శిఖండి
Sun,February 4, 2018 12:56 AM
బంధాలకు వారధిగా నిలచేవి రెండే రెండు. ప్రేమ, పగ. బంధాలను పెనవేస్తూ మనలోని ఆత్మబలాన్ని పెంచేలా చేసేది ప్రేమ. బంధాలను కాలరాస్తూ మనలోని అంతఃశక్తిని కఠినంగా మార్చి రాటుదేలేలా చేసేది పగ. ఈ రెండూ కూడా పెంచుకుంటే పెరిగేవే. తుంచుకుంటే క్షణకాలంలో రాలిపోయేవే. కానీ ఈ రెంటికీ అసామాన్యమైన శక్తి ఉంది. ఎంతదూరమైనా వెళ్ళేందుకు ప్రోద్బలం అందించే తిరుగులేని అస్ర్తాలు ప్రేమా, పగ. అందుకే అన్నారేమో ఒక ఆంగ్ల సామెత రూపంలో, ప్రేమలో, పగలో అన్నీ సముచితమేనని. జన్మజన్మాంతరాలంలో కూడా ఎడతెగని బంధంగా నిలిచిపోయేవి ప్రేమ, పగ. మనిషి సంకల్పాన్ని దృఢంగా చేసి నిర్ణయాలు తీసుకోవడంలో నిశితత్వానికీ, సునిశితకూ చోటునిస్తూ, ఎటువంటి అడుగైనా జంకనే లేక ముందుకు సాగిస్తూ, తన జీవితాన్నే అర్పించేందుకు వెనుకాడనీయని సంసిద్ధకు ఆస్కారమిస్తూ మనిషి తదనుగుణంగా మార్చుకోగల మహాశక్తులుగా మారగలవే ప్రేమ పగలూ. కానీ ప్రేమ కన్నీటి నీడలో కారుణ్యాన్నీ, అనుభూతినీ పంచితే పగ కారుణ్యాన్ని కరుడుగట్టేలా చేసి జీవిత మాధుర్యాన్ని అంతంచేసి జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది. పగకూ, ప్రతీకారానికీ నిలువెత్తు నిదర్శనంగా మారిన అంబ తనను తాను శిఖండిలా మార్చుకున్నది.
-ఇట్టేడు అర్కనందనా దేవి
Shikandi
హోత్రవాహనుడనే కాశీరాజు పెద్దకూతురే అంబ. అంబిక, అంబాలికలు ఈమె చెల్లెల్లు. అంబ తండ్రి తన ముగ్గురు కూతుర్లకూ స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి మహామహులైన రాజులెందరో వచ్చారు. ఎందుకంటే ఆ ముగ్గురి గుణగణాలు అంత గొప్పవి. అంబ తన మనసులోనే సాల్వుని వరించింది. ఈ విషయం సాల్వునికీ తెలిసింది. సాల్వ చక్రవర్తే తనను వరించి తీసుకెళుతాడనే విశ్వాసంతో, ఆనందంతో స్వయంవర సభకు వచ్చిన అంబకు అనూహ్య సంఘటన ఎదురైంది. ఆ స్వయంవరానికి భీష్ముడు వచ్చి అక్కడున్న రాజులందరినీ ఓడించి, ఘోరంగా పరాభవించి అంబ, అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్య్రవర్యునికిచ్చి వివాహం చేయాలనుకొని వారిని బలవంతంగా హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అంబభీష్ముని వేడుకుంటూ తాను సాల్వుని ప్రేమించాననీ, తనను వదిలేయమనీ అడుగుతుంది. ఇంకొకరిని మనసులో ఉంచుకొని తన తమ్ముడిని వివాహం చేసుకోవడం ఉచితం కాదని భీష్ముడు అంబను పంపించేస్తాడు. అక్కడినుంచి నేరుగా అంబ సాల్వుని చెంతకు వెళుతుంది. కానీ అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే కలిగింది. సాల్వుడు ఆమెను స్వీకరించలేననీ, ఇంకొకరు నిన్ను గెలిచి తీసుకెళ్ళిన క్షణం నువ్వు నువ్వు కావు. పరత్వం అంటిన నిన్ను నేనెలా చేపడతానని అంటాడు సాల్వుడు.
భీష్ముడు తన తమ్మునికిచ్చి వివాహం చేయాలని మమ్ములను తీసుకెళ్ళాడు. నేను నిన్నే వరించానని చెప్పి వచ్చాను. అతనూ అంగీకరించి పంపాడు. ఇందులో నా దోషమేమీ లేదు. అంబ ఎంత చెప్పినా సాల్వుడు వినిపించుకోలేదు. తనలో ప్రేమ భీష్ముని కారణంగానే దూరమైందనీ, తన జీవితం ఇలా కావడానికి భీష్ముడే బాధ్యుడనీ భావించి పగను పెంచుకుంది అంబ. ఎలాగైనా భీష్ముని ఓడించి అంతమొందించాలనే పట్టుదలతో తపస్సు చేయడం మొదలుపెట్టింది. దారీ తెన్నూ తెలియక పయనిస్తూ తగిన చోటు చూసుకొని తపస్సు ప్రారంభించగానే మునులు నీలాంటి సుకుమారమైన స్త్రీ కఠిన నియమాలతో కూడిన తపస్సు చేయడం తగదనీ, సహించలేవనీ నిరుత్సాహపరుస్తారు. కానీ ఆమె పగ వెనుకడుగు వేయలేదు. ఎవరూ చూడని ప్రదేశంలో తపస్సు చేయాలని నిశ్చయించుకొని ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో తన తండ్రి హోత్రవాహనుడు కనబడతాడు. జరిగిన విషయం చెప్పి చాలా విచారిస్తుంది అంబ. తామున్న చోటుకు మరునాడు పరశురాముడు వస్తున్నట్లు సమాచారం అందనీ, ఆయన్ను కలిస్తే తప్పక నీ పగ చల్లారుతు ఉందనీ నచ్చజెప్పుతాడు అంబ తండ్రి.
హోత్రవాహనుడు అంబతో కలిసి పరశురాముని దర్శించుకుంటాడు. తన కూతురి దుర్దశను వివరిస్తాడు. అంబతో పరశురాముడు సాల్వుని గర్వం అణచాలా? భీష్ముని పరాభవించాలా? అని అడిగితే భీష్మున్నే ఓడించమనీ, అప్పుడే తన పగతీరుతుందనీ అంటుంది. పరశురాముడు అంబను వెంటబెట్టుకొని భీష్ముని దగ్గరకు వెళతాడు. అంబను అతని తమ్మునికిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. వేరే వ్యక్తిని ఇష్టపడిన ఆమెను గ్రహించలేమని నిరాకరిస్తాడు భీష్ముడు. పరశురాముడు భీష్మునితో ఇరవైనాలుగు రోజులు యుద్ధం చేయగా, ఎడతెగని ఆయుధాన్ని ఆపడానికి ఋషులూ, చక్రవర్తులూ తరలివచ్చి మరీ యుద్ధాన్ని ఆపారు. పరశురాముడు చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాగైనా ఇక తానే భీష్ముని జయించాలని తీర్మానించుకొని ఘోరతపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా మరో జన్మలో ద్రుపద రాజుకు శిఖండిలా పుట్టి భీష్ముని మరణానికి హేతువవగలదనే వరం పొందుతుంది అంబ. తనకు తానుగా చితి పేర్చుకొని శరీరాన్ని దహించుకుంది. మరోజన్మలో ద్రుపదునికి పుత్రిగా జనించింది. ఆమెకు శిఖండిగా పేరుపెట్టారు. కానీ శిఖండి కూతురనే విషయాన్ని దాచి కొడుకులా ప్రచారం చేసి అంబ తల్లిదండ్రులు ద్రోణుని దగ్గర శస్త్ర, అస్త్ర విద్యలు నేర్పించారు. సమాజం కోసం ఆడపిైల్లెన శిఖండికి మరో ఆడపిల్లనిచ్చి పెండ్లి చేశారు. ఈ నిజం బయటపడగానే శిఖండి ఒక యక్షుని ద్వారా పురుషత్వాన్ని పొందాడు. ద్రుపదుని కొడుకుగా మారి నపుంసకత్వాన్ని ఆపాదించుకొని కురుక్షేత్రంలో పాండవుల పక్షంలో పోరాడాడు. భీష్మునికి స్త్రీలు, నపుంసకులతో యుద్ధం చేయననే నియమం ఉంది. అదే అదునుగా చేసుకొని పాండవులు భీష్ముని ముందుకు శిఖండిని పంపిస్తారు. శిఖండిని చూడగానే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. వెంటనే బాణాలు సంధించాడు అర్జునుడు. అలా అంబ.. శిఖండి వల్లనే భీష్మునికి మరణం కలుగడం, అంబ అదే శిఖండి పగ చల్లారడం జరిగింది. జీవితం ఎంత చిత్రమైందో కదా! ప్రేమలూ, పగలూ జీవితం రూపురేఖల్నే మార్చేస్తాయంటే అతిశయోక్తి కాదు.
భారతకథలో చాలా చిన్న పాత్రగా కనిపించే అంబ స్త్రీలోని ప్రేమ తత్వానికి చిహ్నమే అయినప్పటికీ పగకారణంగా స్త్రీత్వాన్నే వదులుకుంది. తనకు జరిగిన అన్యాయంలో అణువంతైనా తన తప్పు లేకపోయినా ఒక బాధ్యురాలిగా మిగిలిపోయిన ఆవేదనా రూపమే అంబ.
Sun,February 4, 2018 12:56 AM
బంధాలకు వారధిగా నిలచేవి రెండే రెండు. ప్రేమ, పగ. బంధాలను పెనవేస్తూ మనలోని ఆత్మబలాన్ని పెంచేలా చేసేది ప్రేమ. బంధాలను కాలరాస్తూ మనలోని అంతఃశక్తిని కఠినంగా మార్చి రాటుదేలేలా చేసేది పగ. ఈ రెండూ కూడా పెంచుకుంటే పెరిగేవే. తుంచుకుంటే క్షణకాలంలో రాలిపోయేవే. కానీ ఈ రెంటికీ అసామాన్యమైన శక్తి ఉంది. ఎంతదూరమైనా వెళ్ళేందుకు ప్రోద్బలం అందించే తిరుగులేని అస్ర్తాలు ప్రేమా, పగ. అందుకే అన్నారేమో ఒక ఆంగ్ల సామెత రూపంలో, ప్రేమలో, పగలో అన్నీ సముచితమేనని. జన్మజన్మాంతరాలంలో కూడా ఎడతెగని బంధంగా నిలిచిపోయేవి ప్రేమ, పగ. మనిషి సంకల్పాన్ని దృఢంగా చేసి నిర్ణయాలు తీసుకోవడంలో నిశితత్వానికీ, సునిశితకూ చోటునిస్తూ, ఎటువంటి అడుగైనా జంకనే లేక ముందుకు సాగిస్తూ, తన జీవితాన్నే అర్పించేందుకు వెనుకాడనీయని సంసిద్ధకు ఆస్కారమిస్తూ మనిషి తదనుగుణంగా మార్చుకోగల మహాశక్తులుగా మారగలవే ప్రేమ పగలూ. కానీ ప్రేమ కన్నీటి నీడలో కారుణ్యాన్నీ, అనుభూతినీ పంచితే పగ కారుణ్యాన్ని కరుడుగట్టేలా చేసి జీవిత మాధుర్యాన్ని అంతంచేసి జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది. పగకూ, ప్రతీకారానికీ నిలువెత్తు నిదర్శనంగా మారిన అంబ తనను తాను శిఖండిలా మార్చుకున్నది.
-ఇట్టేడు అర్కనందనా దేవి
Shikandi
హోత్రవాహనుడనే కాశీరాజు పెద్దకూతురే అంబ. అంబిక, అంబాలికలు ఈమె చెల్లెల్లు. అంబ తండ్రి తన ముగ్గురు కూతుర్లకూ స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి మహామహులైన రాజులెందరో వచ్చారు. ఎందుకంటే ఆ ముగ్గురి గుణగణాలు అంత గొప్పవి. అంబ తన మనసులోనే సాల్వుని వరించింది. ఈ విషయం సాల్వునికీ తెలిసింది. సాల్వ చక్రవర్తే తనను వరించి తీసుకెళుతాడనే విశ్వాసంతో, ఆనందంతో స్వయంవర సభకు వచ్చిన అంబకు అనూహ్య సంఘటన ఎదురైంది. ఆ స్వయంవరానికి భీష్ముడు వచ్చి అక్కడున్న రాజులందరినీ ఓడించి, ఘోరంగా పరాభవించి అంబ, అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్య్రవర్యునికిచ్చి వివాహం చేయాలనుకొని వారిని బలవంతంగా హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అంబభీష్ముని వేడుకుంటూ తాను సాల్వుని ప్రేమించాననీ, తనను వదిలేయమనీ అడుగుతుంది. ఇంకొకరిని మనసులో ఉంచుకొని తన తమ్ముడిని వివాహం చేసుకోవడం ఉచితం కాదని భీష్ముడు అంబను పంపించేస్తాడు. అక్కడినుంచి నేరుగా అంబ సాల్వుని చెంతకు వెళుతుంది. కానీ అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే కలిగింది. సాల్వుడు ఆమెను స్వీకరించలేననీ, ఇంకొకరు నిన్ను గెలిచి తీసుకెళ్ళిన క్షణం నువ్వు నువ్వు కావు. పరత్వం అంటిన నిన్ను నేనెలా చేపడతానని అంటాడు సాల్వుడు.
భీష్ముడు తన తమ్మునికిచ్చి వివాహం చేయాలని మమ్ములను తీసుకెళ్ళాడు. నేను నిన్నే వరించానని చెప్పి వచ్చాను. అతనూ అంగీకరించి పంపాడు. ఇందులో నా దోషమేమీ లేదు. అంబ ఎంత చెప్పినా సాల్వుడు వినిపించుకోలేదు. తనలో ప్రేమ భీష్ముని కారణంగానే దూరమైందనీ, తన జీవితం ఇలా కావడానికి భీష్ముడే బాధ్యుడనీ భావించి పగను పెంచుకుంది అంబ. ఎలాగైనా భీష్ముని ఓడించి అంతమొందించాలనే పట్టుదలతో తపస్సు చేయడం మొదలుపెట్టింది. దారీ తెన్నూ తెలియక పయనిస్తూ తగిన చోటు చూసుకొని తపస్సు ప్రారంభించగానే మునులు నీలాంటి సుకుమారమైన స్త్రీ కఠిన నియమాలతో కూడిన తపస్సు చేయడం తగదనీ, సహించలేవనీ నిరుత్సాహపరుస్తారు. కానీ ఆమె పగ వెనుకడుగు వేయలేదు. ఎవరూ చూడని ప్రదేశంలో తపస్సు చేయాలని నిశ్చయించుకొని ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో తన తండ్రి హోత్రవాహనుడు కనబడతాడు. జరిగిన విషయం చెప్పి చాలా విచారిస్తుంది అంబ. తామున్న చోటుకు మరునాడు పరశురాముడు వస్తున్నట్లు సమాచారం అందనీ, ఆయన్ను కలిస్తే తప్పక నీ పగ చల్లారుతు ఉందనీ నచ్చజెప్పుతాడు అంబ తండ్రి.
హోత్రవాహనుడు అంబతో కలిసి పరశురాముని దర్శించుకుంటాడు. తన కూతురి దుర్దశను వివరిస్తాడు. అంబతో పరశురాముడు సాల్వుని గర్వం అణచాలా? భీష్ముని పరాభవించాలా? అని అడిగితే భీష్మున్నే ఓడించమనీ, అప్పుడే తన పగతీరుతుందనీ అంటుంది. పరశురాముడు అంబను వెంటబెట్టుకొని భీష్ముని దగ్గరకు వెళతాడు. అంబను అతని తమ్మునికిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. వేరే వ్యక్తిని ఇష్టపడిన ఆమెను గ్రహించలేమని నిరాకరిస్తాడు భీష్ముడు. పరశురాముడు భీష్మునితో ఇరవైనాలుగు రోజులు యుద్ధం చేయగా, ఎడతెగని ఆయుధాన్ని ఆపడానికి ఋషులూ, చక్రవర్తులూ తరలివచ్చి మరీ యుద్ధాన్ని ఆపారు. పరశురాముడు చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాగైనా ఇక తానే భీష్ముని జయించాలని తీర్మానించుకొని ఘోరతపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా మరో జన్మలో ద్రుపద రాజుకు శిఖండిలా పుట్టి భీష్ముని మరణానికి హేతువవగలదనే వరం పొందుతుంది అంబ. తనకు తానుగా చితి పేర్చుకొని శరీరాన్ని దహించుకుంది. మరోజన్మలో ద్రుపదునికి పుత్రిగా జనించింది. ఆమెకు శిఖండిగా పేరుపెట్టారు. కానీ శిఖండి కూతురనే విషయాన్ని దాచి కొడుకులా ప్రచారం చేసి అంబ తల్లిదండ్రులు ద్రోణుని దగ్గర శస్త్ర, అస్త్ర విద్యలు నేర్పించారు. సమాజం కోసం ఆడపిైల్లెన శిఖండికి మరో ఆడపిల్లనిచ్చి పెండ్లి చేశారు. ఈ నిజం బయటపడగానే శిఖండి ఒక యక్షుని ద్వారా పురుషత్వాన్ని పొందాడు. ద్రుపదుని కొడుకుగా మారి నపుంసకత్వాన్ని ఆపాదించుకొని కురుక్షేత్రంలో పాండవుల పక్షంలో పోరాడాడు. భీష్మునికి స్త్రీలు, నపుంసకులతో యుద్ధం చేయననే నియమం ఉంది. అదే అదునుగా చేసుకొని పాండవులు భీష్ముని ముందుకు శిఖండిని పంపిస్తారు. శిఖండిని చూడగానే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. వెంటనే బాణాలు సంధించాడు అర్జునుడు. అలా అంబ.. శిఖండి వల్లనే భీష్మునికి మరణం కలుగడం, అంబ అదే శిఖండి పగ చల్లారడం జరిగింది. జీవితం ఎంత చిత్రమైందో కదా! ప్రేమలూ, పగలూ జీవితం రూపురేఖల్నే మార్చేస్తాయంటే అతిశయోక్తి కాదు.
భారతకథలో చాలా చిన్న పాత్రగా కనిపించే అంబ స్త్రీలోని ప్రేమ తత్వానికి చిహ్నమే అయినప్పటికీ పగకారణంగా స్త్రీత్వాన్నే వదులుకుంది. తనకు జరిగిన అన్యాయంలో అణువంతైనా తన తప్పు లేకపోయినా ఒక బాధ్యురాలిగా మిగిలిపోయిన ఆవేదనా రూపమే అంబ.
No comments:
Post a Comment