పట్ల విచారాన్ని మించి, ఉత్తమ క్షత్రియులు అంతరించిపోతున్నారే నన్న ఆవేదన కనిపిస్తుంది. ఇదే భీష్ముడు అంపశయ్య మీద అంతిమక్షణాలకు ఎదురుచూస్తున్న సమయంలో కూడా ; ‘విప్రులకు అధ్యయనం ఎలాగో, రాజులకు యుద్ధం అలాగ. పాపపరులైనప్పుడు తల్లిదండ్రులను, పుత్రపౌత్రులను, గురువులనైనా సరే; యుద్ధంలో చంపడం ధర్మమే. రాజులకు యుద్ధాన్ని మించిన ఉత్తమధర్మం లే’దని ధర్మరాజుతో అంటాడు. అంతేకాదు, యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ, ‘ఏ యజ్ఞమూ సంగ్రామయజ్ఞానికి సాటిరావు’ అంటాడు.

ఇక ద్రోణుడి విషయానికి వస్తే, అభిమన్యుని వధలో ముఖ్యపాత్ర పోషించిన సైంధవుడు; అర్జునుడు  తనను చంపుతానని చేసిన ప్రతిజ్ఞకు భయపడి ద్రోణాచార్యుని కలసుకున్నప్పుడు, ‘కులధర్మం శిథిలం కాకుండా వెళ్ళి యుద్ధం చేయి’ అని ద్రోణుడు అతనితో అంటాడు. మరి విప్రుడైన ద్రోణుడు కులధర్మం తప్పలేదా అన్న ప్రశ్న రావచ్చు కానీ దానిని వ్యక్తిగత దోషంగానే చూడాలి. తను చేసిన తప్పు పట్ల  స్పృహతోనే అతను సైంధవుడికి ఆ సలహా ఇచ్చి ఉండచ్చు.

ఇంతకీ చరిత్రకందని ఆ కాలంలోనే హింస-అహింసల మధ్య ఇంత అంతర్మథనం, ఇంత చర్చ ఎందుకు సంభవించాయన్నది మరో కీలకమైన ప్రశ్న. దానికి సంక్షిప్తంగా చెప్పుకోదగిన సమాధానం ఏమిటంటే, హింస సామాజిక పురోగమనానికి తీవ్ర ఆటంకంగా మారే పరిస్థితులు ఆనాటికే తోసుకువస్తున్నాయి. రాజకీయార్థిక రూపంలో మౌలికమైన మార్పు వస్తోంది. అన్న పుష్కలత్వాన్ని సాధిస్తూ పెరుగుతున్న జనాభాను ఆదుకుంటున్న అభివృద్ధికర సాధనంగా వ్యవసాయం నానాటికీ బలం పుంజుకుంటోంది. దానికితోడు ఇనుము లభ్యత అటు వ్యవసాయానికి సాయపడుతూనే, విచిత్రంగా ఇటు హింసా విజృంభణకూ దారితీయిస్తోంది. వ్యవసాయవిస్తరణకు గణసమాజమూ, ఆయుధోపజీవనమూ అడ్డంకిగా పరిణమించడమే అందుకు కారణం. చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ వ్యవసాయ శక్తులకూ, యథాతథవాదులకూ మధ్య సంఘర్షణ మరింత తీవ్ర రూపం ధరించబోతోంది.













































ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల గుర్తుకొస్తోంది. ఆ నవల ప్రారంభమే ఋతుకాల భయాలతో జరుగుతుంది. మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ, స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.

books

భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది.






ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో కథకుడైన వైశంపాయనుడు వ్యాసుని పుట్టుక గురించి జనమేజయునికి చెప్పి, ఆ వెంటనే, దేవదానవుల అంశతో భీష్మాది వీరులు పుట్టి భారతయుద్ధం చేశారని అంటాడు. అలా పుట్టిన రాజులందరూ భారతయుద్ధంలో నశించడానికి కారణమేమిటని జనమేజయుడు అడుగుతాడు. వైశంపాయనుడు సమాధానం చెబుతూ, పరశురాముడు ఇరవయ్యొక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ సంహరించాడనీ, అప్పుడు ఆ రాజుల భార్యలు సంతానం కోరి ఋతుకాలంలో ధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారనీ, దాంతో రాజవంశాలు వర్ధిల్లాయనీ అంటాడు.మృతులైన రాజుల భార్యలు ఋతుకాలంలో ధర్మం తప్పకుండా, అంటే ఋతుకాలధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారని పై సమాచారం వెల్లడిస్తోంది. ఇక్కడ ఋతుకాల ప్రస్తావన చేయకుండా, విప్రుల ఆశీస్సులతో సంతానం పొందారని చెప్పి ఉంటే, దానికి ఏదో మహిమను ఆపాదించి సమర్థించుకోవచ్చు. కానీ ఋతుకాలాన్ని ప్రస్తావించి మరీ కథకుడు ఈ సంగతి చెప్పాడుకనుక దీనిని వాస్తవికార్థంలోనే తీసుకోవలసి ఉంటుంది.





ఉదంకుడు పైలుడనే ముని శిష్యుడు. ఫైలు డొకసారి దేశాంతరం వెడుతూ ఇంటి బాధ్యతలు ఉదంకునికి అప్పజెబుతాడు. అంతలో ఫైలుని భార్యకు ఋతుకాలం సంభవిస్తుంది. ఇతర స్త్రీలు ఉదంకునితో ఈ విషయం చెప్పి, గురువు దగ్గరలో లేరు కనుక ఆయన స్థానంలో నువ్వు ఆమెకు ఋతుకాలోచితాన్ని నిర్వర్తించాలని చెబుతారు. ఉదంకుడు అందుకు తిరస్కరిస్తాడు. గురువు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనకు చెబుతాడు. అప్పుడు గురువు ఉదంకుని మెచ్చుకుంటాడు. ఉదంకునికి స్త్రీలు ఆ సూచన చేశారంటే, అప్పటికి అలాంటి ఆనవాయితీ ఉందనుకోవాలి. ఉదంకుడు తిరస్కరించాడంటే, ఆ ఆనవాయితీకి కాలం చెల్లుతూ ఉండాలి. ఈ సందర్భాన్ని కథకుడు ప్రధానంగా మరొకందుకు వాడుకున్నాడు. అది, ఉదంకుని గురుభక్తిని చెప్పడం. యజమాని దేశాంతరం వెళ్ళడం, ఒక కట్టుగా ఉన్న స్త్రీలు మాతృస్వామ్యం తాలూకు ఒక ఆనవాయితీని అమలుచేయడానికి ప్రయత్నించడం, యజమాని ప్రతినిధి అయిన ఉదంకుడు అందుకు నిరాకరించడం -ఋతుకాలోచితం విషయంలో  స్త్రీ-పురుషుల మధ్య అప్పటికింకా కొనసాగుతున్న ఘర్షణను సూచిస్తూ ఉండచ్చు.
































































































































































































































యయాతి-దేవయాని-శర్మిష్టల కథ

యయాతి-దేవయాని-శర్మిష్టల కథ



యయాతి-దేవయాని-శర్మిష్టల కథలో దేవయాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, సాధికారంగా కూడా మాట్లాడుతుంది. శర్మిష్ట చాలా తక్కువగా మాట్లాడుతుంది. వారిరువురి సామాజిక నేపథ్యాలలోనూ, సామాజిక దశలలోనూ ఉన్న తేడాయే అందుకు కారణం. బ్రాహ్మణులు అప్పటికి గణనిర్బంధాలనుంచి బయటపడ్డారు. తమ గణం వెలుపల ఎవరికైనా వారు పురోహితులు కావడం, ఎవరినుంచైనా దక్షిణలు తీసుకోవడం ఇందుకు సూచన అని కోశాంబీ అంటాడు. అలాగే, వృత్తి జీవనులుగా బ్రాహ్మణులకు సంచారజీవనమూ ఎక్కువ. ఆవిధంగా వారు నాలుగు ప్రదేశాలు చూస్తారు, ఎక్కువ లోకజ్ఞానాన్ని పొందుతారు. దేవయాని బ్రాహ్మణకన్య కనుక శర్మిష్టతో పోల్చితే ఆమెకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, తెలివి ఎక్కువ. అవి కలిగించే ఆత్మవిశ్వాసం, అహంకారాల పాలు కూడా ఎక్కువే. శర్మిష్ట అలా కాదు, ఆమె రాచకన్య, తండ్రి చాటు బిడ్డ, గణం కట్టుబాట్లకు బందీ, అవసరమైతే తండ్రి రాజకీయ ప్రయోజనాలకు పావుగా మారక తప్పదు. నగరంలో పుట్టి పెరిగి, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికీ, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికీ ఉన్న తేడా లాంటిదే దేవయానికీ, శర్మిష్టకీ ఉన్న తేడా.

కథలోకి వెడుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

శుక్రుడు దైత్యదానవ గణాలకు ఆచార్యుడిగా ఉన్నాడు. అతని దగ్గర మృతసంజీవిని అనే విద్య ఉంది. దేవతలతో జరిగే యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను ఆ విద్యతో అతను బతికిస్తున్నాడు. దాంతో దేవతల పక్షంలో చావులూ, ఓటమీ సంభవిస్తున్నాయి. దేవతలు బృహస్పతి కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎలాగైనా శుక్రుని  మెప్పించి మృతసంజీవినీ విద్యను సాధించాలని కోరారు. శుక్రునికి, కూతురైన దేవయానిపై మమకారం ఎక్కువ, నువ్వు ఆమె మనసు గెలుచుకుంటే నీ పని తేలికవుతుందని కూడా చెప్పారు. కచుడు అంగీకరించి శుక్రుని దగ్గరకు వెళ్ళాడు. శుక్రుడు అతనిని శిష్యునిగా స్వీకరించడమేకాక, అతనికి ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా బృహస్పతికి ఆతిథ్యం ఇవ్వడమే ననుకుని సంతోషించాడు. శత్రువైనాసరే, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనాటి మర్యాద.

శిష్యులు గురువుగారి గోవులను కాచడంతో సహా ఇంటిపనులు చక్కబెట్టడం ఆనాటి గురు-శిష్య సంబంధంలో భాగం. కచుడు ఇంటి పనులు చేస్తూ అటు శుక్రునీ; పువ్వులూ, ఫలాలూ తెస్తూ ఇటు దేవయానినీ మెప్పిస్తూ వచ్చాడు.  కచుడు తమ విరోధులైన దేవతల గురువు బృహస్పతికి కొడుకు కనుక, అతడు ఇలా శుక్రుని ఇంట్లో పాగా వేయడంలో  రాజకీయమైన కుట్రను రాక్షసులు పసిగట్టడం సహజమే. ఓ రోజు కచుడు గోవులను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతన్ని చంపేసి, మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కచుడు వెంట లేకుండా గోవులు ఒంటిగా ఇంటికి చేరుకోవడం చూసి, దేవయాని కీడు శంకించింది. అప్పుడు తండ్రితో అన్న మాటలే పై పద్యం.

శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని మృతసంజీవినీ విద్యను కచుని వద్దకు పంపించి అతన్ని బతికించాడు. కచుడు ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. మరోసారి రాక్షసులు అడవిలో కచుణ్ణి పట్టుకుని చంపేసారు. ఈసారి అతన్ని బతికించే అవకాశం ఇవ్వకూడదనుకుని మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని సురలో కలిపి శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ సురను తాగేశాడు.

కచుడు ఇంటికి రాకపోయేసరికి రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారని దేవయాని ఊహించింది. శోకించడం ప్రారంభించింది. అప్పుడు శుక్రుడు, ‘రాక్షసులు అతని మీద పగబట్టారు. ఎలాగైనా అతన్ని చంపేస్తారు. అతనికి ఉత్తమలోకాలు కలుగుతాయి. ఎందుకు దుఃఖించడం?’ అన్నాడు. 

ఆ మాటకు దేవయాని తండ్రిపై తాచులా లేచింది.

‘మహానుభావా, నువ్వూ ధర్మం తెలిసినవాడివే కదా; ఎంతో బుద్ధిశాలి అయిన అంగిరసుని మనవడు, నీకు ఆశ్రితుడు, నీ శిష్యుడు, బృహస్పతికి కొడుకు, అందగాడు, బ్రహ్మచారి అయిన కచుణ్ణి రాక్షసులు అన్యాయంగా చంపేస్తే, నేను దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతను నా కంట పడితే తప్ప నేను అన్నం తిన’ నని, ఎత్తిపొడుపూ, ఏడుపూ, మొండితనమూ దట్టిస్తూ తండ్రిపై మాటల మేకులు చెక్కింది.

ఇక్కడ తండ్రీ, కూతుళ్ల మధ్య అనుభవంలోనూ, పరిణతిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని పౌరాణికుడు అద్భుతంగా సూచిస్తాడు. కచుని మరణానికి దేవయాని భావోద్వేగంతో స్పందిస్తే; శుక్రుడు రాజకీయ వివేకంతో స్పందిస్తాడు. కచుణ్ణి రాక్షసులు బతకనివ్వరని అతను అప్పటికే గ్రహించాడు. అది రాజకీయంలో భాగం. దాని వెనుక రాక్షసరాజు వృషపర్వుని ఆదేశం తప్పనిసరిగా ఉంటుంది. ఒక హద్దును మించి తను అందులో జోక్యం చేసుకోలేడు. చేసుకోకూడదు కూడా. చేసుకుంటే తన స్థానం ప్రమాదంలో పడడం అలా ఉంచి, నీతి కూడా కాదు. రాక్షసుల గురువుగా వారి రాజకీయ వ్యూహాలకు, ప్రయోజనాలకు తను కలసి రావలసిందే. మరి కచుని శిష్యునిగా ఎలా స్వీకరించాడన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ముందే చెప్పుకున్నాం. శత్రువైనా సరే, దేనినైనా కోరి, అతిథిగా వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదరించడం వ్యక్తిగత స్థాయిలో అనుసరించవలసిన ధర్మమూ, మర్యాదా. అతిథి మర్యాద గురించి ఆ కాలంలో ఉన్న పట్టింపును సూచించే కథలు చాలా ఉన్నాయి. అలాగే, కచునిపై తన కూతురు మనసు పడుతోందనీ శుక్రునికి తెలుసు. అయితే, అది ధర్మబద్ధం కాదనో, లేక పొసగదనో భావన అతనికి ఉన్నట్టు కథాగమనం సూచిస్తుంది.

అయితే, శుక్రునిలో కూతురిపై  ఉన్న మమకారం వీటన్నిటినీ మించినది. అది అతనిలోని రాజకీయ వివేకంతో పోటీపడుతోంది. ఎట్టకేలకు మెత్తబడ్డాడు…

కచుని చూసి కానీ అన్నం ముట్టనని మంకుపట్టు పట్టి అదేపనిగా ఏడుస్తున్న కూతురిని చూసి శుక్రుడు కరిగిపోయాడు. యోగదృష్టితో చూసేసరికి భూమి మీద ఎక్కడా కచుడు కనిపించలేదు. చివరికి తను సేవించిన సురలో బూడిద రూపంలో కచుడు ఉన్నట్టు కనుగొన్నాడు. సురాపానం ఎంత చేటు తెచ్చిందనుకున్నాడు. ఇక నుంచి మద్యపానం ఎవరు చేసినా పాపపు పనుల మీద ఆసక్తితో పతితులైపోతారని శపించాడు. ఆ తర్వాత తన కడుపులో ఉన్న కచుని సంజీవినీ విద్యతో బతికించాడు. అప్పుడు కచుడు, ‘మీ అనుగ్రహం వల్ల దేహాన్నీ, ప్రాణాన్నీ, బలాన్నీ పొందాను. మీ కడుపులోంచి బయటపడే మార్గాన్ని కూడా ఉపదేశించం’ డని శుక్రుని కోరాడు.

శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. నా కడుపును భేదించుకుని కానీ ఇతడు బయటకు రాలేడు, అప్పుడు నా ప్రాణాలు పోతాయి, నేను తిరిగి జీవించాలంటే ఇతనికి సంజీవినిని ఉపదేశించడమే మార్గమనుకున్నాడు. సంజీవినిని ఉపదేశించాడు. తూర్పుకొండ గుహా ముఖం నుంచి ఉదయించిన పూర్ణచంద్రుడిలా కచుడు శుక్రుని కడుపులోంచి బయటకువచ్చాడు. శుక్రుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కచుడు అతనికి సంజీవినితో ప్రాణం పోశాడు.

కచుని పాత్రను రాజకీయకోణం నుంచి అన్వయించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అతడు రెండు ఉద్దేశాలతో శుక్రుని ఆశ్రయించి ఉండచ్చు. మొదటిది, శత్రురహస్యాలను సంగ్రహించడం. రెండోది, శుక్రుని నుంచి కొన్ని విద్యలు నేర్చుకోవడం. శుక్రునికి రాజనీతి కోవిదుడన్న పేరుంది. శుక్రనీతి ప్రసిద్ధం. అయితే, శుక్రుడు శత్రువుల గురువు. కనుక కచునికి అతని ఆశ్రయం లభించడం అంత సులభం కాదు. ఎంతో యుక్తిని కనబరఛాలి. శత్రువర్గానికి చెందిన కచుని  శిష్యునిగా స్వీకరించడం కూడా శుక్రునికి అలాంటిదే. ఆవిధంగా, కచుని యుక్తికీ; శుక్రుని  జాగ్రత్తకూ ఇక్కడ పోటీ. ఆ పోటీలో  కచుడు నెగ్గాడు. శుక్రుని కడుపులో ఉండి మృతసంజీవినిని ఉపదేశం పొందడం, ఆ తర్వాత శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రావడం, శుక్రుని నుంచి తను నేర్చుకున్న విద్యతోనే తిరిగి అతనికి ప్రాణదానం చేయడం కచుని పైచేయిని చాటతాయి.

దీనినే గురు-శిష్య సంప్రదాయం నుంచి చెప్పుకుంటే, కచుడు గురువును మించిన, లేదా గురువుతో సమానుడైన శిష్యు డయ్యాడు. గురువు మృతుడైనా అతని విద్య శిష్య, ప్రశిష్యుల ద్వారా సంజీవినిగా మారి అతని కీర్తి కాయాన్ని బతికిస్తూనే ఉంటుందన్న ధ్వని కూడా ఇందులో ఉండచ్చు. కచుడు వామనుడి పాత్రను గుర్తుకు తెస్తాడు. వామనుడు కూడా ఇలాగే యుక్తిపరుడు. బలి చక్రవర్తిని మూడడుగుల నేల మాత్రం అడిగి చివరికి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. గణనిర్బంధాలనుంచి బయటపడి నూతన సామాజిక వ్యవస్థకు వేగుచుక్కగా మారిన బ్రాహ్మణులు, ఇతర సామాజికవర్గాలతో పోల్చితే బుద్ధి కుశలతను పెంచుకుంటున్న సంగతిని ఈ రెండు పాత్రలూ ప్రకటిస్తూ ఉండచ్చు.

అదలా ఉంచితే, మృతసంజీవిని పేరిట చనిపోయినవారిని బతికించే విద్య ఏదో  ఉండేదని భావించనవసరం లేదు. అది, కచునిలోని యుక్తిపరుని పైకెత్తడానికి ఉద్దేశించిన ఒక చక్కని పౌరాణిక కల్పన కావచ్చు.

కచుడు శుక్రుని ఇంట అడుగు పెట్టే ముందే వ్యూహరచన జరిగినట్టు పౌరాణికుడు చెప్పనే చెప్పాడు. తను శుక్రుని ఒక్కడినే మెప్పిస్తే చాలదని కచునికి తెలుసు. శుక్రుని అతి పెద్ద బలహీనత అయిన అతని కూతురు దేవయాని మనసునూ గెలుచుకుని, ఆమెను తండ్రిపై ఒడుపుగా ప్రయోగించాలి. అలా రెండు వైపులనుంచీ కచుడు నరుక్కు వచ్చాడు. అతడు కరడుగట్టిన ప్రయోజనవాదిగానూ, శత్రుస్థావరంలోకి అవలీలగా అడుగుపెట్టి, రహస్యాలను కొల్లగొట్టి అజేయంగా తిరిగి రాగలిగిన సుశిక్షితుడైన గూఢచారిలానూ కనిపిస్తాడు. ఏ బలహీనతలకూ లొంగని లక్ష్యశుద్ధి అతనిది. దేవయాని తనపట్ల మనసు పడేలా అద్భుతంగా నటించాడు. తండ్రిని ప్రభావితం చేసి, రాక్షసుల బారినుంచి తనను కాపాడే కవచంలా ఆమెను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో ఆమె ఆకర్షణ వలయంలో తను  చిక్కుకోకుండానూ జాగ్రత్త పడ్డాడు. దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి లేనే లేదు.

ఇందుకు భిన్నంగా దేవయాని కచుని మాయలో పడిపోయింది. శుక్రుడు కూతురి మీద మమకారానికి తలవంచాడు. కచుడు వచ్చిన పని చక్కబెట్టుకుని విజయగర్వంతో స్వస్థలానికి తిరుగు ప్రయణమయ్యాడు. అప్పుడు దేవయాని అతనితో అన్న మాటలే, పై పద్యం.

కచునిలా దేవయాని కూడా తెలివైనదే, గడుసుదే; అయితే ఆ తెలివి అతితెలివి అంచులు తాకుతూ ఉంటుంది. ఆ పైన ఆ తెలివిని కచునిపై మోహం మబ్బులా కమ్మేసింది. ఎక్కడ కాదంటాడో నన్న శంకతో, సంజీవినితోపాటు నన్ను కూడా స్వీకరించు అంటూ, సంజీవినిని కట్నంగా ఎర వేసింది. అది కూడా,  ‘శుక్రుని దయతో’ అనడంలో, తను తండ్రి చాటు బిడ్డననీ, అయితే తండ్రి ఈ పెళ్ళికి కాదనడనీ, ఆయనను ఒప్పించే బాధ్యత తనదనే ధ్వని ఉంది. అంత తెలివిగా మాట్లాడే దేవయాని ఎక్కడ తప్పటడుగు వేసిందంటే, ఒక కచ్చితమైన రాజకీయలక్ష్యంతో వచ్చిన కచుని ఇంగితాన్ని అర్థంచేసుకోలేకపోవడంలో! వ్యక్తిగత ప్రేమకూ, కనికరానికీ తావులేని అతని విశాల రాజకీయ వ్యూహంతో, ఆమె వ్యక్తిగత ఆకాంక్ష పోటీ పడి, ఓడిపోయింది. దేవయాని నిలువునా మోసపోయింది.

ఆమె మాటలు కచునికి ఎంతో విషాదాన్నీ, నొప్పినీ కలిగించాయట. లోకమంతా తప్పు పట్టే మాటలు మాట్లాడడం నీకు తగునా అన్నాడు. నా మనసులో నీకున్నది సోదరి స్థానమే ననేశాడు. ఆ తర్వాత, అంతకంటే ముఖ్యమైన ఒక సత్యాన్ని ప్రస్తావించాడు. గురువులకు శిష్యులు పుత్రులే, ఇదే లోకధర్మం, గురుపుత్రి వైన నువ్వు దీనిని గమనించకుండా మాట్లాడా వన్నాడు. దాంతో హతాశురాలై ఆగ్రహించిన దేవయాని నా కోరికను నువ్వు కాదన్నావు కనుక నీకు సంజీవిని పనిచేయకుండు గాక అని శాపమిచ్చింది. అప్పుడు కచుడు, సంజీవిని నాకు పని చేయకపోయినా నా నుంచి ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది; నువ్వు ధర్మవిరుద్ధమైన ప్రతిపాదన చేశావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లిచేసుకోడని ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు.

నువ్వు నాకు సోదరివని కచుడు ఇప్పుడు దేవయానితో అన్నా, అంతకాలమూ  ఆమెతో సోదరభావనతో  మెలగలేదని స్పష్టమే. అంటే, తన లక్ష్యానికి ఆమెను పరికరంగా వాడుకుంటూ ఆమెలో లేనిపోని ఆశలు కలిగించాడు. కనుక, గురువులకు శిష్యులు పుత్రులన్న ధర్మం పట్ల అతనికి ఎంత నిబద్ధత ఉందో మనకు తెలియదు. ఏమైనా, తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే తప్ప దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి ఎలాగూ లేదు కనుక అతన్ని పక్కన పెడితే; ఆ పెళ్లి విషయంలో, కథ చెబుతున్న పౌరాణికునికీ, బహుశా శుక్రుడికీ కూడా నిజంగానే అభ్యంతరాలున్నాయి. ఎందుకంటే, తప్పించుకునే ఉద్దేశంతోనే చెప్పినా, కచుడు నిజం చెప్పాడు.

తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; ‘భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా’ అని అతనికి గుర్తుచేయబోతోంది.


కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి, గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది. దాంతో దేవయాని మండిపడింది. ‘లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతురిని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు శర్మిష్ట అహం దెబ్బతింది. ‘నీ తండ్రి మా అయ్య దగ్గర పని చేస్తూ, దీవిస్తూ, ప్రియమైన మాటలు చెబుతూ ఉంటాడు. నీ గొప్పలు నా దగ్గరా, సిగ్గులేకపోతే సరి, నేను కట్టిన చీర నువ్వెందుకు కట్ట కూడదట?!’ అని నిందించి, అంతటితో కోపం తీరక దేవయానిని ఒక నూతిలోకి తోసేసి, కన్యలతో కలసి ఇంటికి వెళ్లిపోయింది.

yayati1

ఆ సమయంలో వేటకు వచ్చిన రాజు యయాతి, ఆ అడవంతా తిరిగి అలసిపోయాడు.  మంచినీళ్లు తాగుదామని దేవయాని పడున్న నూతి దగ్గరకు వచ్చాడు.  లోపలికి తొంగి చూశాడు. కన్నీరు నింపుకుంటూ, ఒక పెద్ద తీగను పట్టుకుని ఉన్న దేవయాని కనిపించింది. ‘నువ్వు ఎవరిదానివి? ఈ నట్టడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. తాము ఎప్పుడూ విహారానికి వచ్చే ఆ అడవికి యయాతి వేటకు రావడం ఇంతకుముందు చూసింది కనుక దేవయాని అతన్ని గుర్తుపట్టింది.  ‘దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను తన సంజీవినీవిద్యతో బతికించే అమితశక్తిమంతుడైన శుక్రుని కూతుర్ని నేను. నా పేరు దేవయాని. పొరపాటున ఈ నూతిలో పడి బయటికి రాలేకపోతున్నాను. నన్ను పైకి లాగి రక్షించు’ అంది. అప్పుడు యయాతి తన కుడి చేతిని ఆమెకు అందించి పైకి తీశాడు. ఆ తర్వాత తన దారిన తను వెళ్లిపోయాడు.

అంతలో ఒక పరిచారిక దేవయానిని వెతుక్కుంటూ వచ్చింది.  దేవయాని ఆమెతో, ‘నేను వృషపర్వుని పురంలోకి  అడుగుపెట్టను. శర్మిష్ట నాకు చేసిన అవమానం గురించి వెళ్ళి నా తండ్రికి చెప్పు’ అని చెప్పి పంపేసింది. సంగతి తెలిసి శుక్రుడు పరుగుపరుగున వచ్చాడు. కోపంతో సుడులు తిరుగుతున్న కళ్ళలో నీరు కుక్కుకుంటున్న కూతుర్ని చూసి అన్నాడు.  ‘వేయి యజ్ఞాలు చేసినవాడి కన్నా కోపం లేనివాడే గొప్పవాడు. ఇతరులు కోపించినా కోపించకుండా, నిందించినా మారు మాట్లాడకుండా, అవమానించినా మన్సులో తలవకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. బుద్ధిమంతులు కోపాన్ని గొప్ప చేయరు. శర్మిష్ట రాచకూతురు, చిన్నది, దానితో నీకేమిటి, ఇంటికిరా’ అన్నాడు.

‘ఎలాంటివారినీ లక్ష్యపెట్టకుండా హద్దు మీరి నిందించే బుద్ధిలేని వాళ్ళ దగ్గర ఉండడం కన్నా నీచమేముంటుంది, నేనా వృషపర్వుని పురంలోకి రాను, ఇంకెక్కడికైనా పోతాను’ అని దేవయాని భీష్మించింది. ‘సరే, నీ కంటే నాకింకెవరున్నారు, నేనూ నీతోనే వస్తాను, పద’ అని శుక్రుడు అన్నాడు. చారులద్వారా వృషపర్వునికి విషయం తెలిసింది. హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. ‘మీ విద్యాబలంతోనే రాక్షసులు దేవతలను జయించి స్థిరమైన సంపదనూ, ఉద్ధతినీ పొందగలుగుతున్నారు. లేకపోతే, దేవసేనాపతుల దెబ్బకు సముద్రం పాలయ్యేవారే. ఈ సంపదంతా మీది, ఈ రాక్షసులంతా మీ వాళ్ళు’ అని శుక్రునితో అని, దేవయానితో, ‘తల్లీ నీ కేది ఇష్టమో చెప్పు, అది ఇస్తాను’ అన్నాడు. దేవయాని సంతోషించి, ‘అయితే, శర్మిష్టను, ఆమె వెంట ఉండే కన్యలతో సహా నాకు దాసిని చెయ్యి’ అంది. వృషపర్వుడు అంగీకరించి అప్పటికప్పుడు కూతుర్ని అక్కడికి రప్పించి దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. శర్మిష్ట మారు మాట్లాడకుండా తండ్రి ఆదేశాన్ని శిరసావహించి, తనతో ఉన్న కన్యలతోపాటు తను కూడా దేవయానికి దాసిగా సేవలు చేయడం ప్రారంభించింది.

శుక్రుడి స్వభావం గురించి కొంత ఇంతకుముందే చెప్పుకున్నాం. అతనికి దేవయాని ప్రవర్తన నచ్చడం లేదు. అయినా ఆమెపై మమకారం అతనిలోని వివేకం పీక నొక్కేస్తోంది. ఇంటికి రానని కూతురు కబురు చేసేసరికి కలవరపడుతూ పరుగు పరుగున ఆమె ఉన్న చోటికి వెళ్ళాడు. ‘కోపం పనికి రాదు, శర్మిష్ట రాచకూతురు, చిన్నపిల్ల, ఆమెతో నీకేమి’ టని చెప్పిచూశాడు. దేవయాని వినలేదు. ‘అయితే, సరే నీతోనే నేనూ’ అన్నాడు. శర్మిష్ట తన కూతురిని అవమానిస్తుందా అనుకుని కూతురిలా అతను  ఆవేశపడలేదు. ఆమె రాచకూతురు అనడంలో అతనిలో తారతమ్యాల స్పృహ ఉంది, చిన్నపిల్ల అనడంలో  పెద్దరికంతోపాటు, ఆమె కూడా తన కూతురిలాంటిదే నన్న వాత్సల్యభావన ఉంది. శర్మిష్టపై శుక్రునికి ఉన్న ఒక ప్రత్యేక ఆదరభావం ముందు ముందు కూడా వ్యక్తం కాబోతోంది.

ఇక్కడ శుక్రుడు-దేవయాని; వృషపర్వుడు-శర్మిష్ట అనే రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య ఉన్న తేడాను గమనించండి. దేవయానిది తండ్రిని శాసించే స్వభావం. శర్మిష్టది తండ్రి శాసనాన్ని మౌనంగా తలదాల్చే స్వభావం. దేవయానికి తండ్రి రాజకీయ అవసరాలమీదా, ఇబ్బందుల మీదా ఖాతరు లేదు. శర్మిష్టకు ఉంది. దేవయానిని నిందించి నూతిలో తోసే సమయంలో ఆ ఖాతరు లేకపోయినా,  ఆ తర్వాత తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో  ఆమెకు అర్థమయ్యుంటుంది.  వృషపర్వుని రాజకీయ అస్తిత్వంలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగం. వృషపర్వుని అస్తిత్వం, మొత్తం రాక్షసుల అస్తిత్వం. తను దూరం ఆలోచించకుండా క్షణికోద్రేకంతో తప్పు చేసింది. ఆ తప్పుకు తండ్రి విధించే శిక్షను కిమ్మనకుండా అనుభవించవలసిందే!

శుక్రుడికి దేవయానిపై ఉన్నంత మమకారమే వృషపర్వునికి శర్మిష్టపై ఉంటుంది. అయినా సరే, రాక్షసుల విశాల అస్తిత్వం కోసం కూతురి సుఖాన్ని బలిచేయడానికి అతను మనసు రాయి చేసుకోక తప్పదు. కూతురి విషయంలో శుక్రుడు ఎక్కడైతే ఓడిపోయాడో  వృషపర్వుడు అక్కడే గెలిచాడు. ఈ  రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య తేడా ఇంకా ఎలాంటిదంటే; గణం నిర్బంధాలు, అవసరాలు ఏమీ లేని వైయక్తిక స్వతంత్ర వ్యవహారశైలి శుక్ర-దేవయానులది. గణ నిర్బంధాలు, ప్రయోజనాల పంజరంలో అస్వతంత్రను పాటించక తప్పని స్థితి వృషపర్వ-శర్మిష్టలది. ఒక్క మాటలో చెప్పాలంటే, గణం వెలుపల కూడా జీవించగలిగిన వెసులుబాటు శుక్ర-దేవయానులకు ఉంది. గణం వెలుపల వృషపర్వ-శర్మిష్టలకు జీవితం లేదు.

కథనంలో కవి ఇంకా ఎన్ని మెళకువలు చూపాడో చూడండి…దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను నిలదీసింది. ఆ సమయంలో కులాహంకారం ఆమెలో ఎంతగా పడగవిప్పి బుసకొట్టిందంటే, భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒకచోట సమతూకాన్ని స్థాపించి తీరుతుంది.

‘నువ్వెవరివి, ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నా’వని యయాతి అడిగిన సందర్భంలో, పొరపాటున తను నూతిలో పడ్డానని దేవయాని అబద్ధమాడిన సంగతి గమనించండి. దేవయాని గడుసుదనానికి అదొక నిదర్శనం. శర్మిష్ట అనే రాచకూతురు తనను నూతిలోకి తోసిందని చెబితే, యయాతి ఆలోచన ఆమె వైపుకి మళ్లిపోతుంది. బహుశా తనకంటే శర్మిష్ట అందగత్తె, పైగా రాచబిడ్డ.  ఆ సమయంలో ఆమె పేరు తను ఎత్తడమంటే, ఆమెను తనే తీసుకెళ్లి రాజు చేతుల్లో పెట్టడమే. శర్మిష్ట తనను నూతిలోకి తోసేసి వెళ్ళిన తర్వాత, అంతటి అవమానంలోనూ, దుఃఖంలోనూ కూడా దేవయాని బుద్ధి చురుగ్గా పనిచేస్తోందన్న మాట. శర్మిష్ట రాచవైభవాన్నే కాదు; అది తెచ్చిపెట్టే అతిశయాన్నీ, అహంకారాన్ని కూడా దేవయాని ఇప్పుడు దగ్గరగా చూసింది. శర్మిష్టపై ఆమెకు ఆక్షణంలో ఆగ్రహమే కాదు, అసూయ కూడా ఉంది. దానికి తోడు కచుడు తనను నిరాకరించి వెళ్ళిన నేపథ్యం ఉంది. నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడన్న కచుని శాపం కూడా ఆమె ఆలోచనల్ని వెంటాడుతూ ఉండచ్చు. నూతిలో పడున్న ఆ క్షణాలలోనే శర్మిష్ట చేసిన అవమానమూ, కచుని శాపమూ కలసి రాజును పెళ్లాడాలన్న సంకల్పాన్ని ఆమె బుద్ధిలో బలంగా నాటి ఉండచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే  యయాతి రంగప్రవేశం…

కథనంలో ఇలా నన్నయ చూపించిన మెళకువలను చర్చించడం ఈ మొత్తం కథను ఏకరవు పెట్టడానికి మొదటి కారణమైతే, ఇక రెండో కారణానికి వస్తాను. ఈ కారణం మొదటిదానికంటే కీలకమే కాక, అత్యంత ఆసక్తికరం కూడా. పైన వివరించుకున్న కథలోనే కథకుడు పాత్రల స్వభావాలను, కథ తిరగబోయే మలపులను నేరుగా చెప్పకుండా అక్కడక్కడ ధ్వనింపజేశాడనుకున్నాం. విచిత్రమేమిటంటే, ఇంకో కోణం నుంచి చూసినప్పుడు, ఈ మొత్తం కథానిర్మాణమే ఇంకో కథను ధ్వనింపజేస్తోంది! ఆ కథలో నాయిక దేవయాని కాదు, శర్మిష్ట! పై కథను ఓసారి గమనించండి…అది దేవయాని పరంగా చెబుతున్నట్టు మనకు అనిపిస్తుంది. దేవయానే కథానాయికగానూ అనిపిస్తుంది. కానీ కథలో అంతర్లీనంగా ధ్వనించే అసలు కథ వైపు చెవి యొగ్గి జాగ్రత్తగా వినండి. అది శర్మిష్ట పరంగా చెబుతున్న కథ అని మీకు అర్థమవుతుంది.

అవును, నిజం. అతిగా మాట్లాడే దేవయాని ఈ కథలో నాయిక కాదు…మితంగా మాట్లాడే శర్మిష్టే నాయిక!

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న ’అతిశయ రూప లావణ్య సుందరి’ అయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ‘ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు’ అంది.

ఆ వెంటనే, ‘నన్ను నూతిలోంచి  పైకి తీసినప్పుడే ఆ సూర్యుని సాక్షిగా నీ కుడి చేతితో నా చేయిపట్టుకున్నావు. అది నన్ను పెళ్లాడడమే. ఆ సంగతి విస్మరించడం నీకు న్యాయం కాదు’ అని హెచ్చరించింది. ఆపైన, ‘నహుషుని కొడుకువైన  యయాతీ, నన్ను పెళ్లి చేసుకుని ఈ సుందరాంగితోపాటు, దేవకన్యలకు సాటి వచ్చే ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా దేవేంద్రుడిలా ఈ నరలోకంలో అన్ని భోగాలూ అనుభవించు’ అంది. దేవేంద్ర భోగాలు అనుభవించమనడంలో తెలివిగా ‘ఓ నహుషనందనా’ అని సంబోధించింది. నహుషుడు కొంతకాలం ఇంద్రపదవిలో ఉన్నాడు.

01Kach

దేవయాని ప్రతిపాదనకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు కానీ, బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా, వర్ణాశ్రమధర్మాలను కాపాడవలసిన రాజునైన నేనే ధర్మం తప్పితే ప్రపంచం నడక అస్తవ్యస్తమైపోదా అన్నాడు. అప్పుడు దేవయాని, ‘గొప్ప బాహుబలం కలవాడా’ అని అతన్ని సంబోధించి, ‘ధర్మాధర్మాలు నిర్ణయించే లోకపూజ్యుడైన శుక్రుడు ఆదేశిస్తే నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అని అడిగింది. ‘బాహుబలం కలవాడా’ అనడంలో, రాజ్యపాలనే నీ బాధ్యత తప్ప ధర్మాధర్మనిర్ణయం కాదు, అది శుక్రుడు చేయవలసిన పని అనే మెత్తని చురక ఉంది. అంతేకాదు, తండ్రిని తను ఒప్పించగలనన్న ధీమా కూడా ఆ మాటల్లో ఉంది.

ఆ మహాముని ధర్మవిరుద్ధం కాదంటే నిన్ను వివాహమాడతానంటూ యయాతి ఆ సంభాషణకు అంతటితో తెర దించాడు. దానిని పొడిగించడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే, అప్పటికే అతను శర్మిష్టవైపు ఆకర్షితుడయ్యాడు. దేవయాని ఆమెను తన దాసిగా పరిచయం చేసింది కనుక, ఆమెను నేరుగా తను పొందగల అవకాశం లేదు. దేవయానిని తను పెళ్లిచేసుకుంటేనే శర్మిష్ట తన దవుతుంది. బహుశా నేరుగా ఆమెను తను స్వీకరించడానికి సామాజిక స్థాయికీ, హోదాకూ చెందిన అభ్యంతరాలు కూడా ఉండి ఉండచ్చు. దేవయాని మాట నేర్పు, స్వభావం అప్పటికే అతనికి అర్థమయ్యాయి. ఆమె తనతో పెళ్ళికి తండ్రిని ఒప్పించగలదన్న నమ్మకమూ అతనికి కలిగి ఉంటుంది. దేవయానితో పెళ్ళికి అంగీకరిస్తేనే శర్మిష్ట  తనకు దక్కుతుంది కనుక దేవయానితో తన పెళ్లి ధర్మమా, కాదా అన్న చర్చ తనకు అనవసరం. అది తేల్చే బాధ్యత దేవయాని తీసుకుంది.

జాగ్రత్తగా గమనించండి…యయాతి దేవయాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఇంతకుముందు ఆమెను నూతి లోంచి పైకి తీసిన తర్వాత అతను తన దారిన తను వెళ్లిపోయాడని చెప్పడం ద్వారా కథకుడు ఆ సూచన చేయనే చేశాడు. ప్రస్తుత సందర్భంలో, ‘అతిశయ రూపలావణ్యసుందరి’ అయిన శర్మిష్ట గురించి తెలుసుకో గోరాడని అనడం ద్వారా ఆమె వైపు అతను ఆకర్షితుడయ్యాడన్న సూచన అంతకంటే స్పష్టంగా ఇచ్చాడు.

దేవయాని, యయాతి ల మధ్య నడిచినది ఒకవిధమైన మైండ్ గేమ్. ఇద్దరిలోనూ లౌక్యమూ, గడుసుదనమూ ఉన్నాయి. ఇద్దరికీ తమవైన వ్యూహాలు ఉన్నాయి. దేవయానికి రాజును పెళ్లాడడం ముఖ్యం. తద్వారా లభించే రాచవైభవం ఆమెకు కావాలి. యయాతికి రూపలావణ్య సుందరి అయిన శర్మిష్ట కావాలి. శర్మిష్ట మనసులో ఆ క్షణంలో ఎటువంటి ఆలోచనలు చెలరేగాయో మనకు తెలియదు. అప్పటికామె ఎటు వంచితే అటు వంగవలసిన మైనపు బొమ్మ!

దేవయాని అప్పటికప్పుడు తండ్రిని రప్పించింది. ‘ఈ రాజు ఇప్పటికే నా పాణిగ్రహణం చేశాడు కనుక వివాహ సంబంధంగా ఇంకొకరు నా చేయి పట్టుకోవడం ఎలా ధర్మమవుతుంది? కనుక ఈ జన్మలో ఇతడే నా భర్త. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లాడతానని ఇతడు కూడా మాట ఇచ్చాడు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడు’ అని తండ్రితో అంది. గమనించండి…దేవయాని ఈ పెళ్లి ధర్మబద్ధమో, కాదో చెప్పమని అడగలేదు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడమని మాత్రమే అడిగింది. అంటే తన terms and conditions ను స్పష్టంగా నిర్దేశించిందన్నమాట. శుక్రుడు వాటిని దాటి మాట్లాడే ప్రశ్నే లేదు. ఈ వివాహంలో ఎలాంటి ధర్మోల్లంఘనా లేదన్న ఒకే ఒక వాక్యంతో ఆమోదం తెలిపేశాడు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.

ఆ తర్వాత శుక్రుడు శర్మిష్టను యయాతికి చూపించి, ’ఈమె వృషపర్వుని కూతురు. ప్రేమతో ఈమెకు అన్నపానాలు, వస్త్రాభరణాలు, సుగంధలేపనాలు వగైరాలు సమకూర్చి సంతోషపెట్టు. అయితే ఈమెతో నువ్వు పడక సుఖానికి మాత్రం దూరంగా ఉండాలి’ అన్నాడు. యయాతి శుక్రుని వద్ద సెలవు తీసుకుని దేవయానినీ, శర్మిష్టతో సహా దాసీకన్యలనూ  వెంటబెట్టుకుని రాజధానికి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఒక చక్కని మేడలో దేవయానిని ఉంచి; ఆమె అనుమతితో శర్మిష్టనూ మిగిలిన కన్యలనూ అశోకవనం సమీపంలోని ఒక గృహం లో ఉంచాడు.

యయాతితో శుక్రుడు అన్న పై మాటలు అతని స్వభావాన్నీ, దేవయాని స్వభావాన్నీ కూడా మరోసారి వెల్లడిస్తున్నాయి. దేవయానిలో అహమూ, అసూయే కాక; అవకాశవాదమూ, స్వార్థమూ కూడా హెచ్చుపాళ్లలోనే ఉన్నాయి. యయాతిని తనతో పెళ్ళికి ఒప్పించే ముందు; శర్మిష్టనూ, మిగిలిన దాసీ కన్యలనూ చూపించి దేవతాస్త్రీలకు సాటివచ్చే ఈ సుందరాంగులందరూ నిన్ను సుఖపెడతారని ఆశపెట్టింది. తీరా యయాతి పెళ్ళికి ఒప్పుకున్నాక మాట మార్చింది. యయాతిని శర్మిష్టతో కలసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆ మాట యయాతితో తను నేరుగా చెప్పకుండా తండ్రితో చెప్పించింది. తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించే సాహసం యయాతి చేయడని ఆమె ధీమా.

శుక్రుడు కూతురి అభిమతాన్ని కాదనే ప్రసక్తే లేదు కనుక, శర్మిష్టను పడక సుఖానికి  మాత్రం దూరంగా ఉంచమని యయాతికి ప్రత్యేకించి చెప్పాడు. అయితే, వృషపర్వుని కూతురైన ఈమెకు అన్నీ సమకూర్చి సంతోషపెట్టు అని కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాడు. అలా చెప్పడంలో శర్మిష్టపై అతనికున్న పుత్రికావాత్సల్యమూ, సుకుమారంగా సుఖాల మధ్య పెరిగిన ఆమెను కష్టపెట్టవద్దని చెప్పే ఔదార్యమూ, ధార్మికతా వ్యక్తమవుతూ ఉండచ్చు.

ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, శర్మిష్టకు అన్ని వసతులూ కల్పించి పడక సుఖానికి మాత్రం దూరంగా ఉంచమని శుక్రుడు చెప్పడంలో, ఆమెనుంచి పడక సుఖం కూడా పొందమన్న ధ్వని ఉండడానికీ అవకాశముంది. దాని గురించి వివరించుకోవడం ప్రారంభిస్తే, ఆ వివరణ ఇంతకుముందు చెప్పినట్టు, దేవయాని పరంగా చెప్పిన కథను శర్మిష్ట పరంగా మార్చివేస్తుంది. శర్మిష్టనే కథానాయికగా మనముందుకు తీసుకొస్తుంది.

ఎలాగంటే, యయాతికి శర్మిష్టను చేపట్టడమే ప్రధాన లక్ష్యం. అందులో వ్యక్తిగత ఆకాంక్షే కాక, రాజకీయ అవసరం కూడా ఉండచ్చు. తను రాజు కనుక రాచకన్యద్వారానే వారసుని కనవలసి ఉంటుంది.  అప్పుడే దానికి సమాజం నుంచి హర్షామోదాలు లభిస్తాయి. దేవయానికి కలిగే సంతానానికి సమాజం ఆ ప్రతిపత్తి ఇవ్వదు. వారసుని ఎంపికలో ఆనాటి రాజుకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. అది సమాజమూ, రాజూ కలసి తీసుకోవలసిన సమష్టి నిర్ణయం. యయాతికీ, శుక్రుడికీ కూడా ఆ అవగాహన ఉంది. అయితే, ఇక్కడ మధ్యలో దేవయాని ఉంది. ఇంతవరకు శుక్రుడికి నెత్తి మీద దేవతగా ఉన్న దేవయాని ఇకముందు యయాతికి చిక్కుముడిగా మారబోతోంది. బహుశా యయాతి-శర్మిష్టల మధ్య కలగబోయే సంబంధం శుక్రుని ఊహలో ముందే ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, అందుకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలో శుక్రుడు కూడా భాగస్వామి అయుండచ్చు.

కూతురిపై అపరిమిత మమకారం ఉన్న శుక్రుడు ఆమె కాపురంలో చిచ్చు పెట్టే పాత్ర నిర్వహించాడంటే వినడానికి విడ్డూరంగానూ, విపరీతంగానూ ఉండే మాట నిజమే. అయితే, కాసేపు దేవయాని పరంగా చెప్పిన కథ అన్న సంగతి మరచిపోయి శర్మిష్ట పరంగా చెప్పిన కథగా ఊహించుకోండి. యయాతి అసలు శర్మిష్టనే చేపట్టాలనుకున్నాడు. అయితే, ఆమె దేవయానికి అప్పటికే దాసిగా మారిపోయింది కనుక యజమానురాలిని పెళ్లాడితేనే శర్మిష్ట తనకు దక్కుతుంది. యయాతి వైపునుంచి ఈ మొత్తం వ్యూహానికి సంబంధించిన అవగాహన లోకజ్ఞుడైన శుక్రుడికి పూర్తిగా ఉంది. దేవయానికి లేదు. ఎందుకంటే, ఆమెది పూర్తిగా వైయక్తికమైన అజెండా. అందులో ఇతరేతర అంశాలకు చోటులేదు.

  అసలు శర్మిష్ట కథను దేవయాని వైపునుంచి కథకుడు ఎందుకు చెప్పినట్టు? రెండు కారణాలను ఊహించవచ్చు. మొదటిది, దాసిగా ఉన్న శర్మిష్టను రాజమార్గంలో చేపట్టడానికి యయాతికి అవకాశంలేదు. అందుకు సామాజిక నిర్బంధాలు అడ్డువస్తాయి. రెండవది, కథకుడికి దేవయానిని ప్రధానం చేసి కథ చెప్పడమే ఇష్టం. ఎందుకంటే, ఆమె భృగువంశీకురాలు. కోశాంబీ ప్రకారం మహాభారత పరిష్కరణలో భృగులు ప్రధాన భూమిక పోషించారు. భృగులను విశిష్టులుగా చిత్రించే ఘట్టాలు మహాభారతంలో చాలా ఉన్నాయి. పరశురాముడు ఇంకో ఉదాహరణ. 
కథలోకి వస్తే, ‘దేవయాని అనుమతి’తో శర్మిష్టను ఇతర దాసీ కన్యలతోపాటు యయాతి అశోకవన సమీపంలో ఒక గృహంలో ఉంచాడని కథకుడు చెబుతున్నాడు. ఆ సమాచారంతో యయాతి-శర్మిష్టల మధ్య జరగబోయే సమాగమాన్ని  సూచిస్తున్నాడు. అంటే, ఎంత దేవయాని వైపునుంచి కథ చెప్పినా కథకుడు శర్మిష్ట ప్రాధాన్యాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాడన్నమాట!  అదలా ఉంచితే, ‘దేవయాని అనుమతితో’ శర్మిష్టను (తను తరచు విహరించే) అశోకవన సమీపంలో ఉంచాడని చెప్పడం  ద్వారా, అనేకమందితో రహస్య ప్రణయాలు సాగిస్తూ, భార్యపట్ల అతి విధేయతను ప్రదర్శించే దక్షిణనాయకుడిగా యయాతిని కథకుడు మన ముందుకు తెస్తున్నాడు.

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది. ఏ ఆడదైనా కోరుకునేది భర్తనూ, కొడుకులనూ పొందాలనే, ఆ రెండూ దక్కిన దేవయాని అదృష్టమే అదృష్ట మనుకుంటోంది.

యయాతి తొలిసారి తనను చూసినప్పుడే ఆ చూపుల్లో తన మీద ఉట్టిపడుతున్న ఇష్టాన్ని శర్మిష్ట పోల్చుకుని ఉంటుంది. అప్పుడే నిశ్శబ్దంగా తన హృదయంలో అతనిని నిలుపుకుని ఉంటుంది.  అతనిమీదే నా హృదయం ఎప్పుడూ లగ్నమై ఉంటుందని ఇప్పుడు కూడా అనుకుంటున్న శర్మిష్ట, ‘నన్నీతడు గరము  కారుణ్యమున  బ్రీతి గలయట్ల జూచు…’ ననుకుంది.

సామాజిక స్థాయీ భేదాలు మానవసంబంధాలలోనే కాక; వాటి వ్యక్తీకరణకు ఉపయోగించే మాటల్లో కూడా తేడా ఎలా తీసుకొస్తాయో పౌరాణికుడు ఇక్కడ అలవోకగా సూచిస్తున్నాడు. యజమాని ఒక దాసిపై  చూపించే అనురక్తిని ప్రేమ అనో, అనురాగమనో అనకూడదు; కారుణ్యం అనాలి. దాసి కూడా యజమాని నుంచి కారుణ్యాన్ని మాత్రమే ఆశిస్తుంది. పై వాక్యం శర్మిష్ట దాసిత్వాన్నే కాక ప్రస్తుత సందర్భంలో ఆమె దయనీయతను కూడా వెల్లడిస్తోంది.

దేవయానిలానే నేను కూడా ఇతనినే భర్తను చేసుకుంటానని శర్మిష్ట అనుకుంది. సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అంది.

‘పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.

 శర్మిష్టకు శరీరంతో మాట్లాడే భాషే కాదు, దానికి కావలసినవి సాధించుకునే తర్కమూ తెలుసు. అందుకు అవసరమైన పాండిత్యమూ ఆమెకు ఉంది. మగవాడి బలహీనతపై ఒడుపుగా గురిచూసి కొట్టి లొంగదీసుకునే నేర్పూ ఉంది. ప్రకృతి ప్రతి ప్రాణికీ ఆయాచితంగా ప్రసాదించిన నేర్పు అది. ప్రకృతి సిద్ధమైన ఆమె బలవత్తర వాంఛ ఆ క్షణంలో దేవయానిపట్ల భీతిని కూడా జయించింది.

శర్మిష్టకు కొడుకు పుట్టాడు. పేరు, దృహ్యువు. దేవయాని ఆశ్చర్యపోయింది.  ‘చిన్నదానివైనా మంచి వినయశీలాలతోనూ, గౌరవంగానూ, మనోవికారాలకు దూరంగానూ ఉంటున్న ఈ పరిస్థితిలో నీకు కొడుకు ఎలా పుట్టాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అంది.

శర్మిష్ట సిగ్గుపడుతూ తలవంచుకుని, ‘ఎక్కడినుంచో ఒక మహాముని, వేదవేదాంగపారగుడు వచ్చి ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకును ప్రసాదించాడు’ అంది.

దేవయాని (ఏమీ మాట్లాడకుండా) తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శర్మిష్టకు వరసగా అనువు, పూరువు అనే మరో ఇద్దరు కొడుకులు కలిగారు.

దేవయానికి శర్మిష్టలో హఠాత్తుగా వినయశీలాలు, గౌరవనీయత కనిపించడం విశేషం. దానినలా ఉంచితే, శర్మిష్ట సమాధానం గమనించండి…ఎవరో మహాముని వచ్చి, ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకునిచ్చా’ డని చెబుతోంది. పైన రాజుల భార్యల విషయంలో చెప్పుకున్నదే ఇక్కడా వర్తిస్తుంది.  శర్మిష్ట ఋతుకాలం లో ఉన్నప్పుడే ఆ ‘మహాముని’ ఆమెకు కొడుకునిచ్చి వెళ్ళాడు. అది అబద్ధమైనా, అది వెల్లడిస్తున్న ఆనవాయితీ అబద్ధం కాదు. ఆ ఆనవాయితీ దేవయానికి కూడా తెలుసు. అందుకే శర్మిష్ట అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది. నిజానికి ‘నీకు కొడుకు ఎలా పుట్టా’ డన్నదే దేవయాని ప్రశ్న అయుంటుంది. యయాతి వల్ల కలిగాడా అన్నది తేల్చుకోవడమే ఆమెకు కావాలి.  యయాతి వల్ల కాకుండా, ఇంకెవరి వల్ల శర్మిష్టకు కొడుకు పుట్టినా దేవయానికి అభ్యంతరం లేదు, అందులో ఆశ్చర్యమూ లేదు.

ఇక, ఆమె ప్రశ్నలోని మిగతా భాగమంతా కథకుని కల్పన. ఎందుకంటే, ఋతుకాల ప్రాధాన్యాన్ని వెల్లడించే ఆ ఆనవాయితీ చర్చలోకి రాకూడదు. అందుకే, దేవయాని నోట తన మాటలు పలికిస్తూ ఆ ఆనవాయితీపై  కథకుడు ముసుగు కప్పుతున్నాడు. కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే:  ఆ ఆనవాయితీ గురించి తెలియని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు అతడు కథ చెబుతున్నాడు. లేదా, తనే ఆ ఆనవాయితీని సరిగా పోల్చుకోలేకపోయీ ఉండచ్చు.

శర్మిష్ట కొడుకులు ముగ్గురూ, ఒంటి మీద ఆభరణాలు లేకపోయినా సహజకాంతితో మూడు అగ్నుల్లా ప్రకాశిస్తూ తన ముందు ఆడుకుంటుండగా వినోదిస్తున్న యయాతి దగ్గరికి; శర్మిష్టనూ, ఇతర దాసీ కన్యలనూ వెంటబెట్టుకుని వైభవం చాటుకుంటూ శచీదేవిలా దేవయాని వచ్చింది. తేజస్సు ఉట్టిపడుతుండగా, యయాతి ప్రతిబింబాల్లా ఉన్న ఆ ముగ్గురినీ చూసి ‘ఈ పిల్ల లెవ’ రని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేదు. ‘మీ తల్లిదండ్రు లెవ’ రని ఆ పిల్లలనే అడిగింది. వారు లేత చూపుడు వేళ్ళతో యయాతినీ, శర్మిష్టనూ చూపించారు.

తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవల్ల సంతానం పొందాడని దేవయానికి తెలిసిపోయింది. కోపమూ, దుఃఖమూ ఆమెను ముంచెత్తాయి. ఈ ‘దానవి’తో సంబంధం పెట్టుకుని యయాతి తనను నిలువునా వంచించాడనుకుంది. తక్షణమే పుట్టింటికి వెళ్ళి, తండ్రి పాదాలమీద పడి దీర్ఘనేత్రాలనుంచి ఉబికివచ్చే జలధారలతో వాటిని కడిగింది.

యయాతి కూడా బతిమాలుతూ దేవయాని వెంటే వెళ్ళి శుక్రుని దర్శించి నమస్కరించాడు.  ‘ధర్మం తప్పి ఈ రాజు రాక్షస పద్ధతిలో ఆ రాక్షసిమీద అనురక్తుడై ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. నన్ను అవమానించాడు’ అని దేవయాని గద్గదస్వరంతో అంది. శుక్రునికి కోపం వచ్చింది. ‘యవ్వన గర్వంతో కళ్ళు మూసుకుపోయి నా కూతురికి అప్రియం చేశావు కనుక నువ్వు వృద్ధాప్యభారంతో కుంగిపోతావు’ అని యయాతికి శాపమిచ్చాడు.

అప్పుడు, ‘ఋతుమతియైన భార్య కొడుకునిమ్మని భర్తను కోరినప్పుడు అతడు నిరాకరించి ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యా పాపం సంభవిస్తుందని పెద్దలు చెప్పలేదా, దానికి భయపడే ఆ మానవతి కోరిక తీర్చాను, ఇందుకు ఆగ్రహించడం న్యాయమా’ అని యయాతి ప్రశ్నించాడు. ఆ వెంటనే గడుసుగా, కూతురిపై శుక్రునికి ఉన్న మమకారానికి గురి పెడుతూ, ‘ఈ దేవయానిపై నాకింకా కోరిక తీరలేదు. ఇప్పుడే వృద్ధాప్యాన్ని ఎలా భరించను?’ అన్నాడు. ఆ మాటకు శుక్రుడు మెత్తబడ్డాడు. ‘అలా అయితే నీ వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. విషయసుఖాలతో తృప్తి చెందిన తర్వాత తిరిగి వాడి యవ్వనాన్ని వాడికి ఇచ్చేసి, నీ వృద్ధాప్యాన్ని తిరిగి పుచ్చుకో. ఇంకో విషయం, నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నవాడే నీ రాజ్యానికి అర్హుడు, వంశకర్త అవుతాడు’ అన్నాడు.








Tuesday, 18 September 2018

దండాలయ్యా ఉండ్రాళ్లయా!






దండాలయ్యా... ఉండ్రాళ్లయా..!

అద్వితీయుడూ ఆనంద స్వరూపుడూ అయిన వినాయకుడు జన్మించిన రోజే వినాయక చవితి. వినాయకుడంటే నాయకుడు లేనివాడనీ తనకు తానే నాయకుడనీ అర్థం. అటువంటి శక్తిసంపన్నుడూ గణాలకూ అధిపతీ ప్రథమ పూజ్యుడూ అయిన పార్వతీసుతుడిని స్మరించినంతనే విఘ్నాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. వేడుక ఏదైనా ప్రథమ పూజ గణనాథుడికే చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి గణపయ్య పుట్టిన రోజంటే (13 వినాయక చవితి) ఊరూవాడా సంబరమే.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!


మెలితిరిగిన తొండంతో మహా రూపంతో కోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో వెలుగొందే ఓ దేవదేవా, మొదలు పెట్టే ప్రతిపనిలో తోడుగా నిలిచి ఎలాంటి ఆటంకాలూ ఎదురుకాకుండా చూడు తండ్రీ... అంటూ వినాయకుడిని ప్రార్థించిన తర్వాతే ఏ పనినైనా మొదలుపెట్టడం మన సంప్రదాయం. అలాంటి విఘ్నాధిపతి పుట్టింది భాద్రపదశుద్ధ చవితి రోజునే. అందుకే వినాయకచవితిని చిన్నాపెద్దా పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఓ వైభవోపేతమైన పండగలా జరుపుకుంటారు. గణనాథుని రూపం నుంచి వాహనం వరకూ, నివేదన నుంచి నిమజ్జనం వరకూ ఈ పండగలోని ప్రతిదీ విశేషమైందే...

ఎలా పూజించినా...
రాతి వినాయకుడిని పూజిస్తే జ్ఞానం, రాగి విగ్రహాన్ని అర్చిస్తే ఐశ్వర్యం, వెండి గణేశుడిని కొలిస్తే ఆయుష్షు, సువర్ణ మూర్తిని పెట్టుకుంటే సంకల్పసిద్ధీ లభిస్తాయట. అయితే మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను పూజిస్తే వీటన్నింటితోపాటు సకల శుభాలూ ఒనగూరుతాయని గణేశ పురాణం చెబుతోంది. వినాయకుడు బ్రహ్మచారి అన్నది ఒక వాదన. ఆయనకు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారన్నది మరో నమ్మకం. ఈ సిద్ధి, బుద్ధి ఆవిర్భావం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా వారు కేవలం విఘ్నాధిపతి అభయానికి ప్రతిరూపాలే. బుద్ధి లౌకిక జ్ఞానానికీ, సిద్ధి ఆధ్యాత్మిక జ్ఞానానికీ చిహ్నాలు. కొన్ని చోట్ల వినాయకుడి సహితంగా వృద్ధి అనే మరో భార్యనూ పూజించే సంప్రదాయం ఉంది. బాహ్యంలో ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నా వీటన్నింటి అంతరార్థం వినాయకుడి తత్వాన్ని ఆకళింపజేసుకుని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడమే.

అపురూపం ఆ రూపం
చాటంత చెవులూ చిన్ని కళ్లూ పెద్ద బొజ్జా... ఇలా చూడటానికి విభిన్నంగా కనిపించే వినాయకుడి రూపంలో ఒక్కో అవయవం ఒక్కో సుగుణానికి ప్రతీక. ఏనుగు తల ఉన్నతమైన ఆలోచనలనీ, చిన్న కళ్లు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలనీ, పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలనీ, పెద్ద బొజ్జ నిశ్చింతగా జీవించమనీ... సూచిస్తాయి. జ్ఞానానికి సరస్వతీ దేవి స్త్రీరూపమైతే వినాయకుడు పురుష స్వరూపం. అందుకనే వ్యాసభగవానుడు భారతాన్ని రచించాలని అనుకున్నప్పుడు, దాన్ని రాయడానికి వినాయకుడు తప్ప మరెవ్వరూ ముందుకు రాలేకపోయారు. అర్థం చేసుకున్నాక కానీ రాయకూడదంటూ వ్యాసుడు నియమాన్ని పెట్టినా గణనాథుడు బెదరలేదు. వ్యాసుడు చెప్పే వేగానికి ఏమాత్రం తగ్గకుండా మహాభారత రచన సాగేందుకు వినాయకుడు తన దంతాన్నే కలంగా మార్చి పంచమవేదాన్ని దిగ్విజయంగా పూర్తిచేశాడు. తల్లికి ఇచ్చిన మాటకోసం తండ్రిచేతిలో హతమై గజముఖుడయ్యాడు. కుమారస్వామితో పోటీపడి తండ్రి గణాలకు అధిపతిగా మారాడు. ఇలా అనేక సందర్భాల్లో వినాయకుడు తన సూక్ష్మబుద్ధిని ఉపయోగించి విజయం సాధించాడు. గెలవాలన్న తపన ఉండాలే కానీ మనలోని లోపాలను అధిగమించడం పెద్ద సమస్యేమీ కాదని లోకానికి చాటిచెప్పాడు.

నెలంతా పండగలే
ఒక్క చవితే కాదు భాద్రపద మాసంలోని ప్రతి తిథీ ప్రత్యేకమే. వినాయక చవితి తర్వాత వచ్చే పంచమి రుషిపంచమి. ఆ రోజు సప్తర్షులను పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయంటారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథుల్లో ఆయా దేవతలను పూజిస్తారు. భాద్రపద ఏకాదశినే పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిల్లుతాడట. అందుకే ఆ రోజుకి, పరివర్తన ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు. ఆ తర్వాతి రోజు వామన జయంతి. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే!  పితృదేవతలకు ప్రీతికరంగా భావించే మహళయపక్షాలూ ఈ మాసంలోనే వస్తాయి.గౌరీపూజైనా లక్ష్మీనోమైనా శివుడి అభిషేకమైనా, మహావిష్ణువు వ్రతాలైనా గణపయ్యను ఒక్కసారి ఆవాహనం చేయందే ప్రారంభం కావు. అలాంటి ప్రథమ పూజ్యుడి పుట్టిన రోజున ఆయన్ను శరణువేడడం సర్వ శుభదాయకం!



జపాన్‌ వినాయకుడు
జపాన్‌ బౌద్ధమతంలో కొందరు హిందూదేవతలు వేర్వేరు పేర్లతో కనిపిస్తుంటారు. వారిలో వినాయకుడు ఒకడు. ఆయన్నిక్కడ విఘ్నాలు కలిగించి, తొలగించేవాడిగా చూస్తారు. అతి శక్తిమంతుడు కాబట్టి తీవ్ర ఉద్వేగాలున్నవాడిగానూ భావించి భయపడుతుంటారు. మనదేశంలోలా వినాయక విగ్రహాలని ఎక్కడా బహిరంగంగా ఉంచరు. ఆలయ అర్చకులు కూడా దగ్గరకు వెళ్లి చూడటానికి సాహసించరు. అర్చకులు మనలాగా స్వామివారికి దగ్గరగా వెళ్ళకుండా విగ్రహానికి దూరంగా ఉండి వజ్రయాన బౌద్ధపద్ధతిలో పూజలు చేస్తారు. వినాయకుణ్ణి ఇక్కడ కాంగిటెన్‌ అని పిలుస్తారు. జపాన్‌ బౌద్ధ పురాణం ప్రకారం... వినాయకుడి తల్లి ఉమ మూడువేలమంది పిల్లలకి జన్మనిచ్చిందట. తన ఎడమవైపు 1500 మంది. వాళ్లలో ప్రథముడు వినాయకుడు. కుడివైపు 1500 మంది. వాళ్లలో ప్రథముడు ఇదాటెన్‌(సుబ్రహ్మణ్యస్వామి). కానీ వినాయకుడు ప్రతికూలతల దేవుడు. విఘ్నాలు కలిగిస్తాడు. కుమారస్వామి మంచిచేతల వేల్పు. వినాయకుణ్ణి మంచిదారిలో నడిపించాలని కుమారస్వామి వినాయకుడి స్త్రీరూపంగా అవతరిస్తాడు! ఆ వినాయకి వినాయకుడిని చేపట్టి అతణ్ణి మంచివాడిగా, విఘ్నాలు దూరం చేసేవాడిగా మారుస్తుంది. అందుకే... వినాయకుడికి (కాంగిటెన్‌)కి సంబంధించిన విగ్రహాలన్నీ ఆడ, మగ వినాయకుల(భిన్న ధ్రువాల) ఆలింగన భంగిమలోనే కనిపిస్తాయి! అన్నట్టు, మన వినాయకుడికి మోదకాలంటే ఇష్టం కదా... అక్కడి గణపయ్యకేమో ముల్లంగి దుంపలంటే ప్రీతి. వాటిని సమర్పించే ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు!

Friday, 14 September 2018

మది నిండా మహా గుణాధిపతి






మది నిండా మహా గుణాధిపతి

గణపతి అందరి దైవం.. అందరికీ ఆనందాన్ని పంచే దైవం. విఘ్నాల్ని తొలగించి, విజయాల్ని అనుగ్రహించే దైవం వినాయక చవితి నాడు పూజ చేసుకొని, వ్రతకల్పం చదువుకొని అక్షతలు వేసుకోవడం, వినాయకుడి దీవెనలు అందుకోవడం ఇంటింటా జరిగేదే!

గణపతి నవరాత్రులంటే తొమ్మిది రోజుల పాటు కాలక్షేపం కోసం నిర్వహించే ఉత్సవాలు కాదు. హోరెత్తించే పాటలతో, విచిత్ర నృత్యవిన్యాసాలతో కొనసాగే తంతూకాదు. మనదైన ఘన వారసత్వాన్ని కొనసాగించడానికి ఉపకరించే సామాజిక, సామూహిక ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియ. ‘తమసోమా జ్యోతిర్గమయ’.. అంటూ చీకటి నుంచి వెలుగు వాకిళ్ల వైపు సాగడానికి ఈ పండగను ఊతంగా చేసుకోవాలి.


తొలిపూజలందుకునే ఇలవేలుపుగా గణపతికి పేరు. ఈయనను దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. ఇతిహాసాలు ‘గణానాం త్వ గణపతిం హవా మహే’ అని పూజల్లో ఆయనకు అగ్రస్థానమిచ్చాయి. శివ, విష్ణు కల్యాణాల్లో సైతం తొలుత గణపతిని కొలవడం ఆనవాయితీ. ఇళ్లల్లో జరిగే సాధారణ నోముల నుంచి రాజుల అశ్వమేధయాగాల వరకు మొదటి పూజ ఆయనదే. రుగ్వేదంలోని ‘కవింకవీనామ్‌...’ అనే రుక్కు వినాయకుణ్ణి విఘ్నాధిపతిగానే కాకుండా చదువుల గురువుగా కూడా వర్ణించింది. ‘కోరిన విద్యలకెల్ల ఒజ్జయై యుండెడి పార్వతీతనయ, ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌’ అని ప్రార్ధించింది.

గణపతి అంటూ ఆ అధినాయకుడిని అందరూ ఆహ్వానిస్తారు. అలా స్వాగతించకుండా ఎవరూ ఏ శుభకార్యానికీ శ్రీకారం చుట్టరు. నిజానికి గణపతితో భక్తులకు ఇంత సాన్నిహిత్యం ఏర్పడడానికి గణాలే కారణం. ఇక్కడ గణం అంటే ఇంద్రియం అని అర్థం. శరీరం, కర్మ, జ్ఞానేంద్రియాలు, మనసు మనిషి మనుగడకు మూలాలు. పంచభూతాల ఏకత్వం వల్ల శరీరం ఏర్పడింది. తమో గుణం వల్ల స్థూల శరీరం, రజో గుణం వల్ల కర్మేంద్రియాలు, సత్వ గుణం వల్ల జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయని చెబుతారు. నోరు, చేతులు, కాళ్లు వంటివి కర్మేంద్రియాలు. అవి మాట, పని వంటి వాటికి ఉపయోగపడతాయి. చెవులు, చర్మం, నాలుక, నాసికల... జ్ఞానేంద్రియాలు... వినడానికి, తెలుసుకోడానికి, చూడడానికి, రుచి, వాసన గ్రహించడానికి అవసరమవుతాయి. శరీరం రథం. ఇంద్రియాలు గుర్రాలు. బుద్ధి సారథి. కోరికల నిలయమైన మనసు విషయ సుఖాల కోసం జీవన రథాన్ని పెడదోవ పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి చురుగ్గా ఉండాలి. ఆ రథాన్ని రహదారిపైకి మళ్లించాలి. ఇలా జరగాలని ...ఇంద్రియాలపై విజయం సాధించాలని చేసే పూజలే వినాయకుడి ఆరాధనలు. నవరాత్రులూ ప్రార్థించడం వల్ల గణపతి కటాక్షం కలుగుతుంది. మనసు శుద్ధమవుతుంది. నిర్మల జీవనం సాధ్యమవుతుంది. వినాయక చవితినాడు ఈశ్వరతత్వాన్ని విఘ్ననాశక స్వరూపంగా ఆరాధిస్తాం. విఘ్నాలు అంటే అవరోధాలు. విద్యలో, కార్యంలో, అభ్యుదయంలో ఆధ్యాత్మికతలో ఏర్పడే అడ్డంకులు. కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుని అనుగ్రహంతో ఈ అవరోధాలను అధిగమించడానికే విఘ్నేశ్వరారాధన.

శ్రద్ధగా వినండి...
గణేశుడు ప్రణవ స్వరూపుడు. వినాయకుడి రూపం సంస్కృత లేదా దేవనాగరి లిపిలో ఉన్న ఓంకారంతో సరిపోలుతుంది. ఏకదంతుడిని ఏకాగ్రతతో గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. ప్రణవాక్షరంలో గుండ్రంగా ఉండే కింది భాగం వినాయకుడి పొట్టకు పోలిక. లంబోదరుడు అనడానికి ఉదాహరణ. కుడివైపు తిరిగి ఉండే ప్రణవాక్షరపు కొమ్ము గణేశుడి తొండానికి, అర్ధ చంద్రాకారం, అందులోని బిందువులు ఫాలనేత్రానికి గుర్తులు. వక్రతుండం, అర్ధచంద్రుడు, ఫాల నేత్రం ఇలా వీటన్నిటినీ కలిపి చూస్తే ఓంకారం రూపు దిద్దుకుంటుంది. ప్రణవం మనసుకు ఏకాగ్రతనిస్తుంది. ఇది సాధకులకు, విద్యార్థులకు ఎంతో అవసరం. ఆధ్యాత్మికంగా ఇదెంతో ముఖ్యమైన విషయం. సాధకులుగానీ, విద్యార్థులుగానీ ముందు గురువు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. ఏకాగ్రతతో వినాలని చెప్పడానికి పెద్ద చెవులు, కండబలంతో పాటు బుద్ధిబలం కావాలని చెప్పడానికి వక్రతుండం సూచికలు. ఏనుగు తన తొండంతో ఎంతో బరువైన వస్తువులతో పాటు నేలపై పడ్డ సూదిని కూడా తీయగలదు. స్థూల, సూక్ష్మ అంశాలన్నిటినీ గ్రహిస్తేనే విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయని చెప్పడానికి వినాయకుడి రూపం ఓ గొప్ప చిహ్నం.

గీతాచార్యుడుగా మారిన వేళ...
నారాయణుడు నరుడికి చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం నేపథ్యంగా ఉద్భవించిన అమృతభాండమనే విషయం అందరికీ తెలిసిందే. గణేశుడు తన భక్తుడైన వరేణ్యుడికి గీతను ఉపదేశించిన ఘట్టం గణేశపురాణంలో ఉంది. భగవద్గీతలాగానే కర్మ,జ్ఞాన,ఉపాసనా మార్గాలను బోధిస్తున్న ఈ గీత మన ధార్మికతలో ఉన్న గొప్పతనాన్ని, ఏకత్వాన్ని చాటుతుంది. పదకొండు అధ్యాయాల్లో విశ్వజనీన జ్ఞానాంశాలను ఒక ఆచార్యుడిగా గణపతి బోధించిన తీరు అద్భుతం. అందులోని ముఖ్యాంశాలు...

* యోగం అంటే లౌకిక సుఖాలను, భోగాలను, సంపదలను సాధించడం కాదు. అలాగే పరలోక సుఖాలను అనుభవించడం కూడా కాదు. దేని వల్ల లౌకిక విషయ లాలస దూరమవుతుందో, సంసార తాపత్రయం దూరమవుతుందో అదే యోగం. ఇంద్రియాలను జయించి, దయ కలిగిన హృదయంతో జగతిని పవిత్రం చేసేవారు యోగులు.

* శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, నేను (గణపతి)... ఒక్కటే అని గ్రహించడాన్నే అభేద బుద్ధి అంటారు. అలాంటి బుద్ధి కలిగి ఉండడమే యోగం. సర్వ దేవతలు, లోకాలు నా స్వరూపాలే. మంచి కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. దీనివల్ల అభేద జ్ఞానం ఉదయిస్తుంది.

* మనిషి తప్పనిసరిగా సత్సాంగత్యం కోసం ప్రయత్నించాలి. దానివల్ల సుగుణ సంపద పెంపొందుతుంది. ఆపదలు దూరమవుతాయి.

* జ్ఞానంకన్నా పవిత్ర వస్తువు లేదు. ఇంద్రియ నిగ్రహం, భక్తి, శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. దీనివల్ల ముక్తి కలుగుతుంది. భక్తి, శ్రద్ధ లేని సందిగ్ధ చిత్తుడు శుభాలను పొందలేడు.

* మనసు నిలకడకు, పాపాలు పటాపంచలు కావడానికి అద్భుతమార్గం ప్రాణాయామం. ఉపాసన, అభ్యాసాలతో కూడా నన్ను పొందడం సులభం.

* నిర్మలమైన భక్తి ఉన్నవాడు ఏ జాతివాడైనా సర్వాధికుడే.

* భాద్రపద శుక్ల చతుర్థినాడు నాలుగు చేతులున్న నా రూపాన్ని కొలిచే వారిని అనుగ్రహిస్తాను.

ఎలుక ఎందుకు?
విఘేశ్నరుని రూపంలో మరో విశేషం ఎలుక వాహనం. ఇంత భారీకాయుడు ఎలుకపై స్వారీ చేయడం కూడా ఆధ్యాత్మిక రహస్యంలో భాగంగానే చెబుతారు. ఎలుకను మూషికం అంటారు. ముష-స్తయే అనే ధాతువులోంచి పుట్టిన పదమిది. ఇది దొంగ అనే అర్థాన్నిస్తుంది. మానవుడిలోని దొంగ బుద్ధికి ఎలుక ప్రతీక. వినాయకుడు అధిరోహించిన ఎలుక పేరు అనింద్యుడు. అంటే నింద పడని వాడని అర్థం. తస్కరణ బుద్ధి నుంచి బయటపడిన అనింద్యుడు భగవంతుడి వాహనమయ్యాడు. సంస్కరించబడిన జీవి ఏదైనా భగవంతుడికి చేరువ అవుతుందనడానికి ఇదో నిదర్శనం.

పూర్ణత్వమే... ప్రసాదం
గణపతి ఆనంద స్వరూపుడు. మోదక ప్రియడు. ఒక కార్యం ప్రారంభించేటప్పుడు భయం, సంకోచం, సంశయం, ఉద్వేగం వంటివి లేకుండా ఉత్సాహంగా సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని ఆమోదం అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే సంతోషాన్ని ప్రమోదం అని భావించవచ్చు. ఈ రెండు ఆనంద భావనలే గణపతి శక్తులు. ఉండ్రాళ్లు, లడ్లు, వంటివి గణపతికి నైవద్యాలుగా ఆ తర్వాత మనకు ప్రసాదాలుగా లభిస్తాయి. ఇవి పూర్ణత్వానికి సంకేతాలు. ఇక్కడ వినాయకుడు పరిపూర్ణమైన ఆనందాన్ని మనకు ప్రసాదంగా ఇస్తున్నాడని అర్థం.



32 మూర్తులు

గణనాయకుడు బహురూపధారి. శివ, స్కాంద, ముద్గల పురాణాల్లో ఆయన రూపురేఖలకు, ప్రసాదించే ఫలితాలకు అనుగుణంగా అనేక పేర్లున్నాయి. వాటిలో 32 పేర్లను స్థిరీకరించారు. అనేక బీజాక్షరాల సమ్మేళనంతో, మూల మంత్రాలతో వివరించిన గణపతి తంత్రం ఈ గణపతుల పైనే ఆధారపడి ఉంది.

బాల గణపతి
ఎర్రటి రంగులో శోభిల్లుతుంటాడు. బుద్ధి, వివేకం, జ్ఞానం, చురుకుదనం ప్రసాదిస్తాడు. ఈ స్వామిని కొలిస్తే పిల్లలకు ఉత్సాహం, చదువుపై ఆసక్తి పెరుగుతాయి.

తరుణ గణపతి
మధ్యాహ్నకాలపు సూర్యుడి వర్ణంలో మెరిసిపోతుంటాడు భక్తులకు పట్టుదలను, దీక్షను ప్రసాదిస్తాడు.

భక్త గణపతి
తెల్లని వర్ణంలో చల్లని వెన్నెల వెలుగులను కురిపిస్తుంటాడు. భక్తజనావళి హృదయాలలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాడు.

వీర గణపతి
కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

శక్తి గణపతి
సాయం వేళలో సూర్యుడిలా దర్శనమిస్తాడు. భక్తులను సర్వశక్తి సంపన్నులను చేస్తాడు.

ధ్వజ గణపతి
తెల్లని వర్ణంలో శోభిల్లుతుంటాడు. ఈ గణపతిని పూజిస్తే.. తెలివితేటలు వృద్ధి చెందుతాయి.
సిద్ధి (పింగళ) గణపతి
బంగారు పసిమి వర్ణంలో మెరిసిపోతుంటాడు. సకల కార్యసిద్ధిని ఈయన అనుగ్రహిస్తాడు.
ఉచ్చిష్ట గణపతి
ఇది సర్వోత్తమమైన గణపతి స్వరూపం. నల్లని వర్ణంలో ఉంటాడు. ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వల్ల ధనధాన్యవృద్ధి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి.
విఘ్న గణపతి
ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు. త్రిమూర్తి స్వరూపుడీయన. విఘ్నాలను దాటిస్తాడు. ప్రమాదాలు, అవరోధాలు ఎదురుకాకుండా చూసి విజయం కలిగిస్తాడు.

క్షిప్ర గణపతి
ఈయన భోళా వినాయకుడు. అతి శీఘ్రంగా స్పందించి భక్త కోటిని కరుణిస్తాడు. ఈ గణపతి చాలాకాలంగా నెరవేరక బాధ పెడుతున్న కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తాడు.

హేరంబ గణపతి
విలక్షణమైన మంత్రమూర్తి. పంచముఖుడు. నాలుగు తలలు.. నాలుగు దిక్కులు చూస్తుండగా.. వాటిపై ఐదో తల ఉంటుంది. దీనులను కాపాడుతుంటాడు.

లక్ష్మీ గణపతి
ఇరుతొడలపైనా ఉభయ దేవేరులు కుర్చొని ఉంటారు. ప్రార్థించే భక్తులకు ధనసంపదలనిస్తాడు.

మహా గణపతి
ఈయన సమగ్రమూర్తి. ఈ గణపతి.. కీర్తిప్రతిష్టలను, సంఘంలో పలుకుబడిని అనుగ్రహిస్తాడని నమ్మకం..

విజయ గణపతి
కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. సర్వకార్యాల్లోనూ సాఫల్యతనిస్తాడు.

నృత్య గణపతి
ఈ గణపతిని తాండవ గణపతి అని కూడా పిలుస్తారు. పసిబాలుడి రూపంలో.. ఆనంద తాండవం చేస్తుంటాడు. కొలిచిన వారికి సంతృప్తినీ, మనశ్శాంతిని ఇస్తాడు.

ఊర్ధ్వ గణపతి
పసుపు పచ్చని శరీరచ్ఛాయ కలిగి ఉంటాడు ఎడమ తొడపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని ఉంటాడు. తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం చేస్తాడు.

ఏకాక్షర గణపతి
ఏకాక్షర గణపతి భక్తుల చింత, శోకం, అజ్ఞానం పోగొడతాడు. ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తాడు.

త్య్రక్షర గణపతి
విఘ్నాలు తొలగించి, సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్య్రక్షర గణపతి.

వర గణపతి
ఈయన సులభ ప్రసన్నుడు, కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు.

క్షిప్ర ప్రసాద గణపతి
ఈ గణపతిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు, పదవులు కలుగుతాయి.

హరిద్రా గణపతి
పసుపు రంగులో దర్శనమిస్తాడు. వివాహాది శుభకార్యాలలో తొలుత ఈయన్నే పూజిస్తారు. ఈ దైవం విఘ్న నివారకుడు.

సృష్టి గణపతి
దైనందిన కార్యక్రమాలు, సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి.

ఏకదంత గణపతి
మహా భారతం రాస్తుండగా గంటం విరిగిపోతే.. దంతం పెరికి దానితో రాత కొనసాగించాడట గణపతి. అందుకే ఏకదంతుడయ్యాడని పురాణ కథనం. రాక్షస ప్రవృత్తుల్ని, భయాల్ని తొలగిస్తాడు.

ఉద్దండ గణపతి
దుష్ట శక్తులను, శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యాన్నిస్తాడీయన.

రుణ విమోచన గణపతి
సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడీ స్వామి.

ద్విముఖ గణపతి
రెండు ముఖాలు కుడి ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు.

డుండి గణపతి
కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ గణనాథుడు భక్తులకు శుభాలను, సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు.

త్రిముఖ గణపతి
అకార, ఉకార, మకారాల స్వరూపంగా త్రిముఖ గణపతి కనిపిస్తాడు. దీనులను, నిస్సహాయులను ఆదుకుంటాడీ స్వామి.

సింహ గణపతి
భక్తులను ధైర్యవంతులుగా చేసి, ఆత్మవిశ్వాసంతో వారిని ప్రగతి పథంవైపు నడిపిస్తాడు సింహ గణపతి.

దుర్గ గణపతి
సకల పాపాలను దూరం చేసి, ఉపాసకులను కంటికి రెప్పలా కాపాడతాడు.

యోగ గణపతి
ఈ గణపతి యోగమూర్తి. మూలాధార స్థితుడైన జప, తప, ధ్యాన తత్పరుడు. బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక. ఆయురారోగ్య ప్రదాత.

సంకటహర గణపతి
భక్తుల సంకటాలన్నీ హరించే కరుణమూర్తి. ఆనందోత్పాహాలతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి.


- వేదప్రియ, డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌, డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు



Thursday, 13 September 2018

వినాయక విహారం

వినాయక విహారం


వినాయకుడు చవితి పండగ నాడు భూలోకానికి విహారానికి వస్తే? 
తన జనని పార్వతీదేవికి ఇక్కడి వింతలు విడ్డూరాలు చూపిస్తే..
నారదుడు ఆ ట్రిప్‌కు లైవ్‌ రిపోర్టింగ్‌ అందిస్తే.. చదివిన వారికి పుణ్యమూ, ఫలమూ దక్కినట్టే కదా!
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్‌
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే‘‘
కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం వెదికాడు వ్యాసుడు. అప్పుడాయన మదిలో వినాయకుడు మెదిలాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. 

అనుకున్నదే తడవుగా, వినాయకుడి దగ్గరకు స్వయంగా వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు వ్యాసభగవానుడు. 

అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసువంచి, ‘మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు.

‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం ఈ శుభకార్యాన్ని’ అన్నాడు బాదరాయణుడు. 

లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, మనస్సులో ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. 

వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం కూడా అంతే వేగంగా పరుగులు తీస్తోంది, భారత రచన సాగింది. రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. శ్రీమన్మహాభారతం నిర్విఘ్నంగా పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడికి నమస్కరించి, ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసంలో ఉండే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు వారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని ఆనందించారు ఆది దంపతులు.
‘‘అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో అందమైన భారతాన్ని ఆయనకు లేఖకుడిగా ఉన్న కారణంగా అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. ఇంతటి మహేతిహాసాన్ని మరెవ్వరూ కొన్ని యుగాలు గడిచినా రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. నా రచనా ప్రావీణ్యాన్ని చూసి మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొంతసేపు భూలోకంలో సంచరించాలని ఉంది.  నా పుట్టినరోజు వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. నీ అనుమతితో భూలోకంలో సంచరించాలనుకుంటున్నానమ్మా’ అన్నాడు గణనాయకుడు.

అందుకు పార్వతి, ‘నాయనా! నాకు నీ వెంట రావాలని ఉంది. నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో భూలోకవాసులు చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా చూసి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి.

‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, ఆమెను తన వాహనం మీద కూర్చుండబెట్టుకుని బయలుదేరాడు వినాయకుడు.

వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు నారదుడు మరింత సమాచార సేకరణ కోసం.‘నాయనా! నిన్ను రకరకాల వేషాలతో విగ్రహాలుగా తయారు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది పార్వతి.
వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నాకు ఏది కావాలన్నా నిన్నే అడుగుతాను, అలాగే నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు. అవునా. ఎందుకంటే నాకు నీ దగ్గర చనువు, నీకు నా మీద వాత్సల్యం ఉన్నాయి కాబట్టి. ముందుగా నీవు నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు. అందుకే  అందరూ నన్ను మట్టితో రూపొందించాలి. అయితే, కొందరు బంగారంతోనూ నన్ను  తయారుచేస్తారు. నన్ను వారి ఇంటి బిడ్డగా చూసుకుంటారు. సాధారణంగా మనకు చనువైన వారి దగ్గరే మనకు కావలసినవి అడుగుతాం, చిలిపిచేష్టలు ప్రదర్శిస్తుంటాం. భూలోక వాసులకు నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో చనువు ఉంది కాబట్టే నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! కుంచె పట్టిన ప్రతి చిత్రకారుడు ఈ  మాసమంతా నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాసేవారు నన్ను ఆధారంగా చేసుకుని హాస్యకథలు రాస్తూనే ఉంటారు’ అన్నాడు వినాయకుడు.

‘‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్‌ వినాయకుడిగా కొలుస్తారు, మరికొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. సంగీతాభిలాష ఉన్న కొందరు, నవవినాయకులుగా తొమ్మిది రకాల వాద్యపరికరాలతో నిన్ను సంగీత వినాయకుడిగా చూపుతున్నారు. కొందరు నిన్ను ఓంకార స్వరూపంగా తలుస్తున్నారు, కొందరు నువ్వు క్రికెట్‌ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు, నిన్ను వెంకటేశ్వరునిగా మరికొందరు చిత్రీకరిస్తుంటారు. కొందరు నట వినాయకుడిగా చిత్రీకరించారు’ అని ఒక్కొక్క రూపాన్ని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే వినాయకుడు అడ్డుతగిలి, ‘అంతేనా అమ్మా!  కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలో ఉన్న సిద్ధి, బుద్ధి అనే లక్షణాలను నా భార్యలుగా చేశారు. ఎవరు ఏం చేసినా, వారంతా నా మీద ప్రేమతో చేసినట్లే భావన చేశాను’ అంటుండగా మధ్యలో నారదుడు ప్రవేశించి, ‘అయ్యా! వినాయకా! మీరు చూసినవాటి కంటె నేను మరిన్ని రూపాలు చూశాను. మిమ్మల్ని హనుమ రూపంలో చూడాలనే కుతూహలంతో కొందరు మీ చేతితో గద ఉంచారు. మరికొందరు సర్ప వినాయకుడిని చేశారు, కొందరైతో మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. మరికొందరు ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు. మరో అడుగు ముందుకు వేసి లక్ష్మీదేవిగా కూడా మిమ్మల్ని రూపొందించుకున్నారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు.

నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నాకు నచ్చేది ఒకటేనయ్యా! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ఇంటి కుమారుడిగా భావించి, వారికి కావలసిన విధంగా నన్ను అలంకరించారు. మంచి తివాసీ మీద పడుకోబెడతారు, పిల్లలు తినే మిఠాయిలతో నన్ను తయారు చేస్తారు, రకరకాల పూసలతో రూపొందిస్తారు. విలాసంగా కూర్చున్నట్లుగా కొందరు నన్ను చెక్కుతారు. ఎవరు ఎలా అలంకరించినా, ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు.

ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఇవన్నీ సామాన్యుల ఆలోచనలైతే, ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు నాయనా! నిన్ను పదహారు మంది గణపతులుగా పేర్కొన్నారు. నిరుక్త్త గణపతి నుంచి మళ్లీ నిరుక్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం గణనాథా! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు అని కొందరు నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు.

వినాయకుడు అందుకు తాను ఏమీ చేయలేనంటూ, జగజ్జనని అయిన తన తల్లితో...  నాది ఒక్కటే కోరిక అమ్మా.. నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తిపాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. మనం తల్లి దగ్గర ఒకలా, తండ్రి దగ్గర ఒకలా, పిల్లల దగ్గర ఒకలా మాట్లాడతాం. అలాగే దేవుడి పందిళ్లలో కొన్ని పాటలు వేయకుండా ఉంటే మనకు మంచిది అనిపించింది. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నారని నలుగురూ నా భక్తుల గురించి అనుకోవడం నాకు బాధగా ఉందమ్మా. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా ఆశీస్సులు అందజేస్తున్నాను’’ అంటూ ముగించాడు విఘ్నేశ్వరుడు. 
ప్రసాదం...
అమ్మా! నువ్వు ఎప్పుడూ నా ప్రసాదం గురించి, ‘రుచిపచిలేని ప్రసాదం’ అని బాధపడుతుంటావు. శివాలయంలో అంటే నా తండ్రి నివసించే ఆలయంలో కేవలం తీర్థం మాత్రమే ప్రసాదంగా ఇస్తారు కదా! నా తండ్రి జన్మదినం నాడు భక్తులంతా ఉపవాసం కూడా ఉంటారు. నా తండ్రి సామాన్య జీవితం గడప డానికే ఇష్టపడతాడు. నేను కూడా అంతేనమ్మా. అందుకే నాకు పెట్టే నైవేద్యం అందరికీ అరగడానికి అనువుగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించిన మహాను భావుడు ఎవరో కాని, ఆయనకు శతకోటి వందనాలమ్మా. భక్తితో చేసే నా పూజకు అసలు ఖర్చే ఉండదమ్మా. పిల్లలంతా తోటలలోకి వెళ్లి, రకరకాల ఆకులు కోసుకు వస్తే చాలు. ఏవీ దొరక్కపోతే, నాలుగు గడ్డి పరకలు తెచ్చినా చాలు సంతోషిస్తాను. నా తయారీ కూడా అలాగే సులువుగా ఉండాలి. బంకమట్టితో నన్ను తయారు చేస్తే చాలు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల దాకా అందరికీ అందుబాటులో ఉండే పూజ కదమ్మా నాది. నా మీద ప్రేమతో ముత్తుస్వామి దీక్షితార్‌ ‘వాతాపి గణపతిం భజే’, ‘మహాగణపతిం మనసాస్మరామి’ అంటూ... రచించిన కీర్తనలను నేటి తరం కూడా పాడు కోవాలనే ధ్యేయంతో కొందరు వీటికి ఆధునిక పోకడలను సైతం సంతరించారు.
– డా. వైజయంతి పురాణపండ