అశ్వత్థామ
మనిషి పుట్టుకతోనే తనకంటూ ఒక స్వభావాన్ని అందిపుచ్చుకొని కాలానికనుగుణంగా, పరిస్థితుల ప్రభావసిద్ధంగా ఎదుగుతుంటాడు. వ్యక్తిత్వం పరిపూర్ణత్వం సంతరించుకోవడంలో పూర్తిగా తనదైన బాధ్యతే ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం పెరిగే వాతావరణం, విభిన్న మనస్తత్వాలున్న మనుషుల స్వభావాలూ, ఆలోచనలూ మన వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ఎంత బలీయమైందంటే మనలోని తెలివితేటలూ, కుటుంబ నేపథ్యం, విలువలూ, ఆలోచనలూ, జీవిత దృక్పథాలూ ఏమాత్రం అక్కరకురాని స్థాయిలో మన వ్యక్తిత్వం రాటేదేలుతుంది. చివరికి ఎలాంటి జీవితం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళుతుందో తెలియరానంతగా మార్పు చోటు చేసుకుంటుంది. ఎటూ పాలుపోని సమయాన అజ్ఞాతవాసమే గతియని భావించి మనల్ని మనమే మరుగున పడేసుకునేంతగా జీవితాలు మారిపోతాయనే విషయాన్ని చారిత్రక అనుభవపటం కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది. ఆ విభిన్న జీవితశైలిని తనకూ ఆపాదించుకున్న అశ్వత్థామ తాను నమ్మిన ధర్మం కోసం అధర్మపక్షంలో నిలబడి అన్యాయానికి ఒడిగట్టి అడవుల పాలయ్యాడు.
-ప్రమద్వర
భారత కథలో ధర్మజుడితో అబద్ధం ఆడించాల్సిన పరిస్థితిలో అశ్వత్థామ పేరును ఉపయోగించుకోవడం వరకే మనకు తెలుసు. కానీ అతని జీవితం చాలా లోతైనది.
కురుపాండవులకూ, వారి కుటుంబాలకూ గురువైన ద్రోణాచార్యుని ఏకైక పుత్రుడే అశ్వత్థామ. ఇతను పుట్టగానే చాలా పెద్దగా అరిచినందువల్ల గుర్రంలా రావం ఆ అరుపు వల్ల ఈతనికి అశ్వత్థామ అని పేరుపెట్టారట. అశ్వత్థామ కూడా కురుపాండవులతో పాటే విద్యలు నేర్చుకుంటూ, వారి సహవాసంలోనే పెరిగాడు. ఆ ఇరుపక్షాలపట్లా అశ్వత్థామ సుముఖంగానే ఉండేవాడు. అందుకే అశ్వత్థామను అర్జునుడు తనను మించిన వాడవుతాడేమోననే ఆలోచన బాధిస్తూ ఉండేది. అది కేవలం స్వార్థంలానే ఉండేది కానీ అతనిలో ద్వేషాన్ని పెంచిపోషించలేదు. ద్రోణుడు తండ్రిగా అశ్వత్థామను చాలా గారాబంగా పెంచినప్పటికీ, ఒక గురువులా మాత్రం విద్యార్థిగానే తర్ఫీదునిచ్చేవాడు. ఆ విషయం అశ్వత్థామకు ద్రోణుడు బ్రహ్మశరోనామశాస్త్రం అనేదాన్ని ఉపదేశించాడు. అది అగస్త్యుడు ద్రోణునికిస్తే, ద్రోణుడు అర్జునునికీ, అశ్వత్థామకూ ఉపదేశించాడు. ఆ గర్వం మాత్రం అశ్వత్థామలో చాలా ఉండేది. పైగా అశ్వత్థామ చీకట్లో కూడా బాణం వేయగల సమర్థుడు.
అశ్వత్థామ ఒకసారి కృష్ణుని కలిసి తన దగ్గరున్న దివ్యాస్త్రం ఇస్తానూ, తనకు సుదర్శన చక్రం ఇవ్వమని అడుగుతాడు. కృష్ణుడందుకు అర్జునుడే నన్నింతవరకూ చక్రమివ్వమని అడుగలేదు. అయినా అడిగినవారికి ఇవ్వడమే నాకు తెలుసు, దానికి బదులుగా నేనేమీ కోరుకోననని చెప్పి తన దగ్గరున్న ఆయుధాలన్నీ అశ్వత్థామ ముందుంచి నీకు కావలసింది తీసుకోమంటాడు కృష్ణుడు. కానీ దానిని తన రెండు చేతులతోనూ ఎత్తలేక ఊరుకుండిపోతాడు. ఎవరితో యుద్ధం చేయడానికి దీనిని అడిగావని కృష్ణుడు అశ్వత్థామనడుగగా, నీతో పోరాడి నేను గెలువలేను, అందుకే దీనినడిగానంటాడు. కృష్ణుడు అశ్వత్థామకు భరోసానిస్తూ నేను నీతో తలపడనని చెబుతాడు. అయినా కూడా తనవద్ద ఉన్న అస్త్రం పట్ల గర్వం అణుగలేదు అశ్వత్థామలో.
కురుపాండవుల మధ్య పెరిగిన వైషమ్యాలతో అశ్వత్థామకు సంబంధం లేకపోయినప్పటికీ, దుర్యోధనుని ఇంట ఉప్పు తిన్న విశ్వాసానికి అతని పక్షంలోనే నిలిచాడు. భీష్ముడూ, తన తండ్రి, దుర్యోధనుడూ రణరంగంలో పాండవుల వల్లనే మరణించారనీ, వారిపై పగ తీర్చుకోవాలనీ సంకల్పించుకున్నాడు అశ్వత్థామ. పైగా చివరి శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనునితో కృష్ణుడు చూస్తుండగానే ఒక్కరు కూడా మిగులకుండా నాచే చంపబడతారని శపథం చేస్తాడు. శపథం చేసిన నాటి రాత్రి పగతో రగులుతూ, నిద్రపోలేక ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తుండగా, గుడ్లగూబ ఒకటి చెట్లు మీద ఉన్న చిన్నచిన్న పక్షులను పొడిచిపొడిచి తినసాగింది. ఇంతలో అశ్వత్థామకు ఆలోచన తట్టింది రాత్రివేళలో నిద్రిస్తున్న పక్షుల్ని గుడ్లగూబ పొడుచుకుతిన్నట్టుగానే, శిబిరాలలో నిద్రపోతున్న పాండవులను నిద్రలోనే చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులకు తన ఆలోచన చెబితే అది క్షత్రియ ధర్మం కాదని వారిస్తారు. కానీ అశ్వత్థామ అబద్ధం చెప్పి నా తండ్రినీ, నీతి తప్పి నాకు అన్నం పెట్టిన నా చక్రవర్తి దుర్యోధనున్నీ చంపిన పాండవులను నిద్రలోనే చంపడం తగు నిర్ణయం. దాన్ని అమలుచేసి నా తండ్రి, నా చక్రవర్తి రుణాన్ని తీర్చుకుంటానని అంటాడు అశ్వత్థామ.
అశ్వత్థామ ఆక్రోశంతో వెళుతూ, తన దగ్గరున్న దివ్యాస్రాలతో పాటు, శివఖడ్గాన్నీ వరంగా పొందుతాడు. అంతే పాండవుల శిబిరాలపైచ విరుచుకుపడి ముందుగా నిద్రిస్తున్న దుష్టమ్యమున్నీ, శిఖండినీ నిర్దయగా నరికేస్తాడు. తర్వాత పాండవ శిబిరాలన్నింటికీ నిప్పుపెడతాడు. పాండవ సైన్యమంతా అగ్నికి ఆహుతవుతూ చెల్లాచెదురైంది. విషయం తెలుసుకొని కృష్ణునితో సహా అక్కడికి చేరుకున్న ద్రౌపదీ పాండవులకు ఉపపాండవులు చనిపోయారని తెలుస్తుంది. దానికి కారణమైన అశ్వత్థామను వెదుకుతూ బయలుదేనికవారికి గంగాతీరంలో వ్యాసుని ఆశ్రయంతో ప్రాణం దక్కించుకోవాలన్న అశ్వత్థామ కనిపిస్తాడు. అశ్వత్థామ తన దివ్యాస్ర్తాన్ని ప్రయోగిస్తే, కృష్ణుని మాటపై అర్జునుడూ అదే అస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. చేసేది లేక ఒక దర్భను తీసి తన తపః శక్తితో పాండవవంశం నాశనం కావాలని శపిస్తూ ఉత్తర గర్భంలోని అభిమన్యునిపైకి ప్రయోగిస్తాడు. కృష్ణుడు దాని ప్రయోగాన్ని అడ్డుకొని అభిమన్యుడు రాజ్యం ఏలుతాడనీ, నీవే దుర్భరమైన జీవితం గడుపుతావనీ శపిస్తాడు. అశ్వత్థామను చంపకుండా అతని శిరోమణిని తీసుకొని అతని గర్వం అణిగితే అతనూ చచ్చినట్లేనని భావిస్తారు పాండవులు. చివరికి విరాగియై అడవుల పాలవుతాడు అశ్వత్థామ. ఉన్నత కుటుంబంలో పుట్టుక, మంచి విద్యాబుద్ధులూ, తన శక్తిని ఆసరాగా చేసుకొని సాధించిన దివ్యాస్ర్తాలూ, తనదైన అసలు వ్యక్తిత్వం దుర్యోధనుని మీద స్వామిభక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేసాయేగానీ ధర్మాధర్మాల విచక్షణకు నోచుకోలేదు అశ్వత్థామ. అశ్వత్థామ హతః అన్నమాట అబద్ధమే అయినా వ్యక్తిత్వ నిరూపణలో నిజమే అయింది.
మనిషి పుట్టుకతోనే తనకంటూ ఒక స్వభావాన్ని అందిపుచ్చుకొని కాలానికనుగుణంగా, పరిస్థితుల ప్రభావసిద్ధంగా ఎదుగుతుంటాడు. వ్యక్తిత్వం పరిపూర్ణత్వం సంతరించుకోవడంలో పూర్తిగా తనదైన బాధ్యతే ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం పెరిగే వాతావరణం, విభిన్న మనస్తత్వాలున్న మనుషుల స్వభావాలూ, ఆలోచనలూ మన వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ఎంత బలీయమైందంటే మనలోని తెలివితేటలూ, కుటుంబ నేపథ్యం, విలువలూ, ఆలోచనలూ, జీవిత దృక్పథాలూ ఏమాత్రం అక్కరకురాని స్థాయిలో మన వ్యక్తిత్వం రాటేదేలుతుంది. చివరికి ఎలాంటి జీవితం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళుతుందో తెలియరానంతగా మార్పు చోటు చేసుకుంటుంది. ఎటూ పాలుపోని సమయాన అజ్ఞాతవాసమే గతియని భావించి మనల్ని మనమే మరుగున పడేసుకునేంతగా జీవితాలు మారిపోతాయనే విషయాన్ని చారిత్రక అనుభవపటం కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది. ఆ విభిన్న జీవితశైలిని తనకూ ఆపాదించుకున్న అశ్వత్థామ తాను నమ్మిన ధర్మం కోసం అధర్మపక్షంలో నిలబడి అన్యాయానికి ఒడిగట్టి అడవుల పాలయ్యాడు.
-ప్రమద్వర
భారత కథలో ధర్మజుడితో అబద్ధం ఆడించాల్సిన పరిస్థితిలో అశ్వత్థామ పేరును ఉపయోగించుకోవడం వరకే మనకు తెలుసు. కానీ అతని జీవితం చాలా లోతైనది.
కురుపాండవులకూ, వారి కుటుంబాలకూ గురువైన ద్రోణాచార్యుని ఏకైక పుత్రుడే అశ్వత్థామ. ఇతను పుట్టగానే చాలా పెద్దగా అరిచినందువల్ల గుర్రంలా రావం ఆ అరుపు వల్ల ఈతనికి అశ్వత్థామ అని పేరుపెట్టారట. అశ్వత్థామ కూడా కురుపాండవులతో పాటే విద్యలు నేర్చుకుంటూ, వారి సహవాసంలోనే పెరిగాడు. ఆ ఇరుపక్షాలపట్లా అశ్వత్థామ సుముఖంగానే ఉండేవాడు. అందుకే అశ్వత్థామను అర్జునుడు తనను మించిన వాడవుతాడేమోననే ఆలోచన బాధిస్తూ ఉండేది. అది కేవలం స్వార్థంలానే ఉండేది కానీ అతనిలో ద్వేషాన్ని పెంచిపోషించలేదు. ద్రోణుడు తండ్రిగా అశ్వత్థామను చాలా గారాబంగా పెంచినప్పటికీ, ఒక గురువులా మాత్రం విద్యార్థిగానే తర్ఫీదునిచ్చేవాడు. ఆ విషయం అశ్వత్థామకు ద్రోణుడు బ్రహ్మశరోనామశాస్త్రం అనేదాన్ని ఉపదేశించాడు. అది అగస్త్యుడు ద్రోణునికిస్తే, ద్రోణుడు అర్జునునికీ, అశ్వత్థామకూ ఉపదేశించాడు. ఆ గర్వం మాత్రం అశ్వత్థామలో చాలా ఉండేది. పైగా అశ్వత్థామ చీకట్లో కూడా బాణం వేయగల సమర్థుడు.
అశ్వత్థామ ఒకసారి కృష్ణుని కలిసి తన దగ్గరున్న దివ్యాస్త్రం ఇస్తానూ, తనకు సుదర్శన చక్రం ఇవ్వమని అడుగుతాడు. కృష్ణుడందుకు అర్జునుడే నన్నింతవరకూ చక్రమివ్వమని అడుగలేదు. అయినా అడిగినవారికి ఇవ్వడమే నాకు తెలుసు, దానికి బదులుగా నేనేమీ కోరుకోననని చెప్పి తన దగ్గరున్న ఆయుధాలన్నీ అశ్వత్థామ ముందుంచి నీకు కావలసింది తీసుకోమంటాడు కృష్ణుడు. కానీ దానిని తన రెండు చేతులతోనూ ఎత్తలేక ఊరుకుండిపోతాడు. ఎవరితో యుద్ధం చేయడానికి దీనిని అడిగావని కృష్ణుడు అశ్వత్థామనడుగగా, నీతో పోరాడి నేను గెలువలేను, అందుకే దీనినడిగానంటాడు. కృష్ణుడు అశ్వత్థామకు భరోసానిస్తూ నేను నీతో తలపడనని చెబుతాడు. అయినా కూడా తనవద్ద ఉన్న అస్త్రం పట్ల గర్వం అణుగలేదు అశ్వత్థామలో.
కురుపాండవుల మధ్య పెరిగిన వైషమ్యాలతో అశ్వత్థామకు సంబంధం లేకపోయినప్పటికీ, దుర్యోధనుని ఇంట ఉప్పు తిన్న విశ్వాసానికి అతని పక్షంలోనే నిలిచాడు. భీష్ముడూ, తన తండ్రి, దుర్యోధనుడూ రణరంగంలో పాండవుల వల్లనే మరణించారనీ, వారిపై పగ తీర్చుకోవాలనీ సంకల్పించుకున్నాడు అశ్వత్థామ. పైగా చివరి శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనునితో కృష్ణుడు చూస్తుండగానే ఒక్కరు కూడా మిగులకుండా నాచే చంపబడతారని శపథం చేస్తాడు. శపథం చేసిన నాటి రాత్రి పగతో రగులుతూ, నిద్రపోలేక ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తుండగా, గుడ్లగూబ ఒకటి చెట్లు మీద ఉన్న చిన్నచిన్న పక్షులను పొడిచిపొడిచి తినసాగింది. ఇంతలో అశ్వత్థామకు ఆలోచన తట్టింది రాత్రివేళలో నిద్రిస్తున్న పక్షుల్ని గుడ్లగూబ పొడుచుకుతిన్నట్టుగానే, శిబిరాలలో నిద్రపోతున్న పాండవులను నిద్రలోనే చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులకు తన ఆలోచన చెబితే అది క్షత్రియ ధర్మం కాదని వారిస్తారు. కానీ అశ్వత్థామ అబద్ధం చెప్పి నా తండ్రినీ, నీతి తప్పి నాకు అన్నం పెట్టిన నా చక్రవర్తి దుర్యోధనున్నీ చంపిన పాండవులను నిద్రలోనే చంపడం తగు నిర్ణయం. దాన్ని అమలుచేసి నా తండ్రి, నా చక్రవర్తి రుణాన్ని తీర్చుకుంటానని అంటాడు అశ్వత్థామ.
అశ్వత్థామ ఆక్రోశంతో వెళుతూ, తన దగ్గరున్న దివ్యాస్రాలతో పాటు, శివఖడ్గాన్నీ వరంగా పొందుతాడు. అంతే పాండవుల శిబిరాలపైచ విరుచుకుపడి ముందుగా నిద్రిస్తున్న దుష్టమ్యమున్నీ, శిఖండినీ నిర్దయగా నరికేస్తాడు. తర్వాత పాండవ శిబిరాలన్నింటికీ నిప్పుపెడతాడు. పాండవ సైన్యమంతా అగ్నికి ఆహుతవుతూ చెల్లాచెదురైంది. విషయం తెలుసుకొని కృష్ణునితో సహా అక్కడికి చేరుకున్న ద్రౌపదీ పాండవులకు ఉపపాండవులు చనిపోయారని తెలుస్తుంది. దానికి కారణమైన అశ్వత్థామను వెదుకుతూ బయలుదేనికవారికి గంగాతీరంలో వ్యాసుని ఆశ్రయంతో ప్రాణం దక్కించుకోవాలన్న అశ్వత్థామ కనిపిస్తాడు. అశ్వత్థామ తన దివ్యాస్ర్తాన్ని ప్రయోగిస్తే, కృష్ణుని మాటపై అర్జునుడూ అదే అస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. చేసేది లేక ఒక దర్భను తీసి తన తపః శక్తితో పాండవవంశం నాశనం కావాలని శపిస్తూ ఉత్తర గర్భంలోని అభిమన్యునిపైకి ప్రయోగిస్తాడు. కృష్ణుడు దాని ప్రయోగాన్ని అడ్డుకొని అభిమన్యుడు రాజ్యం ఏలుతాడనీ, నీవే దుర్భరమైన జీవితం గడుపుతావనీ శపిస్తాడు. అశ్వత్థామను చంపకుండా అతని శిరోమణిని తీసుకొని అతని గర్వం అణిగితే అతనూ చచ్చినట్లేనని భావిస్తారు పాండవులు. చివరికి విరాగియై అడవుల పాలవుతాడు అశ్వత్థామ. ఉన్నత కుటుంబంలో పుట్టుక, మంచి విద్యాబుద్ధులూ, తన శక్తిని ఆసరాగా చేసుకొని సాధించిన దివ్యాస్ర్తాలూ, తనదైన అసలు వ్యక్తిత్వం దుర్యోధనుని మీద స్వామిభక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేసాయేగానీ ధర్మాధర్మాల విచక్షణకు నోచుకోలేదు అశ్వత్థామ. అశ్వత్థామ హతః అన్నమాట అబద్ధమే అయినా వ్యక్తిత్వ నిరూపణలో నిజమే అయింది.
No comments:
Post a Comment