కనరో భాగ్యము..
సప్తగిరులపై వెలిసిన వేంకటేశుని దర్శించినంత మాత్రాన మనసు పరవశించి పోతుంది. లిప్తపాటులో మెరిసే ఆ దివ్య మంగళరూపం... కళ్ల ముందు కలకాలం నిలిచిపోతుంది. ఆ కోనేటి రాయుడి ఉత్సవమూర్తి తిరువీధుల్లో మలయప్పస్వామిగా వివిధ వాహనాలపై తిరుగాడుతుంటే ఇంకా చెప్పేదేముంటుంది. బ్రహ్మోత్సవ వేళ ఈ మనోహర దృశ్యం ప్రతిరోజూ ఆవిష్కృతం అవుతుంటుంది. ఈ సమయంలో తిరువీధులు ఆనందనిలయాన్ని మరిపిస్తాయి.
శ్రీహరి భక్త సులభుడు. భక్తులను అనుగ్రహించడానికే ఆయన ‘‘శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే’’ వచ్చి నిలిచాడు. కలియుగ దైవంగా ఏడుకొండలపై వేంకటేశుడిగా కొలువుదీరిన శ్రీహరి సన్నిధిలో నిత్య కల్యాణం.. పచ్చ తోరణం. బ్రహ్మోత్సవ సమయంలో ఈ వేడుక మరింత సంబరంగా ఉంటుంది.
బ్రహ్మ చేసెడి ఉత్సవం..
అధిక మాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా శ్రీనివాసుడే బ్రహ్మదేవుడిని పిలిచి బ్రహ్మోత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడు. ఆనాటి నుంచి ఏటా కన్యా మాసం (ఆశ్వయుజం)లో శ్రవణం నక్షత్రం నాటికి పూర్తయ్యేలా ముందు తొమ్మిది రోజులు వైఖానసాగయుక్తంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు.. బ్రహ్మాండంగా జరిపిన ఉత్సవమిది. స్వామి రథోత్సవం రోజున బ్రహ్మదేవుడు సైతం శ్రీవారి రథం పగ్గాలు లాగుతాడని ప్రతీతి. మిగతా రోజుల్లో శ్రీనివాసుడి వాహనం ముందు బ్రహ్మరథం నడుస్తుంది.
బ్రహ్మాండనాయకుడి దర్శనం..
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ ఏట అధికమాసం వస్తుంది. అప్పుడు భాద్రపదం లేదా శ్రావణ మాసాల్లో ఒక దఫా, ఆశ్వయుజ మాసంలో రెండో దఫా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటగా నిర్వహించే వాటిని వార్షిక బ్రహ్మోత్సవాలని, రెండోసారి చేసేవాటిని నవరాత్రి ఉత్సవాలని పిలుస్తుంటారు. ఒకప్పుడు ప్రతి నెలా బ్రహ్మోత్సవలు నిర్వహించే వారట. ఏడాది పొడుగునా ఆనంద నిలయంలో అంగరంగ వైభవంగా సేవలందుకునే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమాడ వీధుల్లో లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తాడు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే వాహన సేవలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సర్వలోకాలనూ కాపాడే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని సేవలో తరించడానికి దేవతలే వాహనాలుగా మారిపోయారు. ఈ భక్త సులభుడిని తన భుజస్కందాలపై మోసేందుకు భక్తాగ్రేసరులైన గరుడు, హనుమలు వాహనంగా మారి పరవశిస్తారు. సూర్య, చంద్రులు సైతం స్వామివారి వాహనాలుగా తన్మయులవుతారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులలో 14 వాహనాలపై స్వామి ఊరేగుతాడు.
ఆదిశేషుడిపై ఆదిదేవుడు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజు స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన ఆదిశేషుని వాహనంగా స్వీకరించాడు. శేషుడు కలియుగంలో గోవిందరాజ స్వామిగా తిరుపతిలో వేంచేశాడు. స్వామివారి సేవలో నిత్యం తరిస్తూనే ఉంటాడు ఆదిశేషుడు. శ్రీహరి నివాస పీఠంగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా.. ఆయా సమయాలకు అవసరమైన ఛత్రంగా శేషుడు సేవలు అందిస్తాడని యమునాచార్యులు వర్ణించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ఉభయదేవేరుల సమేతంగా పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగుతాడు. ఏడు పడగల శేషుడిపై ఏడుకొండల దేవుడి సంచారం భక్తజనులకు ఆనందం కలిగిస్తుంది. ఆ మర్నాడు ఐదు పడగల చిన్న శేష వాహనాన్ని అధిరోహిస్తాడు.
హంసవాహనంపై పరమహంస..
క్షీరనీర న్యాయంగా ఆత్మానాత్మ వివేకానికి హంస ప్రతీక. ఈ సత్యం బోధపరచడానికి స్వామి హంస వాహనాన్ని ఎంచుకున్నాడు. రెండో రోజు రాత్రి సాగే హంసవాహన సేవ కన్నుల పండువగా సాగుతుంది. ఈ వాహనంపై స్వామివారు సరస్వతీ దేవి అలంకారభూషితుడై భక్తులకు దర్శనమిస్తాడు. మూడో రోజు ఉదయం మృగరాజు అయిన సింహ వాహనంపై దర్శనమిస్తాడు. అదే రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనంపై ఉభయ దేవేరుల సమేతంగా తిరువీధుల్లో విహరిస్తాడు. ఇక నాలుగో రోజు ఉదయం భక్తుల కోర్కెలు తీర్చడానికి కల్ప వృక్షవాహనంపై కనువిందు చేస్తాడు. ఆ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై కాలీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడు. ఐదో రోజు ఉదయం ‘పుంసాం మోహన రూపాయ..’ అన్నట్టు స్వామి మోహినీ అవతారంలో కనిపిస్తాడు.
భక్తి ముక్తి దాయకం..
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి వాహనం.. ముందు సంచరిస్తూ గజరాజులు శ్రీహరిని సేవిస్తాయి. గజేంద్రమోక్షం వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఆరో రోజు రాత్రి స్వామివారు గజవాహనాన్ని అధిరోహిస్తాడు. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరు మాడవీధుల్లో సంచరిస్తాడు. ఎనిమిదో రోజు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం విశేషంగా సాగుతుంది. భక్తులందరూ రథాన్ని లాగుతూ స్వామివారి సేవలో పునీతులవుతారు. అదే రోజు రాత్రి అశ్వవాహనంపై ఖడ్గం ధరించి దర్శనిమస్తారు. ఆ మర్నాడు చక్రస్నానంతో ఉత్సవాలు సమాప్తం అవుతాయి. భక్తి ముక్తిదాయకమైన బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షించిన చాలు జన్మ తరిస్తుంది.
భక్తాగ్రేసరులపై భక్తవత్సలుడు..
స్వామివారి విషయంలో ఎవరికీ దక్కని భాగ్యం గరుడునికి దక్కింది. ఆనంద నిలయంలో శ్రీవారి ఎదురుగా నిల్చుని నిరంతరం ఆ స్వామినే చూస్తూ ఆయన సేవకు సన్నద్ధంగా ఉంటాడు ఈ పక్షేంద్రుడు. అందుకే గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు శ్రీహరి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతాడు. వైభవంగా జరిగే గరుడవాహన సేవను తిలకిస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలోనే కాదు అన్ని వైష్ణవాలయాల్లోనూ గరుడ సేవకు ప్రత్యేకత ఉంది. శ్రీరంగంలో మరింత ప్రశస్తి. కంచి గరుడసేవ అనే సామెత కూడా ఉంది. ఆరో రోజు ఉదయం హనుమద్వాహనంపై దర్శనమిస్తాడు మలయప్పస్వామి. వేంకటాద్రిరాముడిగా తన భక్తుడిపై ఊరేగుతూ భక్తకోటికి వరాలిస్తాడు.
-R. అనంతపద్మనాభరావు
98665 86805
సప్తగిరులపై వెలిసిన వేంకటేశుని దర్శించినంత మాత్రాన మనసు పరవశించి పోతుంది. లిప్తపాటులో మెరిసే ఆ దివ్య మంగళరూపం... కళ్ల ముందు కలకాలం నిలిచిపోతుంది. ఆ కోనేటి రాయుడి ఉత్సవమూర్తి తిరువీధుల్లో మలయప్పస్వామిగా వివిధ వాహనాలపై తిరుగాడుతుంటే ఇంకా చెప్పేదేముంటుంది. బ్రహ్మోత్సవ వేళ ఈ మనోహర దృశ్యం ప్రతిరోజూ ఆవిష్కృతం అవుతుంటుంది. ఈ సమయంలో తిరువీధులు ఆనందనిలయాన్ని మరిపిస్తాయి.
శ్రీహరి భక్త సులభుడు. భక్తులను అనుగ్రహించడానికే ఆయన ‘‘శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే’’ వచ్చి నిలిచాడు. కలియుగ దైవంగా ఏడుకొండలపై వేంకటేశుడిగా కొలువుదీరిన శ్రీహరి సన్నిధిలో నిత్య కల్యాణం.. పచ్చ తోరణం. బ్రహ్మోత్సవ సమయంలో ఈ వేడుక మరింత సంబరంగా ఉంటుంది.
బ్రహ్మ చేసెడి ఉత్సవం..
అధిక మాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా శ్రీనివాసుడే బ్రహ్మదేవుడిని పిలిచి బ్రహ్మోత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడు. ఆనాటి నుంచి ఏటా కన్యా మాసం (ఆశ్వయుజం)లో శ్రవణం నక్షత్రం నాటికి పూర్తయ్యేలా ముందు తొమ్మిది రోజులు వైఖానసాగయుక్తంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు.. బ్రహ్మాండంగా జరిపిన ఉత్సవమిది. స్వామి రథోత్సవం రోజున బ్రహ్మదేవుడు సైతం శ్రీవారి రథం పగ్గాలు లాగుతాడని ప్రతీతి. మిగతా రోజుల్లో శ్రీనివాసుడి వాహనం ముందు బ్రహ్మరథం నడుస్తుంది.
బ్రహ్మాండనాయకుడి దర్శనం..
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ ఏట అధికమాసం వస్తుంది. అప్పుడు భాద్రపదం లేదా శ్రావణ మాసాల్లో ఒక దఫా, ఆశ్వయుజ మాసంలో రెండో దఫా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటగా నిర్వహించే వాటిని వార్షిక బ్రహ్మోత్సవాలని, రెండోసారి చేసేవాటిని నవరాత్రి ఉత్సవాలని పిలుస్తుంటారు. ఒకప్పుడు ప్రతి నెలా బ్రహ్మోత్సవలు నిర్వహించే వారట. ఏడాది పొడుగునా ఆనంద నిలయంలో అంగరంగ వైభవంగా సేవలందుకునే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమాడ వీధుల్లో లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తాడు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే వాహన సేవలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సర్వలోకాలనూ కాపాడే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని సేవలో తరించడానికి దేవతలే వాహనాలుగా మారిపోయారు. ఈ భక్త సులభుడిని తన భుజస్కందాలపై మోసేందుకు భక్తాగ్రేసరులైన గరుడు, హనుమలు వాహనంగా మారి పరవశిస్తారు. సూర్య, చంద్రులు సైతం స్వామివారి వాహనాలుగా తన్మయులవుతారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులలో 14 వాహనాలపై స్వామి ఊరేగుతాడు.
ఆదిశేషుడిపై ఆదిదేవుడు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజు స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన ఆదిశేషుని వాహనంగా స్వీకరించాడు. శేషుడు కలియుగంలో గోవిందరాజ స్వామిగా తిరుపతిలో వేంచేశాడు. స్వామివారి సేవలో నిత్యం తరిస్తూనే ఉంటాడు ఆదిశేషుడు. శ్రీహరి నివాస పీఠంగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా.. ఆయా సమయాలకు అవసరమైన ఛత్రంగా శేషుడు సేవలు అందిస్తాడని యమునాచార్యులు వర్ణించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ఉభయదేవేరుల సమేతంగా పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగుతాడు. ఏడు పడగల శేషుడిపై ఏడుకొండల దేవుడి సంచారం భక్తజనులకు ఆనందం కలిగిస్తుంది. ఆ మర్నాడు ఐదు పడగల చిన్న శేష వాహనాన్ని అధిరోహిస్తాడు.
హంసవాహనంపై పరమహంస..
క్షీరనీర న్యాయంగా ఆత్మానాత్మ వివేకానికి హంస ప్రతీక. ఈ సత్యం బోధపరచడానికి స్వామి హంస వాహనాన్ని ఎంచుకున్నాడు. రెండో రోజు రాత్రి సాగే హంసవాహన సేవ కన్నుల పండువగా సాగుతుంది. ఈ వాహనంపై స్వామివారు సరస్వతీ దేవి అలంకారభూషితుడై భక్తులకు దర్శనమిస్తాడు. మూడో రోజు ఉదయం మృగరాజు అయిన సింహ వాహనంపై దర్శనమిస్తాడు. అదే రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనంపై ఉభయ దేవేరుల సమేతంగా తిరువీధుల్లో విహరిస్తాడు. ఇక నాలుగో రోజు ఉదయం భక్తుల కోర్కెలు తీర్చడానికి కల్ప వృక్షవాహనంపై కనువిందు చేస్తాడు. ఆ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై కాలీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడు. ఐదో రోజు ఉదయం ‘పుంసాం మోహన రూపాయ..’ అన్నట్టు స్వామి మోహినీ అవతారంలో కనిపిస్తాడు.
భక్తి ముక్తి దాయకం..
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి వాహనం.. ముందు సంచరిస్తూ గజరాజులు శ్రీహరిని సేవిస్తాయి. గజేంద్రమోక్షం వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఆరో రోజు రాత్రి స్వామివారు గజవాహనాన్ని అధిరోహిస్తాడు. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరు మాడవీధుల్లో సంచరిస్తాడు. ఎనిమిదో రోజు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం విశేషంగా సాగుతుంది. భక్తులందరూ రథాన్ని లాగుతూ స్వామివారి సేవలో పునీతులవుతారు. అదే రోజు రాత్రి అశ్వవాహనంపై ఖడ్గం ధరించి దర్శనిమస్తారు. ఆ మర్నాడు చక్రస్నానంతో ఉత్సవాలు సమాప్తం అవుతాయి. భక్తి ముక్తిదాయకమైన బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షించిన చాలు జన్మ తరిస్తుంది.
భక్తాగ్రేసరులపై భక్తవత్సలుడు..
స్వామివారి విషయంలో ఎవరికీ దక్కని భాగ్యం గరుడునికి దక్కింది. ఆనంద నిలయంలో శ్రీవారి ఎదురుగా నిల్చుని నిరంతరం ఆ స్వామినే చూస్తూ ఆయన సేవకు సన్నద్ధంగా ఉంటాడు ఈ పక్షేంద్రుడు. అందుకే గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు శ్రీహరి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతాడు. వైభవంగా జరిగే గరుడవాహన సేవను తిలకిస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలోనే కాదు అన్ని వైష్ణవాలయాల్లోనూ గరుడ సేవకు ప్రత్యేకత ఉంది. శ్రీరంగంలో మరింత ప్రశస్తి. కంచి గరుడసేవ అనే సామెత కూడా ఉంది. ఆరో రోజు ఉదయం హనుమద్వాహనంపై దర్శనమిస్తాడు మలయప్పస్వామి. వేంకటాద్రిరాముడిగా తన భక్తుడిపై ఊరేగుతూ భక్తకోటికి వరాలిస్తాడు.
-R. అనంతపద్మనాభరావు
98665 86805
No comments:
Post a Comment