నారద మునీంద్రుడు ఒకసారి అడవిలో ఒక చెట్టుకింద కూర్చుని సేదతీరుతున్నాడు. ఆ చెట్టుమీదినుంచి పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకపిట్ట నారద మహర్షి సమీపంలోకి వచ్చి ఎగరసాగింది. పసుపు పచ్చని రంగు, నల్లని రెక్కలు, నల్లటి తోక కలిగి, బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పిట్ట... నల్లటి కళ్లు, సూదిగా ఉండే చిగురాకులా ఉన్న ఎర్రటి ముక్కుతో, ఉత్సాహానికి, ఉల్లాసానికి మారుపేరులా ఉన్న ఆ పిట్ట అక్కడక్కడే ఎగురుతూ, గంతులు వేస్తూ, చక్కగా కూయసాగింది.
మనోహరమైన దాని కూతలే పాటలా ఉండి, ఆయన మనస్సును సేదతీర్చాయి. నారదుడు ఆ పిట్టను చూసి ముచ్చటపడ్డాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చాడు. నారదుణ్ణి చూసి నమస్కరించాడు. అనుకోకుండా యముడి దృష్టి ఆ పిట్ట మీద పడింది. దాని వైపు ఆశ్చర్యపోతున్నట్టుగా చూసి, మళ్లీ నారదుని వైపు చూసి తల పంకించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సాక్షాత్తూ మృత్యుదేవుడు అయిన యమధర్మరాజు దృష్టి ఆ పిట్ట పై పడటంతో నారదుడి మనస్సు కీడు శంకించింది. యముడు ఆ పిట్టను తీసుకుపోతాడా ఏంటి? అనుకున్నాడు. కొద్దిక్షణాల క్రితం ఎంతో మధురంగా పాటలు పాడి, తన మనస్సుకు ఆనందం కలిగించిన ఆ పిట్టను ఎలా అయినా సరే, కాపాడాలనుకున్నాడు. వెంటనే ఆ పిట్టను పట్టుకుని సప్తసముద్రాలూ దాటి, అక్కడ ఉన్న ఒక మర్రిచెట్టు తొర్రలో దాచి, తిరిగి అరణ్యానికి చేరుకున్నాడు. ఏదో పని ఉన్నవాడిలా యముడు మళ్లీ వచ్చాడు. నారదుడు యముణ్ని చూసి చిద్విలాసంగా నవ్వాడు.
అది చూసి యముడు నారదుడి మనస్సు గ్రహించినట్టుగా...‘‘అయితే విధి మీ చేత కూడా బాగానే విన్యాసాలు చేయిస్తోందన్నమాట.’’ అంటూ ఇలా వివరించాడు.
‘‘నేను మొదట ఆ పిట్ట వంక చూసినప్పుడు మరికాసేపట్లో అది సప్తసముద్రాలూ దాటిన తర్వాత ఒక మర్రిచెట్టు తొర్రలోని పాముకి ఆహారం కాబోతోందని తెలుసుకున్నాను. అయితే, ఇదెలా సాధ్యం. గట్టిగా పదడుగులు కూడా ఎగరలేని ఈ అల్పప్రాణి ఇంత తక్కువ వ్యవధిలో అంత దూరం ఎలా చేరగలదా అని ఆలోచించి, అబ్బుర పడ్డాను. ఇంతలో మీరు కనపడ్డారు. ఆ పని మీ చేతుల మీదుగా జరగగలదని గ్రహించి, నిశ్చింతగా వెళ్లిపోయాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా!’’ అంటూ నవ్వాడు.
‘‘విధివిధానం అమలు జరగడంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంటుందని తెలిసున్నప్పటికీ, నేనూ మాయకు లోనయ్యాను కదా!’’ అని వాపోతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు నారద మహర్షి.
మనోహరమైన దాని కూతలే పాటలా ఉండి, ఆయన మనస్సును సేదతీర్చాయి. నారదుడు ఆ పిట్టను చూసి ముచ్చటపడ్డాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చాడు. నారదుణ్ణి చూసి నమస్కరించాడు. అనుకోకుండా యముడి దృష్టి ఆ పిట్ట మీద పడింది. దాని వైపు ఆశ్చర్యపోతున్నట్టుగా చూసి, మళ్లీ నారదుని వైపు చూసి తల పంకించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సాక్షాత్తూ మృత్యుదేవుడు అయిన యమధర్మరాజు దృష్టి ఆ పిట్ట పై పడటంతో నారదుడి మనస్సు కీడు శంకించింది. యముడు ఆ పిట్టను తీసుకుపోతాడా ఏంటి? అనుకున్నాడు. కొద్దిక్షణాల క్రితం ఎంతో మధురంగా పాటలు పాడి, తన మనస్సుకు ఆనందం కలిగించిన ఆ పిట్టను ఎలా అయినా సరే, కాపాడాలనుకున్నాడు. వెంటనే ఆ పిట్టను పట్టుకుని సప్తసముద్రాలూ దాటి, అక్కడ ఉన్న ఒక మర్రిచెట్టు తొర్రలో దాచి, తిరిగి అరణ్యానికి చేరుకున్నాడు. ఏదో పని ఉన్నవాడిలా యముడు మళ్లీ వచ్చాడు. నారదుడు యముణ్ని చూసి చిద్విలాసంగా నవ్వాడు.
అది చూసి యముడు నారదుడి మనస్సు గ్రహించినట్టుగా...‘‘అయితే విధి మీ చేత కూడా బాగానే విన్యాసాలు చేయిస్తోందన్నమాట.’’ అంటూ ఇలా వివరించాడు.
‘‘నేను మొదట ఆ పిట్ట వంక చూసినప్పుడు మరికాసేపట్లో అది సప్తసముద్రాలూ దాటిన తర్వాత ఒక మర్రిచెట్టు తొర్రలోని పాముకి ఆహారం కాబోతోందని తెలుసుకున్నాను. అయితే, ఇదెలా సాధ్యం. గట్టిగా పదడుగులు కూడా ఎగరలేని ఈ అల్పప్రాణి ఇంత తక్కువ వ్యవధిలో అంత దూరం ఎలా చేరగలదా అని ఆలోచించి, అబ్బుర పడ్డాను. ఇంతలో మీరు కనపడ్డారు. ఆ పని మీ చేతుల మీదుగా జరగగలదని గ్రహించి, నిశ్చింతగా వెళ్లిపోయాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా!’’ అంటూ నవ్వాడు.
‘‘విధివిధానం అమలు జరగడంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంటుందని తెలిసున్నప్పటికీ, నేనూ మాయకు లోనయ్యాను కదా!’’ అని వాపోతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు నారద మహర్షి.
No comments:
Post a Comment