చరిత్రలు, పురాణాలంటే మక్కువ చూపే ఔత్సాహికులకు ఈ కథ ఓ బంగారు గని లాంటింది. శంతనుడి సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది. సత్యవతి ఓ అందమైన మహిళ, కానీ ఈమె మత్స్యకన్య. కాబట్టి శరీరం నుంచి చేపల వాసన వెలువడేది. దీంతో సత్యవతిని వివాహం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.
తీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓ నాడు పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరాశర మహర్షి ఓ గొప్ప తపశ్శాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయనే. కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు. సత్యవతి శరీరం నుంచి వెలువడే చేపల వాసనకు ఆ ముని తపస్సుకు భంగం వాటిల్లింది.
ఆమె అందాన్ని చూసి చలించిన పరాశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటాడు. అయితే తన మూడు కోరికలు నేరవేర్చితేనే దీనికి ఒప్పకుంటానని సత్యవతి అంటుంది.
సత్యవతి షరతులు అంగీకరించడంతో పరాశర మహర్షి కోరిక తీర్చింది. ఈ ఇద్దరి కలయిక వల్ల జన్మించివాడే వేద వ్యాసుడు. కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచే సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు.
ఒక రోజు శంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెదుక్కొంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురవుతుంది. ఆమె అందానికి మంత్రముగ్దుడైన శంతనుడు అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడ నుంచే మహాభారతం ప్రథమ అధ్యాయం ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment