Friday, 16 February 2018

ఆళ్వారులు





ఆళ్వారులు
శ్రీ మహావిష్ణు భక్తశిఖామణులను ఆళ్వారులు అంటారు. వీరు 12 మంది. వీరు 12 మంది కూడా శ్రీ వైకుంఠంలో ఉండే వారి అంశములతో భూమి పై జన్మించారు అని పెద్దలు చెపుతారు. వీరు స్వామి వారిని స్తుతిస్తూ వారి పై 4000 భక్తి శ్లోకములను/ పాశురములను రచించారు. ఈ 4000 శ్లోకములను కలిపి నాలావిర దివ్య ప్రభందం అంటారు. తమని తాము భగవత్ దాసులుగా చెప్పుకుంటారు. వీరు ముక్తి కాలంలో స్వయంగా శ్రీవారిలో లీనమయారు అని చెప్తారు. వీరు ఈ భూమిపై తిరుగాడిన కాలం క్రీ.శ. 6 నుండి క్రీ.శ 9వ శతాబ్దపు మధ్య కాలం అని చెప్తారు. ఇప్పుడు ఆ 12 మంది పేర్లు వారి వివరములు తెలుసుకుందాం!
  1. పోగై ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు : కాసార యోగి, పద్మ ముని
    • అంశ : పాంచజన్యం (శ్రీ మహా విష్ణు శంఖం)
  2. భూతనాధ్ ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు : సిద్ధార్ధి
    • అంశ : కౌమోదకి (గధ)
  3. పై ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు: కైరవ ముని
    • అంశ : నందకం (ఖడ్గం)
  4. తిరుమలిసై ఆళ్వార్:
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు : భక్తిసారర్
    • అంశ : సుదర్శనం (చక్రం)
  5. తిరుమంగై ఆళ్వార్:
    • కాలం: 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు: నాలు కవి పెరుమాళ్
    • అంశ : శారంజ్ఞం (విల్లు)
  6. తొండరడిపొడి ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు : విప్ర నారాయణ
    • అంశ : వనమాల
  7. తిరుప్పాన్ ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు : పాణర్, యోగి వాహనర్
    • అంశ : శ్రీవత్సం
  8. కులశేఖర్ ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు: కొల్లిక్కావాలన్
    • అంశ : కౌస్తుభం
  9. పెరియాళ్వార్ :
    • కాలం : 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు: విష్ణు చిత్తర్
    • అంశం : గరుడ
  10. శ్రీ ఆండాళ్ :
    • కాలం: 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు : సూదికొడుత్ర నాంచియార్
    • అంశం: భూదేవి
  11. నమ్మాళ్వార్
    • కాలం: 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు: శఠగోపా, పరాంకుశం
    • అంశం: విష్వక్సేన
  12. మధుర కవి ఆళ్వార్ :
    • కాలం : 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు: ఇంకవియర్
    • అంశం: వైనతేయ (గరుడ)


వైష్ణవ సంప్రదాయంలో సంస్కృత వేదాలకే కాక ద్రవిడ వేదాలు పిలువబడే నాలుగు వేల దివ్య ప్రబంధాలకూ మరింత ప్రాధాన్యత. ఇవి భగవత్ తత్వాన్ని దర్శించి ఆళ్వారులు పాడిన పాటలు. వేదాలను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, వాటిని సమగ్రంగా అర్థం చేసుకోగల మహనీయులు ఉంటే తప్ప మనకు తెలియవు. చెఱుకు గడనుండి రసాన్ని పీల్చినల్టు కష్టంగా ఉంటుంది. అట్లా కాక చెఱుకు గడనుండి రసాన్ని తీసి ఇస్తే ఎంత సులభంగా త్రాగ వీలు అవునో, అట్లా వేద సారం అని పిలవబడే దివ్య ప్రబంధాల ద్వారా భగవంతుడిని దర్శించడం సులభం. భగవంతుడే ఆళ్వారుల ద్వారా పాడించుకున్నాడు. ఆళ్వారులు వివిద కాలాలకు చెందినవారు. నలుగురు ద్వాపర యుగానికి మిగతా ఎనిమిది మంది కలియుగ మొదటి శతాబ్దానికి చెందినవారు. అందులో  ముదల్ ఆళ్వార్లుగా అంటే మొదటి ముగ్గురు ఆళ్వార్లుగా పిలువబడేవారు పోయగై ఆళ్వార్, బూతతాళ్వార్ మరియూ పెయ్-ఆళ్వార్. వీరంతా వేరు వేరు ప్రాంతాలకి చెందినవారు. అనుకోకుండా పరమాత్మ సంకల్పంవల్ల ఒక దగ్గర కలుసుకోవాల్సివచ్చింది తిరుకోవలూర్ లో.

మొదటి ముగ్గురు ఆళ్వార్లు అని పిలవబడే ఈ ముగ్గురూ ఒకే సంవత్సరంలో ఒకే మాస శుక్ల పక్షంలో వరుసగా మూడు రోజుల్లో పుట్టినవారు. అందరూ అయోనిజులు. మొదటి ఆళ్వార్ పోయగై-ఆళ్వార్ కంచీపురంలోని తిరువెక్క(యదోక్తకారి) వద్ద ఉన్న చిన్న చెరువు లో పుట్టారు. తమిళంలో పోయగై అంటే చిన్న చెరువు అని అర్థం. ఈయన శ్రీమన్నారాయణుడి ఒక ఆయుధంగా పిలవబడే పాంచజన్యం (శంఖం) యొక్క అంశ. రెండో ఆళ్వార్ బూతత్-ఆళ్వార్, ఈయన కడలిమలై (మహాబలిపురం) లో కరుక్కట్టి అనే పుష్పంలో పుట్టారు. ఈయన శ్రీమన్నారాయణుడి ఆయుధంగా పిలువబడే కౌమోదికం (గధ) యొక్క అంశ. మూడో ఆళ్వార్ పేయ్-ఆళ్వార్, ఈయన మైలాపూర్ లోని ఆదికేశవ పెరుమాళ్ దేవస్థానంలో ఒక కమలంలో పుట్టారు. ఆయన శ్రీమన్నారాయణుడి ఆయుదం నందకి(ఖడ్గం) యొక్క అంశ. ఈ ముగ్గురు ఆళ్వార్లు భగవత్ తత్వాని భావిస్తూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారు.


మనదేశం అనాదిగా కర్మభూమి. భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపదలకు నిలయం. ఎందరో నిష్కామకర్మపరాయణులు, భక్తులు, జ్ఞానులు, విరాగులు ఈ పుణ్యభూమిలో జన్మింఛి జాతిని పునీతం చేశారు . ఆళ్వార్లు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తశిఖామణులు . వీరు సంఖ్యలో 12 మంది కావడం వలన పన్నిద్దరాళ్వార్లుగా ప్రసిద్ధి పొందారు. ఆళ్వారనే తమిళపదానికి మునుగుట అని అర్థం. భగవంతుని యెడల ప్రేమతో, భగవంతుని అనుగ్రహంలో పూర్తిగా మునిగిన వారే ఆళ్వార్లని చెప్పవచ్చు . శ్రీ మహావిష్ణువు యొక్క పరివారం కలియుగంలో భక్తితత్వాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం ఆళ్వార్లుగా అవతరించారని భాగవతం బట్టి తెలుస్తోంది.
(1) పోయిగై ఆళ్వార్ – పాంచజన్యం ( శంఖం);
(2) పూదత్తాళ్వార్ –కౌమోదకి (గద);
(3) పేయాళ్వార్ –నందకము ( ఖడ్గం);
(4)తిరుమళి(డి)శైఆళ్వార్ -సుదర్శనం(చక్రం)
(5) కులశేఖరాళ్వార్( కౌస్తుభమణి);
(6) తొండరడిప్పొడి ఆళ్వార్ -(పుష్పమాల);
(7) తిరుప్పాణి ఆళ్వార్ – (శ్రీవత్సమనే పుట్టుమచ్చ);
(8) తిరుమంగై ఆళ్వార్- (శారంగము అనే ధనుస్సు);
(9) పెరియాళ్వార్ (విష్ణు రథం);
(10) చూడికురుత్తనాంచియార్ (గోదాదేవి/ఆండాళ్) - (భూదేవి);
(11) నమ్మాళ్వార్-(విష్వక్సేనుడనే సైన్యాధ్యక్షుడు)
(12) మధురకవి ఆళ్వార్- (గరుత్మంతుడు).

తర్కకర్కశమైన వాదోపవాదాలతో, శుష్కమైన కర్మకాండలతో, దీర్ఘ జటిలసాధనలతో మరుభూమిగా మారిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సహజమైన భక్తిప్రపత్తులతో ముంచెత్తి మోక్షమార్గాన్ని కరతలామలకం చేయ్యడానికి ఆళ్వారులు ఒకరి తరువాత ఒకరు అవతరించారు. శరణాగతి ద్వార మోక్షసామ్రాజ్యానికి బంగారుబాటలు వేశారు. వీరిలో కొంత మంది ఎక్కువ కులం వారు, కొంత మంది తక్కువ కులం వారు, ఇంకా కొంత మంది అంటరానివారు, ఒకరు స్త్రీ(‘చూడికురుత్తనాంచియార్’ స్త్రీ కావడం ఒక విశేషం.) కావడం గమనిస్తే ఆధ్యాత్మిక ప్రగతికి జాతి, కులం మొ|| ఆటంకాలు కావనిపించక మానదు. ఈమెనే గోదాదేవి అని పిలుస్తారు.

గోదాదేవిని అపార భగవద్భక్తిజ్ఞానవైరాగ్యశేవధిగా వర్ణించారు. ఈమె విష్ణుచిత్తుడను మరో పేరుగల పెరియాళ్వారు కూతురు. ఆతనికి తులసివనంలో దొరికింది. ఈ విధంగా ఒక ఆళ్వారుకు కూతురై , స్వయంగ ఆళ్వార్ల సరసన చోటు సంపాదించుకున్న గోదాదేవి చరిత్ర ఎంతో పవిత్రమైనది. స్త్రీలోకానికే ఆదర్శపాత్రమైనది. ‘చూడి కొడుత్తాళ్’ అనే పదానికి ఆముక్తమాల్యద అని అర్థం . అంటే భగవంతునికై అల్లినపూలమాలను ముందుగా తాను ధరించి తన అందాన్ని తనివితీరా చూసుకుని మురిసి ఆ తరువాతే దేవునికి సమర్పణ చేసేది.

గోదాదేవి చిన్నతనంలో తండ్రి వలన భగవల్లీలా విశేషాల్ని తెలుసుకొని చెలులకు చెప్పేది. తాను స్వయంగా సంగీత కవిత్వములయందు నేర్పరి కావడం చేత పూర్వజన్మ సంస్కారం వల్ల కల్గిన భక్తిభావంతో ఎల్లప్పుడు భగవంతుని యందు మనసు లగ్నం చేసి అతన్నే గానం చేస్తూ ఉండేది. భగవంతుని పొందు కోసమే నిరంతరం తహతహలాడేది. విష్ణుచిత్తుడు ఆమె మన:ప్రవృత్తిని గమనించి ఆశ్చర్యపడి భగవంతునకు మొఱపెట్టుకోగా అతడు ప్రత్యక్షమై విష్ణుచిత్తునితో ఓ భక్తశిఖామణి! భగవంతుని గుణగానం కంటే వేరొక తపస్సు ఏముంటుంది? నేను పూర్వం వరాహరూపం ధరించినపుడు నన్ను భూదేవి తనివితీరా గానం చేయలేక ఆ కొరతను తీర్చుకోడానికై నేడు గోదాదేవి పేరుతో నీ పుత్రికగా జన్మించింది. ఆమె నన్ను వలచింది. ఆమె ధరించిన మాలయే నాకు అత్యంతప్రియమైంది. నీవామెను శ్రీ రంగానికి తీసుకుపోయి రంగనాధునికి సమర్పించ’’మని ఆదేశించాడు. పిదప గోదాదేవి యధావిధిగా రంగనాధుని పెండ్లాడింది. ఈవిధంగా భక్తితో భగవంతునకు భార్యయైన గోదాదేవి ధన్యచరిత. ఆమె చరితం అనురాగ భక్తిరసభరితం.




ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సత్యం లోతులను, ఆనందం లోతులను అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. (ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ॥ శ॥ 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందువారే గాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నా భిప్రాయాలు ఉన్నాయి. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం, పన్నెండు మంది అని మరో వాదం ఉంది. పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడిరది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది. ‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ, శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. కాని, ఇందులో పదాలను చీల్చి శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ, యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి, మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల ఆళ్వారులు పన్నిద్దరైనారు.
పదుగురి పేర్లివి:

  1. భూత ఆళ్వారు (పూదత్త ఆళ్వారు అని వాడుక. కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం),
  2. పొయగై ఆళ్వారు. పాంచజన్యం అనే శంఖం అంశ. సరోయోగ అని కూడా అంటారు).
  3. పేయాళ్వార్‌ (మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. నందకం అనే ఖడ్గం అంశ).
  4. తిరుమళిశై ఆళ్వారు (భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ).
  5. కులశేఖ రాళ్వారు (కౌస్తుభమణి అంశ).
  6. తొందర డిప్పొడి ఆళ్వారు (విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. తులసీదళాలు, పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల/ వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం).
  7. తిరుప్పాణి ఆళ్వారు (యోగి వాహన ఆళ్వారు. ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు.) విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.)
  8. తిరుమంగై ఆళ్వారు (పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం).
  9. పెరియాళ్వారు (భట్టనాథ ఆళ్వారు. ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. వైకుంఠంలోని విష్ణువు రథం అంశ.
  10. నమ్మాళ్వారు (పరాంకుశ ఆళ్వారు. విష్వక్సేనుడి అంశ. శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.)

ఈ పదిమందిగాక ఆండాళును, మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. గరుడాంశగా చెపుతారు. భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. కాని, ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.


వైష్ణవ దేవాలయాలలో మనం ఆళ్వార్లుని దర్శించుకుంటాం. ఆళ్వార్ అంటే నిమగ్నమై ఉన్నవాడు అని అర్ధం. తాము నమ్ముకున్న విధానంపట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారని అర్ధం. ఆ శ్రీమన్నారాయణుని పట్ల భక్తిని పెంచుకున్నారు. ఆ భక్తిభావం కలిగిన అనంతరం వేరే భావాన్ని మదిలోకి రానివన్నంత గాఢంగా విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందుకే భగవంతునికి అంత చేరువ కాగలిగారు. ప్రస్తుతం 12 మంది ఆళ్వార్లు లేని వైష్ణవాలయం ఉండదంటే అతిశయోక్తి కాదు.వీరు ఉన్నపుడే ఆ ఆలయానికి పూర్ణత్వం సిద్ధిస్తుందని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారయణుడే వీరిని స్వయముగా అనుగ్రహించడం ఇక్కడ విశేషం. అంతగా స్వామి ధ్యానంలో పరవశులైనారు వీరు.

వీరంతా శ్రీమన్నారయణుడికి సంబంధించిన ఆయుధాలు, ఆభరణాల అంశతో జన్మించారని కూడా అంటారు. దాని గురించి తెలుసుకుందాం.

భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాధ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్సరాంకుశ మునిం ప్రణతోస్మినిత్యం

భూతయోగి - పూదత్తాళ్వార్ - కౌమోదకి అనే గద
సరోయోగి - పోయిగయాళ్వార్ - పాంచజన్యం అనే శంఖం
మహాయోగి - పేయాళ్వార్ - నందకం ఖడ్గం
భట్టనాధుడు - పెరియాళ్వార్ - గరుడుడు
ఆండాల్ - గోదాదేవి - లక్ష్మీదేవి అంశ
భక్తిసారయోగి - తిరుమళిసైయాళ్వార్ - సుదర్శన చక్రం అంశ
కులశేఖరాళ్వార్ - కౌస్తుభమణి అంశ
మునివాహనులు - తిరుప్పాణాళ్వార్ - శ్రీవత్సలాంచన అంశ
భక్తాంఘ్రిరేణువు - తొండరడిప్పొడియాళ్వార్ - వైయజంతి అను పూమాల అంశ
పరకాలయోగి - తిరుమంగైయాళ్వార్ - శారంగం అను ధనస్సు
మధురకవి ఆళ్వార్ - కుముదాంశ
శఠకోపముని - నమ్మాళ్వార్ - విశ్వక్సేనుని అంశ

ఈ వరుస క్రమముని ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తారు. వీరంతా దాదాపుగా దక్షిణదేశానికి చెందినవారు. ఇక, వీరిలో నలుగురేమో పల్లవ రాజ్యానికి, ముగ్గురేమో చోళదేశానికి, ఒకరేమో కేరళ కి చెందినవారుకాగా, మరో నలుగురేమో పాండ్యదేశానికి చెందినవారు. కులమతాలకు అతీతంగా వీరిలో అందరూ ఉన్నారు. ముందు చెప్పిన విధంగా ఈ 12 మందిలో ఒకరు దేశాన్నేలే రాజు కాగా, మరొకరు చోరవృత్తి చేసే వారు కూడా ఉన్నారు. ఆళ్వార్లు అందరూ మంచి కవులే.

ఇక ఆండాల్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆమె సాక్షాత్తూ శ్రీరంగడి పత్నిగా ఆయన హృదయంలోనే ప్రతిష్టితురాలైన గొప్ప భక్తురాలు. తిరుప్పావై ఈమె వ్రాసినదే. ఆమె తండ్రి పెరాయాళ్వార్ విష్ణుచిత్తుడిగా పేరుపొందాడు.



నారాయణతత్వాన్ని దర్శించిన మొదటి ముగ్గురు ఆళ్వారులు
ముదల్ ఆళ్వార్లు

మనకు నాలుగు వేల దివ్య ప్రబంధాలను పాడి అందించిన వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు. ఆందులో మొదటి ముగ్గురు ఆళ్వార్లు కలియుగానికి ముందు జన్మించిన వారు. వారు అందమైన రీతిలో తత్వాన్ని దర్శించినవారు. అందుకు ఒక చరిత్ర ఉంది. అందులో ఒక ఆళ్వార్ సరస్సులో లభించారు. అందుకు ఆయనకు సరోయోగి అని పేరు. పొయ్-గై  అంటే ద్రవిడ భాషలో సరస్సు అని అర్థం.  మరోక ఆయన పుష్పంలో పుట్టారు అందుకే ఆయనకు పూదత్త, క్రమేపి భూత యోగి లేక భూదత్తాళ్వార్ అని పేరు వచ్చింది. మరొకాయనకు భగవంతుడు అంటే పిచ్చి వ్యామోహం, అందుకే ఆయనకు మహాయోగి అని పేరు. పేయ్ ఆళ్వార్ అని అంటారు. పేయ్ అంటే ద్రవిడ భాషలో పిచ్చి అని అర్థం.



No comments:

Post a Comment