Friday, 28 August 2015

శ్రీ మహాభారతం రచన






ఊ కొడతావా..! ఊరుకోమంటావా..!!

పంచమవేదంగా భావించే మహాభారతాన్ని వ్యాసుడు రాసే క్రమంలో చిన్న గమ్మత్తు జరిగింది. మహాకావ్య రచనకు పూనుకున్న వ్యాసుడు.. తను శ్లోకాలు చెబుతుంటే ఎవరైనా రాస్తే అనువుగా ఉంటుందని అనుకున్నాడట.

అందుకు విఘ్నేశ్వరుడే సరైనవాడని భావించి.. మహాభారతం తను చెబుతుంటే రాసి పెట్టాలని కోరతాడు వ్యాసుడు.

అందుకు సరేనన్న గణపతి.. చిన్న మెలిక పెడతాడు

ఒక్కసారి రాయడం మొదలుపెడితే తన గంటం ఆగదని, తను శ్లోకం రాసేసి ఊ అనగానే మరో శ్లోకం చెప్పాలని షరతు విధిస్తాడు. లేకపోతే అక్కడితో రాయడం ఆపేస్తానని చెబుతాడు.

ఏకదంతుడి ఆంతర్యం గ్రహించిన వ్యాసుడు అందుకు ఒప్పుకుంటూనే గణపతికీ ఓ పరీక్ష పెడతాడు. తను చెప్పిన శ్లోకం తాత్పర్యం అర్థమైతే గానీ అక్షరబద్ధం చేయరాదని.. లేకపోతే తనూ ఆ రోజుకు శ్లోకాలు చెప్పడం ఆపేస్తానని సెలవిస్తాడు.

ఈ రెండు ఒప్పందాల అయ్యాక.. ఇద్దరూ కావ్యరచనకు సిద్ధమవుతారు. వ్యాసుడు శ్లోకాలు చెబుతుండటం.. విఘ్నేశ్వరుడు ఊ కొడుతూ రాసేయడం.. ఇదే తంతు.

విఘ్నేశ్వరుడి వేగానికి కళ్లెం వేయడానికి ఒక కఠినమైన శ్లోకం వదిలేవాడు బాదరాయణుడు. దాన్ని అర్థం చేసుకోవడంలో కాస్త ఆలస్యమై.. గణపతి ఊ కొట్టడం ఆపేయడంతో.. ‘ఈ రోజుకు ఇక్కడితో ముగిద్దామా గజాననా’ అంటూ వేద వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు.

ఇలా సాగింది మహాభారత రచన.


No comments:

Post a Comment