శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకార విశేషాలు.
శైలపుత్రి
శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!
నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు నంది వాహనంపై త్రిశూలం ధరించి, హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. ఈ రోజున భక్తి విశ్వాసాలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ దీవెనగా అందిస్తుంది.
నైవేద్యం: (శ్రీశైల సంప్రదాయం) కదంబం (సాంబారు అన్నం) మినపవడలు, గోధుమరవ్వ - చక్కెర పాయసం. బెల్లం, మిరియాలు, యాలకులతో పానకం.
నైవేద్యం: పులిహోర (చిత్రాన్నం)
పాహిమాం త్రిపుర సుందరీ
13-10-2015 21:43:36
‘‘హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్’’
శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. త్రిశతీ పారాయణం చేస్తుంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.
నైవేద్యం: పాయసం
శ్రీ గాయత్రీదేవి
గాయత్రీం భజే
‘‘ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్,
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే’’
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రములకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది.
‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.
నైవేద్యం: అల్లపుగారెలు
అన్నపూర్ణాదేవి
అన్నపూర్ణే సదాపూజితే
‘‘ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
దసరా ఉత్సవాలలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. శ్వేతవర్ణ పుష్పాలతో అమ్మను పూజించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం: దధ్యోదనం, కట్టెపొంగలి
శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి
నమామి లలితా
‘‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్’’
త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో దర్శనమిస్తుంది. లక్ష్మీసరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చెయ్యాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.
నైవేద్యం: అల్లం గారెలు
శ్రీ సరస్వతీదేవి
సరస్వతీ నమస్తుభ్యం
(ఆశ్వయుజ శుద్ధ షష్టి, సోమవారం (మూలా నక్షత్రం) రోజున)
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వసా్త్రన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట ప్రాముఖ్యం ఉంది. దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
నైవేద్యం: దద్ధోజనం
శ్రీ దుర్గాదేవి
పాహిమాం పరమేశ్వరీ
(ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మంగళవారం రోజున)
‘‘సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే’’
దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయి. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకీ పారాయణం చేయాలి.
నైవేద్యం: కదంబం
శ్రీ మహిషాసురమర్దినీదేవి
జయజయహే మహిషాసురమర్దిని
(ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం)
మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ
అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్దినీదేవిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.
నైవేద్యం: బెల్లమన్నం, పులిహోర, గారెలు, వడపప్పు, పానకం
శ్రీ రాజరాజేశ్వరీదేవి
రక్షమాం రాజరాజేశ్వరి
(ఆశ్వయుజ శుద్ధ దశమి, గురువారం)
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు ఈమె ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా అమ్మ పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.
నైవేద్యం: పరమాన్నం
పాహిమాం త్రిపుర సుందరీ
13-10-2015 21:43:36
‘‘హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్’’
శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. త్రిశతీ పారాయణం చేస్తుంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.
నైవేద్యం: పాయసం
రేపటి అలంకారం: శ్రీ గాయత్రి దేవి
No comments:
Post a Comment