Thursday, 1 September 2016

శివుడొసగనిదేదీ లేదు

శివుడొసగనిదేదీ లేదు

శివుడూ ఎల్లవేళలా ఆనందంతో ధ్యానమగ్నుడై ఉంటాడు. తన భక్తులు క్షణం పాటు హరహర శంకరా భవహరా శంభోశంకరా అని అంటే చాలు వారికి ఎనలేని సంపదలనిస్తాడు. శివుడు ఒసగనిది ఏదీ ఉండదంటారు శివభక్తులు. అలాంటి శివుడు అభిషేకప్రియుడు. శివలింగంపై తెలిసో తెలియకో ఓ పూవు వేసినా ఓ ప్రతం వేసినా ఆఖరికి మంచినీరు పోసినా సరే వారికి అంతులేని సిరినిస్తాడు. అలాంటి పరమ పావనుడిని, పరమ శాంతుడ్ని కొలవటం భక్తులకు పరమ పావనం.
పాదరసంతో చేసిన లింగానికి అభిషేకాలు జరిపి, అర్చిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
చెక్కతోటి లింగాన్ని తయారుచేసి పూజించిన వారికి అమిత భోగాలను అందిస్తాడట అదిదేవుడు. రత్నమయమైన లింగాన్ని పూజించినవారికి సంపదలతోపాటు పాడిపంటలను కలిగిస్తాడట పార్వతిపతి.
రాతితో చేసిన లింగాన్ని అర్చించినవారికి సర్వసిద్ధులను ప్రసాదిస్తాడట పరమశివుడు.
మట్టితో చేసిన లింగపూజ చేసినవారికి అణిమాదిసిద్ధులను కలిగిస్తాడు మహాదేవుడు.
కాని ఇన్ని రకాలైన లింగాల కన్నా కూడా రాతి లింగార్చనకే ప్రాముఖ్యం ఉందంటోంది లింగపురాణం.

No comments:

Post a Comment